Cyclone Montha: పెను తుపాను ‘మొంథా’.. ఆ సమయాన అంతర్వేదిపాలెంలో..

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 29 Oct 2025 06:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమలాపురం: కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని వణికించిన పెను తుపాను ‘మొంథా’ కోనసీమ వద్ద తీరాన్ని తాకింది. స్థానికులు ఆందోళన చెందినా అనూహ్య పరిణామాలు, నష్టం వంటివి సంభవించకకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తుపాను డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ వర్షాలు పడ్డాయి. కొంతసేపు వర్షం.. అంతలోనే ఎండ వంటి పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అంతర్వేదిపాలెం వద్ద ‘మొంథా’ తీరాన్ని తాకింది. సాధారణంగా తుపానులు తీరాన్ని తాకే సమయంలో తీవ్రస్థాయిలో పెనుగాలులు వీస్తుంటాయి.

ఆశ్చర్యకరంగా ఆ సమయానికి అంతర్వేదిపాలెంలో వాతావరణం సాధారణంగానే ఉంది. జిల్లాలో సాయంత్రం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేశారు. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. అంతర్వేది, సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండలాల్లోని తీర ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 6 నుంచి 7.15 గంటల ప్రాంతంలో తీవ్రమైన ఈదురుగాలులు వీచాయి. రాజోలు, మామిడికుదురు, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం, మండపేట తదితర ప్రాంతాల్లో 20 విద్యుత్తు స్తంభాలు, పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. కోనసీమ జిల్లా మాకనపాలేనికి చెందిన గూడపల్లి వీరవేణు(49) తాటిచెట్టు విరిగి పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు