Sangareddy: మద్యం మత్తులో వ్యక్తి హంగామా.. బైక్‌ పోయిందని టవర్‌ ఎక్కి హల్‌చల్‌

మద్యం మత్తులో ఓ వ్యక్తి హంగామా చేశాడు. ద్విచక్రవాహనం పోయిందని టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగింది. బండ్లగూడకు చెందిన ఖదీర్‌ తన బైక్‌ పోయిందని తొలుత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో తన తలను కిటికీకి కొట్టుకున్నాడు. గాయాలవడంతో అతడిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఇంటికి వెళ్తానంటూ బయటికి వచ్చి పోలీస్ స్టేషన్ సమీపంలో టవర్ ఎక్కాడు. చివరకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల్ని పిలిపించి అతడిని కిందకి దింపారు. 

Published : 12 Apr 2024 14:12 IST

Sangareddy: మద్యం మత్తులో వ్యక్తి హంగామా.. బైక్‌ పోయిందని టవర్‌ ఎక్కి హల్‌చల్‌

మద్యం మత్తులో ఓ వ్యక్తి హంగామా చేశాడు. ద్విచక్రవాహనం పోయిందని టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగింది. బండ్లగూడకు చెందిన ఖదీర్‌ తన బైక్‌ పోయిందని తొలుత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో తన తలను కిటికీకి కొట్టుకున్నాడు. గాయాలవడంతో అతడిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఇంటికి వెళ్తానంటూ బయటికి వచ్చి పోలీస్ స్టేషన్ సమీపంలో టవర్ ఎక్కాడు. చివరకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల్ని పిలిపించి అతడిని కిందకి దింపారు. 

Tags :

మరిన్ని