IND vs SL: శ్రీలంకతో భారత్ పోరు.. వర్షం గండం తప్పదా..? తుది జట్టు ఎలా ఉండేనో?
ఒక్క రోజు వ్యవధిలో భారత్ మరో వన్డే మ్యాచ్కు సిద్ధమైంది. అయితే, దానికీ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంకతో టీమ్ఇండియా తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: రెండు రోజులపాటు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఇవాళ కూడా ఆసియా కప్ సూపర్ -4లో భాగంగా శ్రీలంకతో కొలంబో వేదికగానే భారత్ తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే, భారత్ మ్యాచ్లకు వరుణుడి గండం మాత్రం తప్పేలా లేదు. లీగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్లోనూ వర్షం పలకరించింది. ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్లో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ రిపోర్ట్ చెబుతోంది. ఇక టీమ్ఇండియా తుది జట్టుపైనే అందరి దృష్టి ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే మ్యాచ్ ఆడబోతుండటం క్రికెటర్లపై ఒత్తిడికి గురి చేసే అంశమే. మరి కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ లోగా వాతావరణ పరిస్థితిపై ఓ లుక్కేద్దాం..
ఇదీ వాతావరణ పరిస్థితి..
- 2 గంటలు: ప్రస్తుతం కొలంబోలో వాతావరణం కాస్త పొడిగానే ఉంది. రెండు గంటల నుంచి 3 గంటల వరకు కొంచెం మేఘావృతమై ఉంటుంది.
- 3 గంటలు: ఉరుములు, మెరుపులతో కూడి చిరు జల్లులు పడే అవకాశం ఉంది. వర్షం వచ్చే అవకాశాలు 56 శాతంగా ఉన్నాయి.
- 4 గంటలు: వరుణుడు కాస్త తెరిపినిస్తాడు. అయితే, మేఘాలు కమ్ముకొని ఉంటాయి. వర్ష సూచన 40 శాతంగానే ఉంది.
- 5 గంటల నుంచి 10 గంటల వరకు: ఈ సమయంలో మేఘావృతమై ఉంటుంది. కానీ, వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు.
- రాత్రి 11 గంటలకు: ఈ సమయంలో కొంచె వర్షం పడే అవకాశం ఉంది. కానీ ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. మ్యాచ్ నిర్వహణకు ఇబ్బంది ఉండదని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి.
మార్పులు ఉండకపోవచ్చు
శ్రీలంకతో జరగనున్న మ్యాచ్లో భారత్ జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఫైనల్కు చేరుకోవడానికి కీలకమైన ఇలాంటి సమయంలో మేనేజ్మెంట్ మార్పులు చేస్తుందనే భావించడం కష్టమే. అయితే, టాప్ఆర్డర్తోపాటు మిడిలార్డర్ రాణించిన నేపథ్యంలో అదనంగా మరొక పేసర్ను తీసుకోవడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ పేసర్ షమీని తీసుకుంటే పేస్ దళం మరింత బలంగా మారనుంది. బుమ్రా, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకోవడంతోపాటు లయను అందిపుచ్చుకోవడం భారత్కు సానుకూలాంశంగా మారింది. బ్యాటింగ్లో ఏవైనా ప్రయోగాలు చేయాల్సి వస్తే ఇషాన్కు బదులు సూర్యను ఆడించొచ్చు. అయితే, శ్రీలంక బౌలర్లు తీక్షణ, పతిరన బౌలింగ్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాల్తో కూడుకున్నదే. స్వదేశంలో వారి సొంత మైదానాల్లో వీరిద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా సూపర్ -4లోనే బంగ్లాదేశ్ను కట్టడి చేసిన తీరు అమోఘం. ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా భారత్కు పరాభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్
శ్రీలంక: కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), డాసున్ శనక (కెప్టెన్), పాథున్ నిస్సాంక, దిముత్ కరుణరత్నె, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వా, వెల్లలాగే, తీక్షణ, రజిత, పతిరన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోని మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..