TS News: ఒక్క గుంట భూమినీ కబ్జా చేయలేదు
తాము గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున తెలిపారు. జమునా హేచరీస్ పేరుతో కొనుగోలు చేసిన భూములు పూర్తిగా నిబంధనలకు లోబడి, ధరణి ప్రకారమే రిజిస్ట్రేషన్
ధరణి ప్రకారమే కొనుగోలు చేశాం
ఈటల జమున వెల్లడి
పూడూరు (మేడ్చల్ రూరల్): తాము గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున తెలిపారు. జమునా హేచరీస్ పేరుతో కొనుగోలు చేసిన భూములు పూర్తిగా నిబంధనలకు లోబడి, ధరణి ప్రకారమే రిజిస్ట్రేషన్ జరిగాయని స్పష్టం చేశారు. మెదక్ కలెక్టర్ హరీశ్ చేసిన కబ్జా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె మేడ్చల్ మండలం పూడూరు శివారులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సర్వే నంబరు 81లో 5.36 ఎకరాలు, 130లో 3 ఎకరాలు న్యాయబద్ధంగా కొనుగోలు చేసి ధరణి ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వాటిల్లోనే షెడ్లు నిర్మించుకున్నాం. దీనిని ప్రభుత్వ భూమిగా చూపించడం ఏంటి? రెండు సర్వే నంబర్లలో 60 ఎకరాలు మాత్రమే ఉండగా 70 ఎకరాలు కబ్జా చేశామనడం హాస్యాస్పదం. ప్రెస్ మీట్ పెట్టి తాము 70 ఎకరాలు కబ్జా చేశామని చెప్పే అధికారాన్ని కలెక్టర్కి ఎవరిచ్చారు? ఇతర పౌల్ట్రీ ఫామ్లకు అవసరం లేని అనుమతులు మా పౌల్ట్రీలకే ఎందుకు? పౌల్ట్రీ ద్వారా వచ్చే ఎరువుతో జలాలు కలుషితమయ్యాయనడం ఏంటి? కలెక్టర్పై కేసు పెడతాం’’ అని జమున పేర్కొన్నారు.
కబ్జాపై మతిలేని ఆరోపణలు: ఈటల
ఈనాడు, సంగారెడ్డి: తాను ఎసైన్డ్ భూములు కబ్జా చేశాననడం మతిలేని ఆరోపణ అని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మావి తొండలు గుడ్లు పెట్టని భూములు. నేను బెదిరించానని అంటున్నారు. నా స్థాయికే అలా చేసి ఉంటే... మరి కేసీఆర్ ఎందరిని భయపెట్టించి ఉంటారు? తాము ఒక్క ఎకరా కబ్జా చేసినట్లు తేలినా ముక్కు నేలకు రాస్తామని ఇప్పటికే నా భార్య స్పష్టం చేసింది’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ శత్రువుల ఓటమి ఖాయం
‘‘140 కోట్ల మంది భారతీయుల సంకల్పం జూన్ నాలుగో తేదీన నెరవేరబోతోంది. భాజపాను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశ శత్రువులు ఓడిపోవడం ఖాయం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు