‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
గూగుల్లో లేఆఫ్లపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్నే ప్రశ్నించారు.
Sundar Pichai | ఇంటర్నెట్డెస్క్: కొవిడ్ తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు.. ఆ తర్వాత కూడా కొనసాగాయి. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ టెక్ కంపెనీ అయిన గూగుల్ (Google) కూడా అందుకు మినహాయింపు కాదు. గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ కంపెనీ.. ఈ ఏడాది వందల సంఖ్యలో విడతలవారీగా తొలగింపులు చేపట్టింది. ఈనేపథ్యంలో లేఆఫ్లపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఉద్యోగులు నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్నే ప్రశ్నించారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్హ్యాండ్స్ మీటింగ్లో పిచాయ్కు ఈ ప్రశ్న ఎదురైంది.
ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో లేఆఫ్ల గురించి ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయని పిచాయ్ను ప్రశ్నించారు. దీనిపై పిచాయ్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ ఏడాది తొలి 6 నెలల పాటు ఈ లేఆఫ్లు కొనసాగుతాయని చెప్పారు. రెండో అర్ధభాగంలో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల గురించి ఈసందర్భంగా మాట్లాడారు. కొత్త నియామకాల విషయంలో గూగుల్ క్రమశిక్షణతో వ్యవహరించనుందని చెప్పారు. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం కంటే ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని వ్యవహరిస్తున్నట్లు ఉద్యోగులకు వివరించారు.
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
ఈ సమావేశంలో మరికొన్ని ప్రశ్నలు సైతం పిచాయ్కు ఎదురయ్యాయి. త్రైమాసిక ఆదాయాల్లో ఊహించిన దానికంటే అధికంగానే కంపెనీ వృద్ధి నమోదు చేస్తున్నప్పటికీ.. కంపెనీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందని, వేతనాల పెంపు చేపట్టడం లేదంటూ కొందరు ఉద్యోగులు ప్రశ్నించారు. లేఆఫ్ల వల్ల ఉద్యోగుల్లో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతోందని, ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య అంతరం పెరుగుతోందంటూ ఓ ఉద్యోగి పిచాయ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పిచాయ్ మాట్లాడుతూ.. మెరుగైన ఫలితాలొక్కటే కంపెనీ విజయాన్ని సూచించవన్నారు. గూగుల్ అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుందని, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని పిచాయ్ సమాధానం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
SBI Rewardz Fraud: తమ బ్యాంకు పేరిట వాట్సప్, ఎసెమ్మెస్ సందేశాల్లో వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దని ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది. -
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
EPF auto settlement: నగదు ఉపసంహరణను సులభతరం చేయడం కోసం ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఆటో సెటిల్మెంట్ సదుపాయం గురించి తెలుసా? -
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!