Shreyas Iyer : శ్రేయస్‌.. లెగ్‌ స్పిన్‌ను ఓ కంట కనిపెట్టాలి: ఆకాశ్‌ చోప్రా

లెగ్‌ స్పిన్నర్లను ఆడటంలో కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ఇబ్బంది పడుతున్నాడని....

Published : 03 Apr 2022 01:37 IST

ఇంటర్నెట్ డెస్క్: లెగ్‌ స్పిన్నర్లను ఆడటంలో కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ ఇబ్బంది పడుతున్నాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఆ విభాగంలో శ్రేయస్‌ మెరుగవ్వాల్సిన అవసరం ఉందని సూచించాడు. వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచి టీ20 లీగ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. అయితే పంజాబ్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్‌ రాహుల్ చాహర్ రంగంలోకి దిగి వెంటవెంటనే నితీశ్‌ (0), శ్రేయస్‌ (26)ను ఔట్‌ చేశాడు. 

‘‘లెగ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో శ్రేయస్‌ కాస్త ఇబ్బంది పడినట్లుగా ఉన్నాడు. సిక్స్‌లు కొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బెంగళూరుతో మ్యాచ్‌లోనూ హసరంగ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అందుకే శ్రేయస్‌ తన బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో ఆండ్రూ రస్సెల్‌ కేవలం 31 బంతుల్లోనే 70 పరుగులు చేసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని