Team India: గ్యాప్ లేకుండా సిరీస్ల మీద సిరీస్లు.. బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) క్షణం తీరిక లేకుండా వరుస మ్యాచ్లతో బిజీ బిజీగా మారిపోయింది. ఒక సిరీస్కు, మరో సిరీస్కు మధ్య కనీసం వారం రోజుల విరామం కూడా ఉండట్లేదు. ఆసియా కప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజులకే వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్లో తలపడిన భారత జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. వన్డే సిరీస్ పూర్తయిన మూడు రోజులకే టీ20 సిరీస్ మొదలవుతోంది. వన్డేల్లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లు.. టీ20 సిరీస్లో ఉన్నారు. అది ఎంత వైట్ బాల్ క్రికెట్ అయినా ఈ గ్యాప్ సరిపోతుందా? అనేదే ఇప్పుడు చర్చ. ఈ క్రమంలో బీసీసీఐ ప్లానింగ్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఏంటి అనేది అర్థం కావడం లేదు.
విండీస్తో టెస్టు సిరీస్లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఆసీస్తో వన్డే మ్యాచ్ల కోసం బయలుదేరారు. ఇక మూడు ఫార్మాట్లలో రెగ్యులర్గా ఆడే కొంతమంది ప్లేయర్లు నెలలతరబడి ఇంటి ముఖం చూడట్లేదు. ఇలా తీరిక లేకుండా మ్యాచ్లు ఆడితే ఆటగాళ్లపై పనిభారం పెరిగిపోతుంది. త్వరగా అలసిపోతారు. గాయాల బారినపడే అవకాశమూ లేకపోలేదు. శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఆసియా కప్లో 20 రోజుల వ్యవధిలో ఏడు మ్యాచ్లు ఆడారు. ఆ టోర్నీ ఇలా ముగిసిందో, లేదో వెంటనే కరేబియన్ టీమ్తో జరిగిన తొలి టెస్టులో గిల్, కుల్దీప్ బరిలోకి దిగారు.
విండీస్తో సిరీస్ ముగిసిన వెంటనే వీరు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేలోపే ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా లేకుండానే వన్డే సిరీస్ మొదలైంది. ఇప్పుడు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి ఐదు టీ20ల సిరీస్ మొదలుపెడుతున్నారు. వన్డేల్లో ఆడిన శుభ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ టీ20 మోడ్ ఆన్ చేసి ఇటొచ్చేస్తున్నారు. ఇలా తీరిక లేని షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకు సరైన విశ్రాంతి దొరకడం కష్టమవుతోంది. ఇది వ్యక్తిగత ప్రదర్శనతోపాటు జట్టు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పనిభారం నిర్వహణ కొందరికేనా?
కొంతమంది ఆటగాళ్ల విషయంలో మాత్రం వర్క్లోడ్ మేనేజ్మెంట్ సరిగ్గా అమలవుతోంది. ఆసియా కప్లో బుమ్రాకు రెండు మ్యాచ్ల్లో విశ్రాంతి ఇచ్చారు. ఈ పేసర్ను పనిభారం నిర్వహణ దృష్ట్యా ఆసీస్ వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. సిరాజ్కు ఆసియా కప్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ఆసీస్తో ఐదు టీ20లకు ఎంపికైన సూర్యకుమార్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె వంటి ప్లేయర్లకు నెల రోజులు విశ్రాంతి దొరికింది. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్గా ఆడుతున్న ఆటగాళ్లలో కొంతమంది ప్లేయర్ల విషయంలో టీమ్ మేనేజ్మెంట్ రిస్క్ చేస్తోందనే చర్చ నడుస్తోంది. వర్క్లోడ్ గురించి పట్టించుకోకుండా వరుసగా మ్యాచ్లు ఆడుతున్న ప్లేయర్లపై మేనేజ్మెంట్ వెంటనే ఈ పరిస్థితిపై ఫోకస్ పెట్టి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్నట్లు గిల్ను వరుస సిరీస్లు గ్యాప్ ఇవ్వకుండా ఆడిస్తున్నారు ఇబ్బంది అవ్వదా అని ఆ మధ్య చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ను అడిగితే.. ‘కుర్రాడు కదా ఫర్వాలేదు’ అన్నారు. అంటే కుర్రాళ్లతో రిస్క్ చేస్తున్నారనేగా?
రెస్ట్ లేకపోవడమే కారణమా?
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను భారత్ 1-2తో చేజార్చుకుంది. ఈ సిరీస్లో గిల్, కేఎల్ రాహుల్ లాంటి కీలక ఆటగాళ్లు ఆశించిన మేర ప్రదర్శన చేయలేదు. విండీస్తో టెస్టు మ్యాచ్లు ముగియగానే సరైన విశ్రాంతి లేకుండా ఆస్ట్రేలియాకు బయలుదేరడం, అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలోపే వన్డే సిరీస్ మొదలైంది. అప్పటివరకు భారత పిచ్లకు అలవాటు పడిన బ్యాటర్లు, బౌలర్లు.. ఉన్నట్టుండి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే బౌన్సీ పిచ్లపై ఆడారు. ఇది కూడా టీమ్ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి రెస్ట్ లేకుండా మ్యాచ్లు ఆడిస్తే ప్రదర్శన పడిపోతుందని తెలిసినా మేనేజ్మెంట్ ఎందుకు రిస్క్ చేస్తుందో అర్థం కావడం లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఉండటంతో ఇప్పటి నుంచే కీలక ఆటగాళ్ల విషయంలో మేనేజ్మెంట్ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆమె బౌలింగే మాకు సర్ప్రైజ్.. మేం సిద్ధం కాలేకపోయాం : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా
భారత జట్టు ప్రయోగించిన ఓ అస్త్రం తమ విజయాన్ని అడ్డుకుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ తెలిపింది. - 
                                    
