Ricky Kej: బ్రిటన్ గడ్డపై ‘స్వాతంత్ర్య’ సంబరాలు.. 100 మంది ఆర్కెస్ట్రా బృందంతో ‘జనగణమన’
బ్రిటన్లోని ప్రఖ్యాత ‘అబ్బే రోడ్ స్టూడియోస్’లో 100 మంది ఆర్కెస్ట్రా బృందంతో రికార్డు చేసిన ‘జనగణమన’ గీతాన్ని భారతీయ స్వరకర్త రికీ కేజ్ విడుదల చేశారు. ఆయన మూడు సార్లు ‘గ్రామీ పురస్కార’ విజేత.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ గీతం ‘జనగణమన (Jana Gana Mana)’ ఎప్పుడూ విన్నా.. సగటు భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. అలాంటిది ఏకంగా 100 మందితో కూడిన ఓ ప్రఖ్యాత ఆర్కెస్ట్రా బృందం తమ సంగీత పరికరాలతో ఈ గీతాన్ని వాయిస్తే.. అదీ బ్రిటన్ గడ్డపైనా.. ఉద్వేగం తారస్థాయికి చేరుతుంది కదూ! ఇదే చేసి చూపించారు భారతీయ స్వరకర్త, మూడు సార్లు ‘గ్రామీ అవార్డు’ విజేత రికీ కేజ్ (Ricky Kej). 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ‘జనగణమన’ వీడియోను ఆయన ట్విటర్ వేదికగా విడుదల చేశారు. భారత జాతీయ గీతాన్ని (Indian National Anthem) రికార్డు చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదేనని వెల్లడించారు.
2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి: రాష్ట్రపతి
‘లండన్లోని పేరుపొందిన ‘అబ్బే రోడ్ స్టూడియోస్’లో ‘ది రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా (RPO)’కు చెందిన 100 మంది బృందంతో జనగణమన గీతాన్ని రికార్డు చేశా. భారత జాతీయ గీతాన్ని రికార్డ్ చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదే. చాలా అద్భుతంగా వచ్చింది. గీతం చివర్లో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారతీయ స్వరకర్తగా గొప్ప అనుభూతిని పొందా’ అని రికీ కేజ్ పేర్కొన్నారు. బ్రిటన్కు భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి.. రికీ కేజ్ ప్రయత్నాన్ని కొనియాడారు. నెటిజన్లు సైతం అద్భుతమైన ప్రదర్శన అంటూ స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 1946లో స్థాపించిన ఆర్పీవోకు బ్రిటన్లో అత్యంత డిమాండ్ కలిగిన ఆర్కెస్ట్రాగా గుర్తింపు ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్