JC PrabhakarReddy: సీఎం జగన్‌ పర్యటన పేరిట.. చిరు వ్యాపారుల పొట్ట కొడతారా?: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని.. పట్టణ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  చిరు వ్యాపారులపై స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షనిజం చూపిస్తున్నారని మండిపడ్డారు. 

Published : 29 Apr 2024 16:33 IST

తాడిపత్రిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని.. పట్టణ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  చిరు వ్యాపారులపై స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షనిజం చూపిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా తాడిపత్రి పట్టణంలో గత మూడు రోజులుగా ఆంక్షలు విధించారు. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను మూయించారు. చిన్న చిన్న రేకుల షెడ్లను సైతం కూల్చి వేశారు. దీంతో చిరు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఓట్లు వేసినందుకు చిరు వ్యాపారులకు ఇచ్చే బహుమతి ఇదేనా? అంటూ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకం తప్ప.. అభివృద్ధి లేదని, తాడిపత్రి పట్టణాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని మండిపడ్డారు.

Tags :

మరిన్ని