సంక్షిప్త వార్తలు
తెలంగాణ నుంచి పసుపు, మిర్చి, పండ్లు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు కె.అశోక్రెడ్డి తెలిపారు.
ఉద్యాన పంటల ఎగుమతులకు ప్రోత్సాహం
సంచాలకుడు అశోక్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ నుంచి పసుపు, మిర్చి, పండ్లు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు కె.అశోక్రెడ్డి తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం హైదరాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు, డీజీఎఫ్టీ, ఎంపీపీ, ఓఎఫ్ఎస్సీ, ఐజీఎంఆర్ తదితర సంస్థల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో 12లక్షల ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మల్బరీసాగును మరింత విస్తరిస్తామని తెలిపారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి: అన్వేష్రెడ్డి
హైదరాబాద్, న్యూస్టుడే: విత్తనాలు అమ్మే కంపెనీలు, డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. కంపెనీలు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి కోసం పంట సాగు చేసే విధానంలో లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎఫ్1 విత్తనాలు అవసరం ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు అమ్మి, రాష్ట్ర రైతులకు మాత్రం ఎఫ్2 రకం విత్తనాలు అమ్ముతున్నారని అన్వేష్రెడ్డి విమర్శించారు.
4 రోజుల్లో 4.3 లక్షల మంది ప్రయాణం
దక్షిణ మధ్య రైల్వే వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మే 9-12 వరకు హైదరాబాద్ నుంచి బయల్దేరే రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయడంతో 4.3 లక్షల మంది ప్రయాణాలు చేశారని ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సగటున రోజుకు 1.05 లక్షల మంది ప్రయాణించారని పేర్కొంది. రెండు తెలుగురాష్ట్రాల మధ్య మే 9-15 వరకు 60కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపినట్లు వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొర్రెల పథకం కుంభకోణం రూ.700 కోట్లు!
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. -
కోడ్ ముగిశాక కొలువుల పండగ
లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామకపత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి. -
మేడిగడ్డకు పరీక్షా కాలం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాకు రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. -
కోలాహలంగా కొండగట్టు అంజన్న సన్నిధి
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. -
చినుకు గుబులు.. కాలిబాటేపైనే కునుకు
కొద్దిరోజులుగా మధ్యాహ్నం వరకు ఎండలు.. ఆపై ఈదురు గాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పంట ఉత్పత్తుల్ని కాపాడుకోవడానికి కష్టాలు పడాల్సి వస్తోంది. -
గంధంగూడ భూములపై ఆర్డీవో నివేదిక బుట్టదాఖలు
హైదరాబాద్ శివారులోని గంధంగూడలో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. -
డీఐఏసీ, ఐఏఎంసీల మధ్య అవగాహన ఒప్పందం
దుబాయ్లో జరిగిన ఓ కార్యక్రమంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (డీఐఏసీ), హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)లు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
మధ్యాహ్నం బాధ్యతలు.. సాయంత్రం విరమణ
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు గురైన డైరెక్టర్ జనరల్ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చివరికి ఆయన కోరుకున్నట్లుగానే పోలీసు యూనిఫాంలో పదవీ విరమణ చేశారు. -
గ్యారంటీతో తెచ్చిన రుణాల పక్కదారి కుదరదు
-
గ్రూప్స్ ఖాళీలను పక్కాగా లెక్కించాలి: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలో గ్రూప్ సర్వీసు ఖాళీలను పూర్తి స్థాయిలో లెక్కించిన తర్వాతే భర్తీ ప్రక్రియ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్రం భగభగ
భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. శుక్రవారం అత్యధికంగా భీమారం(మంచిర్యాల జిల్లా), కమాన్పూర్(పెద్దపల్లి)లలో 47.1, గరిమెళ్లపాడు(భద్రాద్రి)లో 46.9, కేతెపల్లి(నల్గొండ)లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
శ్రీవారి సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్షా
తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న హోంమంత్రి అమిత్షా, సోనాల్షా దంపతులకు అర్చకులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. -
కేసీఆర్కు ఆహ్వానపత్రిక అందజేత
రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్కు ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికను అందజేసినట్లు ప్రభుత్వ ప్రొటోకాల్ విభాగం సలహాదారు హర్కర వేణుగోపాల్ తెలిపారు. -
బీడీ ఏజెంట్ల కమీషన్ రేటు పెంపు
రాష్ట్రంలోని బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కమీషన్ ఏజెంట్లకు చెల్లించే కమీషన్ రేటుపై యాజమాన్యాలతో శుక్రవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఏపీ బీడీ కమీషన్దారుల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయినాథ్, నర్సయ్య తెలిపారు. -
సంక్షిప్త వార్తలు (7)
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం డీజీపీ రవిగుప్తాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సికింద్రాబాద్ పరేడ్ మైదానాన్ని సందర్శించారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి -
అడవి తల్లి గుండెల్లో గునపాలు!
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో మైనింగ్ జరుగుతోంది. బొగ్గు, సున్నపురాయి, గ్రానైట్, ఐరన్ ఓర్, మ్యాంగనీస్, క్వార్ట్జ్, బైరటీస్, లేటరైట్... ఇలా 26 రకాల ఖనిజాల కోసం తవ్వకాలు సాగుతున్నాయి. -
చిన్నారుల అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు
సంతానం లేని దంపతులు ప్రభుత్వ అనుమతితో చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవాలని శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. -
ఆర్చ్ బిషప్ ఎమిరటస్ తుమ్మ బాలకు తుది వీడ్కోలు
హైదరాబాద్ ఆర్చ్ బిషప్ ఎమిరటస్ తుమ్మ బాల అంత్యక్రియలు శుక్రవారం సెయింట్ మేరీస్ బసలికా చర్చిలో నిర్వహించారు. -
టెస్కాబ్ ఛైర్మన్ పదవికి రవీందర్రావు రాజీనామా
రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ఛైర్మన్ కొండూరి రవీందర్రావు తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. -
పదవీ విరమణ చేసినా.. మళ్లీ అదే బాధ్యత
నీటి పారుదల శాఖ యూటర్న్ తీసుకొంది. ఇప్పటికే పదవీ విరమణ చేసి, సర్వీసు ఎక్స్టెన్షన్లో ఉన్న వారిని కొనసాగించరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా అడుగులేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు
-
ధోనీ స్క్వాడ్ అలా.. రోహిత్ సేన ఇలా..
-
పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు