పీజీ నీట్కు స్వస్తి!
పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న నీట్కు స్వస్తి చెప్పాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఎంబీబీఎస్ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే ‘నేషనల్ ఎగ్జిట్’ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్ పీజీలోనూ....
ఎగ్జిట్ పరీక్ష మార్కులే ప్రామాణికం
వచ్చే ఏడాది నుంచే అమలు
పీజీ వైద్యవిద్యలో కొత్త కోర్సులు
ఎన్ఎంసీ ముసాయిదా విడుదల
ఈనాడు, హైదరాబాద్: పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న నీట్కు స్వస్తి చెప్పాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఎంబీబీఎస్ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే ‘నేషనల్ ఎగ్జిట్’ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్ పీజీలోనూ ప్రవేశాలను నిర్వహించనుంది. ఎగ్జిట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పీజీ సీటు కోసం ప్రయత్నించవచ్చు లేదా వైద్యవృత్తిని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఎగ్జిట్లో ఉత్తీర్ణులైతేనే రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. వచ్చేఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలను ఎన్ఎంసీ పరిశీలిస్తోంది. ఎగ్జిట్ పరీక్షలో వచ్చే మార్కులకు మూడేళ్ల వరకూ పరిమితి ఉంటుంది.
పీజీ మెడికల్ సీట్ల నిబంధనల క్రమబద్ధీకరణలో మార్పులు చేస్తూ ఎన్ఎంసీ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినవారు.. మరుసటి ఏడాదికి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మళ్లీ అవకాశమిస్తారా? లేదా? అనే స్పష్టతను ముసాయిదాలో పొందుపరచలేదు. దీనిపై తమ అభిప్రాయాలను, సూచనలు, సలహాలను president.pgmeb@nmc.org.in కు ఈనెల 30వ తేదీలోగా పంపించాలని ఎన్ఎంసీ కోరింది.
మరికొన్ని కీలక నిర్ణయాలు
* ఇకనుంచి పీజీ వైద్యవిద్యార్థులను జిల్లా ఆసుపత్రికి కూడా మూణ్నెల్ల పాటు పంపాలని నిర్ణయించారు. వీరికి అక్కడ కూడా ఉపకార వేతనాలు లభిస్తాయి.
* పీజీ సూపర్ స్పెషాలిటీలో ఇప్పటి వరకూ వేర్వేరుగా ఉన్న రుమటాలజీ, క్లినికల్ ఇమ్యునాలజీలను ఒకటిగా కలిపేశారు. కొత్తగా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సులను కొత్తగా అందుబాటులోకి తేనున్నారు. పీజీలో బయో ఫిజిక్స్, మెడికల్ జనటిక్స్ కోర్సులను తీసేశారు.
* విద్యాబోధన చేసేటప్పుడు ఉండే పీజీ గైడ్ అర్హత కాలాన్ని ఎనిమిది నుంచి అయిదేళ్లకు కుదించారు. ప్రస్తుతం ఒక యూనిట్లో ఒక ప్రొఫెసర్కు తన అనుభవంతో సంబంధం లేకుండా.. 3 పీజీ సీట్లు ఇస్తున్నారు. ఈ విధానంలో స్వల్పమార్పులు చేస్తూస్పష్టత ఇచ్చారు.
* ఉదాహరణకు ఒక వైద్య కళాశాలలో ఆచార్యుడికి పీజీ బోధనలో ఏడాది అనుభవమే ఉంటే.. ఆ యూనిట్కు ఒక్క పీజీ సీటిస్తారు. రెండేళ్ల అనుభవం ఉండి.. ఏడాదిలో ఇద్దరు పీజీ విద్యార్థులకు బోధన అందిస్తే ఆ యూనిట్కు 2 పీజీ సీట్లు.. ఆచార్యుడికి అయిదేళ్ల అనుభవం ఉండి, ఏడాదికి కనీసం ఇద్దరు పీజీ విద్యార్థులకు బోధన చేస్తుంటే.. 3 సీట్లు అనుమతిస్తారు. ఆ వైద్యసంస్థలో పదేళ్లుగా పీజీ సీట్లను నిర్వహిస్తూ ఉంటేనే 3 పీజీ సీట్లకు అర్హత లభిస్తుంది. ఇకపై ఆచార్యుడు కూడా మూడేళ్లలో కనీసం 3 పరిశోధన పత్రాలు సమర్పించాలి.
వైద్యసేవల్లో మెరుగైన నాణ్యత ప్రమాణాలు
- డాక్టర్ పుట్టా శ్రీనివాస్, సంచాలకులు మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్యకళాశాల
జిల్లాలకు పీజీ వైద్య విద్యార్థులను పంపించడం వల్ల గ్రామీణ వైద్యం బలోపేతమవుతుంది. వైద్యవిద్యార్థులకు కూడా గ్రామాల్లో జబ్బుల పరిస్థితి గురించి తెలుస్తుంది. ఎగ్జిట్ పరీక్ష విధానంలో అనుకోని కారణాల వల్ల తక్కువ మార్కులు వచ్చినవారికి మళ్లీ రాసే అవకాశం కల్పించాలి. కొత్త కోర్సుల వల్ల కూడా వైద్యవృత్తి విస్తృతమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!