WI vs IND: దంచేసిన జైస్వాల్ - గిల్ జోడీ.. నాలుగో టీ20 హైలైట్స్ చూసేయండి
టీమ్ఇండియా అదరహో! వెస్టిండీస్తో తొలి రెండు టీ20ల్లో ఓడి.. సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడి.. అద్భుతంగా పుంజుకున్న భారత్ వరుసగా రెండో మ్యాచ్లోనెగ్గింది. మొదట వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (84 నాటౌట్; 51 బంతుల్లో 11×4, 3×6), శుభ్మన్ గిల్ (77; 47 బంతుల్లో 3×4, 5×6) చెలరేగడంతో భారత్ 17 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్ను 2-2తో సమంగా నిలిచింది. చివరి మ్యాచ్ ఆదివారం ఇదే వేదికగా జరగనుంది.
Published : 13 Aug 2023 07:05 IST
Tags :