Droupadi Murmu: 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి: రాష్ట్రపతి
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. మువ్వన్నెల జెండా చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందని చెప్పారు.
దిల్లీ: మువ్వన్నెల జెండా చూస్తే భారతీయుల హృదయం ఉప్పొంగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. ప్రతి భారతీయుడికి కులం, మతం, భాష తదితర అనేక గుర్తింపులు ఉంటాయని, కానీ వాటన్నింటికంటే భారతీయుడు అనే గుర్తింపు చాలా గొప్పదని అన్నారు. ప్రతి భారతీయుడు రాజ్యాంగం ముందు సమానమేనని, దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, విధులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య మహా సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన మతాంగిని హజ్రా, కనక్లట బారూహా, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, అమ్ము స్వామినాథన్, రమాదేవి, అరుణ అసఫ్ అలీ, సుచేతా కృపాళిని తదితర మహిళా స్వాతంత్ర్య సమరయోధులను ఆమె స్మరించుకున్నారు.
‘‘1947 ఆగస్టు 15న మనమంతా పరాయి పాలన నుంచి విముక్తి పొందడమే కాదు, మన విధిని తిరిగి రాసుకునే స్వేచ్ఛను కూడా పొందాం. దేశ జీడీపీ ఏటా పెరుగుతోంది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యక్తిత్వ వికాసానికి మెరుగైన శిక్షణ అవసరం. మహిళలు సత్తా చాటుతూ ప్రతిరంగంలోనూ దూసుకెళ్తున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడుతున్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ పౌరులందర్నీ కోరుతున్నా. మా సోదరీమణులంతా ధైర్యంగా సవాళ్లను అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని ద్రౌపది ముర్ము తెలిపారు.
దేశ ఆర్థిక అభివృద్ధితోపాటు మానవ వనరుల అభివృద్ధి, వివాద రహిత సమాజానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో మార్పు మొదలైందని అన్నారు. విద్యార్థులు, పలువురు విద్యావేత్తలతో చర్చించిన తర్వాత అభ్యాస ప్రక్రియ మరింత సరళంగా మారిందని తాను గ్రహించానన్నారు. పురాతన విలువలను ఆధునిక నైపుణ్యాలతో మేళవించడం వల్ల జాతీయ విద్యా విధానం 2020 విద్యారంగంలో అపూర్వ మార్పులు తీసుకువస్తుందని, ఇది దేశ పరివర్తనకు దారితీస్తుందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టినట్లు ద్రౌపది ముర్ము తెలిపారు. సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచే కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది ఎంతో గర్వంగా చంద్రయాన్-3ని పంపించామని, అది జాబిల్లిపై అడుగుపెట్టే క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోందన్నారు. భారతదేశం ప్రపంచ వేదికపై తన సముచిత స్థానాన్ని తిరిగి పొందడమే కాకుండా, అంతర్జాతీయ క్రమంలో తన స్థానాన్ని కూడా పెంచుకుందన్నారు. G20 అధ్యక్ష పదవితో దేశ వాణిజ్యం, ఆర్థిక విషయాల్లో పురోగతి దిశగా నిర్ణయం తీసుకోగలదు’’ అని ద్రౌపదీ ముర్ము తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు అత్యాచారం కేసు.. మహిళకు నాలుగేళ్ల కారాగారం
తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడంతో నాలుగు సంవత్సరాల ఆరు నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. -
రోజుకు 80,000 మందికే శబరిమల అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. -
చిన్ననాటి బెత్తం దెబ్బలు మరవలేను: సీజేఐ
చిన్నప్పుడు పాఠశాలలో తాను బెత్తం దెబ్బలు తిన్నానని, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
పోలీసు సమన్లను పట్టించుకోవద్దు
లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సమన్లనూ పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్.. రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టంచేశారు. -
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.