Biden-Jinping: ‘ఆయన నియంతే..’: జిన్పింగ్తో భేటీ తర్వాత బైడెన్ మళ్లీ అదే మాట..!
Biden-Jinping: అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాధినేతలు ముఖాముఖీగా సమావేశమయ్యారు. అయితే, ఈ భేటీ తర్వాత జిన్పింగ్ను మళ్లీ బైడెన్ ‘నియంత’గా అభివర్ణించారు.
వూడ్సైడ్ (కాలిఫోర్నియా): చైనా (China) అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping) ‘నియంతే’ అని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నానని అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. వీరిద్దరూ తాజాగా ముఖాముఖీగా సమావేశమయ్యారు. ఈ భేటీ అయిన కొద్దిసేపటికే అగ్రరాజ్య అధినేత మరోసారి జిన్పింగ్ను ‘నియంత’గా అభివర్ణించడం గమనార్హం.
ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు నిమిత్తం ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. ఈ క్రమంలోనే బైడెన్తో ఆయన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వీరి భేటీ జరిగింది. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే బైడెన్ మీడియా కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జిన్పింగ్ను మీరు ఇంకా నియంతగానే భావిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి బైడెన్ బదులిస్తూ.. ‘‘అవును. ఆయన నియంతే. ఆయన కమ్యూనిస్ట్ దేశాన్ని పాలిస్తున్నారు. ఆ ప్రభుత్వం మనకంటే భిన్నమైంది’’ అని వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ.. తాము చర్చల్లో పురోగతి సాధించామని తెలిపారు.
అయితే, బైడెన్ వ్యాఖ్యలు బీజింగ్ను మరోసారి అసహనానికి గురి చేసేలా కన్పిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లోనూ బైడెన్ ఇలాగే జిన్పింగ్ను ‘నియంత’గా పేర్కొన్నారు. అప్పుడు అగ్రరాజ్య అధినేత తీరును చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడింది. ఇప్పుడు జిన్పింగ్తో భేటీ తర్వాత కూడా బైడెన్ మరోసారి ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల సంబంధాలను మెరుగుపర్చుకునేలా నేతలిద్దరి మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని వైట్హౌస్ ప్రకటించింది. ఆ కాసేపటికే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్.. చైనాలో ఆవిష్కరణ
నాలుగు గంటల పాటు సుదీర్ఘ భేటీ..
శాన్ ఫ్రాన్సిస్కో శివారులోని వూడ్సైడ్లో గల ఫిలోలి మాన్షన్ ఎస్టేట్లో బైడెన్, జిన్పింగ్ భేటీ జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా వీరిద్దరూ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కృత్రిమ మేధ, పర్యావరణ మార్పులు, ఇరాన్, మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక పరమైన అంశాలపై ఇరు దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత కలిసి లంచ్ చేసి, మాన్షన్ గార్డెన్లో కొంతసేపు నడిచారు.
అమెరికాలో అక్రమంగా డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ఈ భేటీలో జిన్పింగ్ అంగీకరించినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో పాటు అమెరికా, చైనా మధ్య సైనిక స్థాయి చర్చల పునరుద్ధరణకు దేశాధినేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. తైవాన్ అంశంపైనా ఫలప్రదమైన చర్చ జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. రెండు దేశాల సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు బైడెన్, జిన్పింగ్ అంగీకరించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.