USA: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ముగ్గురి మృతి

అమెరికా (USA)లోని వాషింగ్టన్‌ నగరంలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

Published : 06 Aug 2023 12:18 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA)లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. సౌత్‌ఈస్ట్‌ వాషింగ్టన్‌ (Washington)లోని అనకోస్టియా (Anacostia) ప్రాంతంలో గుడ్‌హోప్‌ రోడ్‌లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసు అధికారి పమేలా స్మిత్‌ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒక మహిళ సహా ఇద్దరు వ్యక్తులున్నారు. శనివారం రాత్రి కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి అధికంగా ఉంటుందని, వారిని భయాందోళనకు గురి చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఈ చర్యకు పాల్పడి ఉంటాడని స్మిత్‌ అభిప్రాయపడ్డారు.

వాషింగ్టన్‌లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 150 మందికి పైగా కాల్పుల ఘటనల్లో మృతి చెందారు. రెండు దశాబ్దాల తర్వాత తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని వాష్టింగన్‌ పోస్ట్‌ తెలిపింది. ఆగస్టు నెలలోనే మొదటి ఐదు రోజుల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనల్లో డజను మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని