విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ప్రకటన
ఈనాడు, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఆ నిర్ణయాలకు సంబంధించిన వాస్తవాలు, ఇతర విషయాలపై నిపుణులు, ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని, ఫిర్యాదులను పది రోజుల్లోగా కమిషన్కు అందజేయాలని కోరింది. మౌఖిక సాక్ష్యాలు ఇవ్వదలచుకున్న వారు కూడా స్పందించాలని సూచించింది. గత ప్రభుత్వం 2014లో బహిరంగ బిడ్డింగ్ పోటీని అనుసరించకుండా నామినేషన్ పద్ధతిన ఛత్తీస్గఢ్ రాష్ట్ర డిస్కమ్ నుంచి విద్యుత్తును సేకరించిందన్న ఆరోపణలు వచ్చాయి. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించిందని, రెండేళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సిన ప్రాజెక్టును ఏడేళ్ల కాలానికి పొడిగించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిడ్డింగ్ నిర్వహించకుండా నామినేషన్ ప్రాతిపదికన ప్రాజెక్టు అప్పగించడంలో నిబంధనల ఉల్లంఘనలపై కమిషన్ విచారణ చేస్తుంది. ఆయా అంశాలపై నిపుణులు, అవగాహన కలిగిన వ్యక్తులు తమ సూచనలు, వివరాలు, ఫిర్యాదులను కమిషన్ కార్యాలయానికి నేరుగా కానీ, పోస్టు(కమిషన్ కార్యాలయం, ఏడో అంతస్తు, బీఆర్కే భవన్, హైదరాబాద్) ద్వారా కానీ, ఈ-మెయిల్ ద్వారా (coi2024.power@gmail.com) గానీ పంపించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగదు తరలింపు వెనుక ఓ ఐపీఎస్!
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనపై నమోదైన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
సర్కారు బడి.. ప్రవేశానికి పోటీపడి..!
ఇక్కడ పరిస్థితి చూస్తే పిల్లలు... ఉన్నత చదువులకు దారి చూపే ఏదో కీలకమైన ప్రవేశ పరీక్షరాస్తున్నట్లుగా ఉంది కదూ. -
16,347 ఉపాధ్యాయ పోస్టులు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో గల ఛాంబర్లో గురువారం సాయంత్రం 4.41 గంటలకు ఆయన వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు తీసుకున్నారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమం
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. -
కూరగాయల ‘ధర’దడ
ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్ నగరానికి రోజూ ఎనిమిది వేల క్వింటాళ్ల వరకు వచ్చేవి. దాంతో ఆరు నెలలుగా కిలో రూ.20 చొప్పున స్థిర ధరల్లోనే లభ్యమయ్యాయి. -
ఖనిజాల తవ్వకాలతో ఉపాధి అవకాశాలు పెంచుతాం
దేశంలోని ఖనిజాల తవ్వకాలను పెంచడం ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలకు, ఎగుమతులు పెంచడం ద్వారా ప్రగతికి బాటలు వేస్తామని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. -
భారాస హయాంలో నీటిపారుదల ఛిన్నాభిన్నం
గత భారాస ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
మహిళాశక్తి క్యాంటీన్లు
తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 200కి పైగా మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు
ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. -
317 జీవో ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయుల తుది కేటాయింపులు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 317 జీవో ప్రకారం తుది కేటాయింపులు పూర్తి చేయాలని ఆ సొసైటీలు నిర్ణయించాయి. -
టాస్ పది, ఇంటర్ ఫలితాల విడుదల
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్) ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. -
5 గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్ప్రెస్
హైదరాబాద్ నుంచి న్యూదిల్లీ స్టేషన్కు వెళ్లే తెలంగాణ ఎక్స్ప్రెస్ శుక్రవారం 5 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. -
నేడు టీజీ ఐసెట్ ఫలితాల విడుదల
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-24’ ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. -
కమ్మ సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి కృషి
రాష్ట్రంలోని కమ్మ సామాజికవర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. -
లాసెట్లో 29,258 మంది పాస్
లాసెట్ రాసిన అభ్యర్థుల్లో 72.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు 50,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
నేడు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రమంతటా శుక్రవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. -
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడి నియామకంలో జాప్యమెందుకు?
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చినా జాప్యం ఎందుకు జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. -
ఇంటి రుణం వడ్డీ రాయితీపై కాల పరిమితి ఎత్తివేత
సింగరేణి కార్మికులు, ఉద్యోగుల గృహ రుణాలకు సంబంధించి వడ్డీ రాయితీ చెల్లింపులపై యాజమాన్యం మరింత వెసులుబాటు కల్పించింది. ఏడాది లోపు రుణం తీసుకుంటేనే రాయితీ వర్తిస్తుందనే నిబంధనను సడలించింది. -
కోర్టు ఆదేశించినా పింఛను బకాయిలు చెల్లించలేదు
శాఖాపరమైన విచారణ పేరుతో 18 ఏళ్లుగా నిలిపివేసిన పింఛను బకాయిలు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా చెల్లించకపోవడంతో స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ శైలజా రామయ్యర్పై శామీర్పేటకు చెందిన ఉద్యోగి కె.దొరారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. -
కుల, మత రహితంగా పాఠశాల రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి
పాఠశాల అడ్మిషన్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లలో కుల, మత ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలంటూ గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
మేడిగడ్డ బ్యారేజీలోమరో రెండు గేట్ల ఎత్తివేత
మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్లో 18, 19 గేట్లను ఇంజినీరింగ్ అధికారులు గురువారం పైకెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
కువైట్ మృతుల్లో ముగ్గురు ఏపీవాసులు
-
ఈ బ్రాంచ్లకూ.. కొలువులున్నాయ్..
-
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం