చేటు చేస్తున్న సిమ్లపై వేటు
సిమ్కార్డు ఉంటేచాలు... సరిహద్దులతో సంబంధం లేకుండా మోసానికి పాల్పడొచ్చు, ఖాతాలు కొల్లగొట్టొచ్చు.
రోజుకు 110 కార్డుల రద్దు
సైబర్ సెక్యూరిటీ విభాగం కఠిన చర్యలు
ఈనాడు, హైదరాబాద్: సిమ్కార్డు ఉంటేచాలు... సరిహద్దులతో సంబంధం లేకుండా మోసానికి పాల్పడొచ్చు, ఖాతాలు కొల్లగొట్టొచ్చు. దగాకోరులు ఉపయోగించే ఈ సిమ్లను పసిగట్టి... నిలువరించగలిగితే మోసగాళ్ల ఆట కట్టించవచ్చని భావిస్తున్న పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసినప్పటి నుంచి దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్.సి.సి.ఆర్.పి)కు వస్తున్న సమాచారం ఆధారంగా సిమ్లను గుర్తించి వాటిని రద్దు చేయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున రోజుకు 110 సిమ్ కార్డులను రద్దు చేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మోసాలకు కారణమవుతున్న ఫోన్లను కూడా బ్లాక్ చేయిస్తున్నారు.
సైబర్నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందున్న తెలంగాణలో ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఒక్క హైదరాబాద్లోనే సైబర్ నేరగాళ్లు రోజుకు రూ.5 కోట్లు కొట్టేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే ఏటా దాదాపు రూ.1800 కోట్లు లూటీ అవుతున్నాయన్నమాట. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినా నేరగాళ్లను గుర్తించడం కష్టమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని అరెస్టు చేసి, ఇక్కడకు తీసుకొని రావడం సాధ్యంకావడం లేదు. అందుకే సైబర్నేరాలు అదుపు కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఎన్సీసీఆర్పీని ఏర్పాటుచేసి ..1930 నంబర్ సౌకర్యం కల్పించింది. ఈ నంబర్కు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు మోసానికి కారణమైన సిమ్కార్డు ఏ చిరునామాతో కొనుగోలు చేశారో గుర్తిస్తారు. సంబంధిత రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇస్తారు. వారు సర్వీస్ ప్రొవైడర్కు లేఖ రాసి, దాన్ని బ్లాక్ చేయిస్తారు. గతంలో ఇలాంటి సమాచారం వచ్చినా రకరకాల కారణాలతో పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసిన తర్వాత తక్షణమే స్పందిస్తున్నారు. గత ఏడాది జూన్ 1 నుంచి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తుండగా అప్పటి నుంచి మార్చి 31 వరకూ అంటే పది నెలల కాలంలో తెలంగాణ చిరునామాతో ఉన్న 33,029 సిమ్కార్డులు, ఐఎంఈఐ నంబర్ ఆధారంగా 3,769 మొబైల్ ఫోన్లు బ్లాక్ చేయించారు. అంటే సగటున రోజుకు 110 సిమ్కార్డులు, 12 ఫోన్లు బ్లాక్ చేయిస్తున్నారన్నమాట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
జీవన్రెడ్డి మాల్ స్వాధీనం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 24కి వాయిదా
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత.. బెయిల్ కోసం దాఖలుచేసిన పిటిషన్లో దిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
భారత వైమానిక దళానికి దరఖాస్తుల ఆహ్వానం
అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
‘ఐసెట్’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు
రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. -
తూప్రాన్ ఈఎస్ఐ ఆసుపత్రికి 46 రోజులుగా తాళం
మెదక్ జిల్లా తూప్రాన్లోని ఈఎస్ఐ ఆసుపత్రి 46 రోజులుగా మూతపడి ఉంది. 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని ఏప్రిల్ 1న ఆసుపత్రికి తాళం వేశారు. -
జూన్ 3న లాసెట్, పీజీఎల్సెట్ పరీక్షలు
తెలంగాణలో లాసెట్, పీజీఎల్సెట్లను జూన్ 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. -
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసీలు, మావోయిస్టులపై ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అంతిమ యుద్ధం మొదలుపెట్టిందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి నారాయణరావులు విమర్శించారు. -
మేడిగడ్డపై రేపు సీఎం రేవంత్ సమీక్ష
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్.డి.ఎస్.ఎ.) ఇచ్చిన నివేదికపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించనున్నారు. -
దత్తపుత్రికను తక్షణం తండ్రికి అప్పగించండి
దత్తత తీసుకున్న బాలికను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని.. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలంటూ శిశు సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ నుంచి పసుపు, మిర్చి, పండ్లు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు కె.అశోక్రెడ్డి తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!