                                        
ఫైనల్కు ముందు సచిన్తో చాట్.. అంతా మార్చేసింది: షెఫాలి వర్మ
Shafali Verma: మ్యాచ్కు ముందు సచిన్తో మాట్లాడటం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని షెఫాలి వెల్లడించింది. - 
                                    
                                        

అమ్మాయిల పట్టు.. బంతి చేయి దాటితే ఒట్టు..!
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఈ మూడింట్లో ఏది విఫలమైనా ఛాంపియన్గా నిలవడం కష్టం. కానీ, భారత మహిళా జట్టు మాత్రం మూడింట్లోనూ సత్తా చాటింది. - 
                                    
                                        

మ్యాచ్ బాల్ వేళ.. 1983లో గావస్కర్.. నేడు హర్మన్ప్రీత్
తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన అనంతరం హర్మన్ప్రీత్ బంతిని పాకెట్లో భద్రంగా దాచిపెట్టుకొన్న తీరు క్రికెట్ అభిమానులకు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ను గుర్తు చేసింది. - 
                                    
                                        

వైరల్ పిక్.. గురుభక్తి చాటుకున్న హర్మన్ప్రీత్
మైదానంలో హర్మన్ప్రీత్ తన గురువు కాళ్లకు నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. - 
                                    
                                        

‘మీరు భావితరాల ఆడ పిల్లలకు ఘన వారసత్వాన్ని ఇచ్చారు’
భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ను నెగ్గడంపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తమ స్పందనను తెలియజేశారు. - 
                                    
                                        

ఇంకా కలలోనే ఉన్నామా: జెమీమా-మంధాన కప్ ఫొటోలు వైరల్
Womens World Cup: వరల్డ్ కప్ సాధించిన అమ్మాయిల జట్టు ఆనందంలో మునిగితేలుతోంది. - 
                                    
                                        

వన్డే ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా
తొలిసారి ప్రపంచ కప్ను నెగ్గిన భారత మహిళా జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. హర్మన్ సేనకు భారీ నజరానా ఇస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్ మజుందార్
భారత మహిళా జట్టు అద్భుతం చేసిందని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కొనియాడాడు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని విజేతగా నిలవడం గొప్ప విషయమని ప్రశంసించాడు. - 
                                    
                                        

ఆ మ్యాచ్ ఓటమి.. జట్టును మరింత ఏకం చేసింది: హర్మన్ ప్రీత్ కౌర్
ఒక్క ఓటమితో జట్టంతా డీలా పడటం సహజం. కానీ, దాన్నుంచి బయటకొచ్చి విజేతగా నిలవడం మాత్రం అద్భుతం. అలాంటి దానిని భారత మహిళా జట్టు చేసి చూపించింది. - 
                                    
                                        

సచిన్ చేతుల మీదుగా..
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచకప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డీవై పాటిల్ స్టేడియం దద్దరిల్లింది. - 
                                    
                                        

