Shami: నా అవసరం ఉందనుకోవాలి.. మార్పును ఎవరైనా అంగీకరించాల్సిందే: షమీ

ఇంటర్నెట్ డెస్క్: భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ (Shami) కెరీర్ ఇప్పుడు డోలాయమానంలో పడింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొన్న అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల దేశవాళీలో ఆడి తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నాడు. కానీ, ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవుతాడని చాలామంది ఊహించారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం అవకాశం కల్పించలేదు. దీంతో అతడి కెరీర్ దాదాపు ముగిసినట్లేనని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షమీ మాత్రం రంజీల్లో ఆడి మళ్లీ జాతీయజట్టులోకి వస్తానని దీమా వ్యక్తంచేశాడు. ఎందుకు ఎంపిక కాలేదని తన సమాధానం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని షమీ వ్యాఖ్యానించాడు.
‘‘నాపై సోషల్ మీడియాలో రూమర్లు, మీమ్స్ చాలా వచ్చాయి. ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపిక కాకపోవడంపై నా అభిప్రాయం చెప్పాలని అభిమానులు కోరుకున్నారు. ఈ సందర్భంగా ఒక్క మాట చెబుతున్నా. జట్టుకు ఎంపిక చేయడమనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్షన్ కమిటీ బాధ్యత. కోచ్, కెప్టెన్కు నా అవసరం ఉందనిపించాలి. వారే నన్ను ఎంపిక చేయాలి. ఇంకాస్త సమయం కావాలని వారు భావిస్తే.. అందుకోసం నేను సన్నద్ధంగానే ఉంటా’’ అని షమీ తెలిపాడు.
ఫిట్నెస్ బాగుంది..
ఆస్ట్రేలియాతో సిరీస్లకు జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్కు ఓ ప్రశ్న ఎదురైంది. షమీ ‘ఫిట్నెస్’ ఎలా ఉందని ప్రశ్నించగా.. తమకు సరైన సమాచారం లేదంటూ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై షమీ స్పందిస్తూ ‘‘ నా ఫిట్సెస్ చాలా బాగుంది. మైదానానికి దూరంగా ఉన్నప్పుడు మనకు మనమే స్ఫూర్తి పొందాలి. నేను దులీప్ ట్రోఫీలో ఆడా. చాలా సౌకర్యంగా అనిపించింది. బౌలింగ్ లయ కూడా బాగుంది. దాదాపు 35 ఓవర్లపాటు బౌలింగ్ చేశా. నాకెక్కడా సమస్యగా అనిపించలేదు’’ అని షమీ వెల్లడించాడు.
మనం అంగీకరించాల్సిందే..
‘‘మీరు నన్ను అడిగిన ప్రశ్నకు చాలా మీమ్స్ వచ్చాయి. ఇందులో నాకెలాంటి అభ్యంతరం, పొరపాటు కనిపించలేదు. బీసీసీఐ, సెలక్టర్లు, కోచ్లు తీసుకున్న నిర్ణయం. శుభ్మన్ ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను నడిపిస్తున్నాడు. అతడికి మంచి అనుభవం ఉంది. ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సిందే. బీసీసీఐ శుభ్మన్ గిల్కు ఇచ్చింది. మనమంతా దానిని అంగీకరించాల్సిందే. కెప్టెన్సీ విషయంలో అనవసరమైన ప్రశ్నలు వేయక్కర్లేదు. ఇదేమీ మన చేతుల్లో ఉండదు. ఇవాళ ఒకరు ఉంటారు.. రేపు మరొకరు. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ’’ అని షమీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

హర్మన్ ప్రీత్.. అమన్జ్యోత్కు పీసీఏ ఎంత రివార్డ్ ప్రకటించిందంటే..!
టీమ్ఇండియా (Team India) మహిళల వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన తమ రాష్ట్ర క్రికెటర్లైన హర్మన్ ప్రీత్ కౌర్, అమన్జ్యోత్ కౌర్కు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) రూ.11 లక్షల రివార్డ్ను ప్రకటించింది. - 
                                    
                                        

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్.. భారత్ ఏ స్క్వాడ్ ప్రకటన.. చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (Asia Cup Rising Stars) 2025 ప్రారంభం కానుంది. - 
                                    
                                        

వన్డే వరల్డ్ కప్ విజయం.. అమాంతం పెరిగిన భారత క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ!
కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ భారత మహిళల జట్టు (Team India) వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. - 
                                    
                                        

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
మహిళల వన్డే వరల్డ్ కప్ను తొలిసారిగా భారత జట్టు (Team India) కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. - 
                                    
                                        

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా (Team India) 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారతజట్టు విశ్వవిజేతగా నిలిచింది. - 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్ముఖ్.. చెస్ ప్రపంచకప్లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. - 
                                    
                                        

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
ప్రపంచ మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమ్ఇండియా (Team India) కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై చర్చ నడుస్తోంది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్యాదవ్ కౌంటర్ దాఖలు
 - 
                        
                            

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 - 
                        
                            

భారత్లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
 


