Xi Jinping: తైవాన్.. చైనాలో భాగంకాక తప్పదు: జిన్పింగ్
తైవాన్(Taiwan) ద్వీపం తమ దేశంలోని అంతర్భాగమేనని తరచూ చైనా(China) వాదిస్తూనే ఉంటుంది. తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నుంచి ఇదే తరహా ప్రకటన వచ్చింది.
బీజింగ్: చైనా(China), తైవాన్(Taiwan) మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తైవాన్ తమ దేశంలో విలీనంకాక తప్పదని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్(Xi Jinping) వ్యాఖ్యానించారు. జనవరిలో ఈ ద్వీపంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్పింగ్ నుంచి ఇటువంటి స్పందన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాను పాలించిన మావో 130వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మాతృభూమితో పునరేకీకరణ జరగాలి. అది అనివార్యం. తైవాన్ను చైనా నుంచి వేరు కానీయం. తైవాన్ జలసంధి అంతటా శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలి’ అని జిన్పింగ్(Xi Jinping) ప్రతిజ్ఞ చేశారు. తైవాన్ విషయంలో బీజింగ్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. త్వరలో అక్కడ జరగబోయే ఎన్నికలు, తైవాన్పై బలప్రయోగం వంటి అంశాలను ఆయన ప్రస్తావించలేదు.
‘ విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!’
చైనా(China) నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తైవాన్(Taiwan).. జనవరి 13న దేశంలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. 2027లో తైవాన్పై దండయాత్రకు చైనా సిద్ధంగా ఉండాలని షీ జిన్పింగ్ ఆదేశించినట్లు అమెరికా సైనిక వర్గాలు చెబుతున్న వేళ ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ నేత లయ్ చింగ్-టే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి. తైవాన్లో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారమని చైనా వాదిస్తోంది.
తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్ మీదకు యుద్ధవిమానాలు, నౌకలను పంపి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కొద్దిరోజుల క్రితం తైవాన్ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూప్రింట్గా చెబుతున్న ఓ ప్లాన్ను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ విడుదల చేసింది. తైవాన్తో సమగ్ర అభివృద్ధికి ఫుజియాన్ను ‘ప్రత్యేక జోన్’గా మారుస్తానని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.