వాళ్ల వెనుక అతడు
భారత మహిళల క్రికెట్ జట్టులో రెండేళ్ల కిందటి వరకు స్థిరత్వం లేదు. కొన్ని మ్యాచ్లు గెలవడం.. తర్వాత గెలిచే మ్యాచ్లు ఓడిపోవడం.. ఇలా సాగేది ప్రయాణం. కానీ ఇప్పుడు భారత్ మారింది. - 
                                    
                                        

కల తీరెలే కప్పందగా..
భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ షెఫాలి వర్మ ఆటే హైలైట్. ప్రతీక రావల్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆమె.. తన తొలి మ్యాచ్లో విఫలమైనా ఈసారి అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది. - 
                                    
                                        

వచ్చింది.. గెలిపించింది
వారం ముందు ఆ అమ్మాయి అందరిలాగే ప్రపంచకప్ వీక్షకురాలు. టీవీలో భారత జట్టు ఆట చూస్తూ ఉంది. కానీ ఉన్నట్లుండి అంతా మారిపోయింది. ఆమె టీవీ లోపలికి వెళ్లిపోయింది. భారత జట్టులో సభ్యురాలై ప్రపంచకప్లో ఆడేసింది. - 
                                    
                                        

కొత్త బంగారు లోకం
ప్రయాణ ఖర్చుల కోసం చందాలు వేసుకోవడం దగ్గర్నుంచి.. కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందే వరకు! రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ పట్టించుకోని స్థితి నుంచి.. రక్షణ వలయం లేకుండా బయటికి వెళ్లలేని దశ వరకు! ప్రత్యక్ష ప్రసారమే లేని రోజుల నుంచి. - 
                                    
                                        

మన వనిత.. విశ్వవిజేత
ఆట ఏదైనా ప్రపంచకప్ అంటే.. ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు, బంతి పట్టిన ప్రతి అమ్మాయీ దశాబ్దాలుగా ఆ కలను కంటూనే ఉంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారీ నిరాశే. - 
                                    
                                        

హర్మన్ డెవిల్స్
అప్పట్లో కపిల్ నేతృత్వంలో పురుషుల క్రికెట్లో దేశానికి తొలి ప్రపంచ కప్ను అందించిన జట్టును ‘కపిల్ డెవిల్స్’ అన్నారు. అసలు అంచనాలే లేకుండా అద్వితీయ ప్రదర్శన చేస్తూ అరివీర భయంకర వెస్టిండీస్ను ఓడించి 1983లో అద్భుతం చేసింది ఆ భారత జట్టు. - 
                                    
                                        

దొరికింది ఓ ఆణిముత్యం
భారత జట్టుకు ఆడడం ఏ ప్లేయర్కైనా పెద్ద కల. అలాంటిది ప్రపంచకప్లో బరిలో దిగే అవకాశం వస్తే! అందులోనూ అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని అందుకుంటే! ఆ అదృష్టం తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. - 
                                    
                                        

మహిళల క్రికెట్లో మలుపు
వన్డే ప్రపంచకప్లో భారత్ విజయం యావత్ మహిళల క్రికెట్ను మార్చబోతోందని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. 1983లో కపిల్ సేన విజయం ప్రపంచ క్రికెట్ను మార్చినట్లుగానే.. - 
                                    
                                        

మనకొకటి..
అర్ష్దీప్ జట్టులో ఉండాలి.. గత కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. ఆస్ట్రేలియాతో సిరీస్లో 0-1తో వెనకబడిన దశలో అతడికి చోటు లభించింది. ఆ అవకాశాన్ని అతడు వమ్ము చేయలేదు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఏఐకి సొంత తెలివి తెప్పించేందుకు ప్రయత్నించొద్దు.. మైక్రోసాఫ్ట్ AI చీఫ్ కీలక వ్యాఖ్యలు
 - 
                        
                            

మీకు హైకమాండ్ చెప్పిందా: సీఎం మార్పుపై సిద్ధరామయ్య
 - 
                        
                            

హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ లుక్తో టీజర్
 - 
                        
                            

భారత్ టెక్ పవర్హౌస్గా ఎదిగేందుకు ప్రైవేటు పెట్టుబడులు: ప్రధాని మోదీ
 - 
                        
                            

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. నడుములోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన!
 - 
                        
                            

ఆమె బౌలింగే మాకు సర్ప్రైజ్.. మేం సిద్ధం కాలేకపోయాం : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా
 


