30/04/2023 13:54(IST)
గెలిస్తే అగ్రస్థానంలోకి ధోనీ సేన!
సీఎస్కే పరిస్థితి ఇలా..
ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని (MS Dhoni) చెన్నై ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచుల్లో గెలిచింది. గతేడాది ఫైనలిస్టులు గుజరాత్, రాజస్థాన్ చేతిలోనే ఓటమిపాలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా రాజస్థాన్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగువ్వాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం ఐదు విజయాలను నమోదు చేయాలి. బౌలింగ్లో అనుభవలేమి వల్ల కీలక మ్యాచుల్లో వెనుకబడాల్సిన పరిస్థితి. పతిరాణ, తీక్షణ, దేశ్ పాండే, ఆకాశ్ సింగ్ అప్పుడప్పుడూ గాడి తప్పడం సీఎస్కేకు కష్టంగా మారింది. బ్యాటింగ్లోనూ అంబటి రాయుడు వరుసగా విఫలమవుతూ నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ బౌలర్లు అర్ష్దీప్, రబాడ, రాహుల్ చాహర్, సామ్ కరన్ను అడ్డుకోవడంపై చెన్నై బ్యాటర్లు దృష్టిపెట్టాలి.