Jogi ramesh: నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్
ఆయన సోదరుడు రాము కూడా అదే జైల్లో
తొలుత ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ఇద్దరూ మద్యం సిండికేట్ నడిపారన్న ఏపీపీ
అర్ధరాత్రి తర్వాత సుదీర్ఘంగా సాగిన వాదనలు 
జోగి సోదరులకు 13 వరకు రిమాండ్
తెల్లవారుజామున న్యాయాధికారి ఉత్తర్వులు 
నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు

నెల్లూరు సెంట్రల్ జైల్లోకి వెళ్తున్న జోగి రమేష్
ఈనాడు, అమరావతి: నకిలీ మద్యం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. జైలు అధికారులు రమేష్కు ఖైదీ నంబర్ 7177, రాముకు ఖైదీ నంబర్ 7178 కేటాయించారు. గతనెల ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో వీరిద్దరినీ ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కోర్టులో వాదనలు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు సాగాయి. దీనిపై ఉదయం 5 గంటలకు న్యాయాధికారి లెనిన్బాబు ఉత్తర్వులిచ్చారు.
ఈనెల 13 వరకు రిమాండ్ విధించారు. నిందితులను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో వారిని మొదట విజయవాడలోని జిల్లా జైలుకు తీసుకువెళ్లిన అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
జనార్దన్రావు నుంచి జోగికి ముడుపులు
వైకాపా హయాంలో ఎన్డీపీఎల్ మద్యం అమ్మకాలకు సహాయ, సహకారాలు అందజేసినందుకు జోగి సోదరులకు ప్రధాన నిందితులు జనార్దన్రావు, జగన్మోహన్రావుల నుంచి ముడుపులు ముట్టాయని ఏపీపీ విజయలక్ష్మి కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయన్నారు. వీరు మొదట ఇబ్రహీంపట్నంలో సమీప బంధువైన బొల్లా శ్రీనివాస్ పేరిట స్వర్ణ బార్ను ప్రారంభించారని, తర్వాత దీని పేరును చెర్రీస్ బార్గా మార్చారని పేర్కొన్నారు. మద్యం సిండికేట్ ద్వారా దీనిని 2019 వరకు జోగి రమేష్, రాములు భాగస్వాములుగా నడిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్నాళ్లపాటు బార్ నిర్వహణ నిలిపేశారు.
సాక్షులను ప్రభావితం చేస్తారు..: వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో జనార్దన్రావు, జగన్మోహన్రావులు హైదరాబాద్లో మద్యం కొని, క్యాన్లలో నింపి ఇబ్రహీంపట్నం తరలించేవారని, ఇక్కడ సీసాల్లోకి నింపి అమ్మకాలు సాగించారని తెలిపారు. దీనికి సహాయ సహకారాలు అందించినందుకు జోగి సోదరులకు రెండు, మూడు నెలలకోసారి రూ.3-5 లక్షల వరకు ముడుపులు చెల్లించేవారని అన్నారు. ఇదే క్రమంలో జోగి సోదరుల ప్రోద్బలంతో ప్రధాన నిందితులు నకిలీ మద్యం తయారీని ప్రారంభించారని తెలిపారు. మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఏపీపీ విజయలక్ష్మి వాదనలు వినిపించారు. వారికి రిమాండ్ విధించాలని లేనిపక్షంలో సాక్షులను ప్రభావితం చేస్తారని అభ్యర్థించారు.
సీబీఐ విచారణ కోరారు
నకిలీ మద్యం వ్యవహారంపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని జోగి రమేష్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారని ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదించారు. జోగిపై అక్రమంగా కేసు నమోదు చేశారని అన్నారు. సహ నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా జోగి సోదరులను అరెస్టు చేయడం తగదన్నారు. ఇలాగైతే సంబంధం లేని ఎవరినైనా నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుందన్నారు.
- ప్రాసిక్యూషన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి లెనిన్ బాబు.. నిందితులు జోగి రమేష్, జోగి రాములకు రిమాండ్ విధించారు.
 - జోగి సోదరులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అరెస్టు చేసిన తర్వాత.. ఆదివారం సుదీర్ఘంగా విచారించినా జోగి రమేష్, రాము సహకరించలేదని, మరింత లోతుగా విచారించాల్సి ఉందని తెలిపారు. దీనిపై ప్రాసిక్యూషన్ కౌంటర్ దాఖలుకు వీలుగా కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
 
జోగి సోదరులకు కాకాణి భరోసా
నెల్లూరు (నేర విభాగం), న్యూస్టుడే: జోగి రమేష్, రాములను సోమవారం రాత్రి 7.40 గంటలకు నెల్లూరు కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. వారిద్దరికీ న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకు తీసుకువచ్చారు. జైలు అధికారులు వారికి ఖైదీ నంబర్లు 7177, 7178 కేటాయించారు. జైలు వద్ద మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వారిని కలిశారు. అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని కాకాణి జోగి రమేష్కు భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో మావయ్య నిర్దోషి
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు పాక్షికంగా సవరించింది. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

పెట్టుబడులకు ఏపీ ఎంతో అనుకూలం
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో అనుకూల వాతావరణం ఉందని, అనుమతులు సైతం సింగిల్ విండో విధానంలో జారీ చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. - 
                                    
                                        

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎయిమ్స్లో చికిత్స
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మంగళగిరి ఎయిమ్స్లో వైద్య చికిత్స అందించారు. - 
                                    
                                        

మద్యం డబ్బులు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేయగలరా?
‘మద్యం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని నేను దేవుడిపై ప్రమాణం చేస్తాను. తాను తీసుకోలేదని వైకాపా నేత జగన్ తన పిల్లలపై గానీ దేవుడిపై గానీ ప్రమాణం చేయగలరా’ అని మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. - 
                                    
                                        

అమరావతిలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్
అమరావతిలో వచ్చే జనవరి నాటికి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. లండన్లో పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. - 
                                    
                                        

విజయవాడలో ఎల్ఐసీ హౌసింగ్ ఉప ప్రాంతీయ కార్యాలయం
వ్యక్తిగత గృహ రుణాల మంజూరులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆశించిన ప్రగతి కనబరుస్తోందని, భవిష్యత్తులో మరింత పుంజుకుంటుందని ఆ సంస్థ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఓఎంసీ గనుల్లో డ్రోన్ సర్వే ప్రారంభం
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు గుర్తింపు కోసం సోమవారం అధికారులు డ్రోన్తో సర్వే ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం, సిద్ధాపురం గ్రామాల పరిధిలో అక్రమ తవ్వకాల కారణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులు గల్లంతయ్యాయి. - 
                                    
                                        

‘వీధి కుక్కలకు ఆహారం’పై త్వరలో మార్గదర్శకాలు
ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వీధి శునకాలకు ఉద్యోగులు ఆహారం పెట్టే విషయంలో తగు మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. - 
                                    
                                        

భాగస్వామ్య సదస్సులో ₹ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు 45 దేశాలకు చెందిన 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరుకానున్నారని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. - 
                                    
                                        

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి మా లక్ష్యం
రాష్ట్రంలో 160 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లండన్లో అతిపెద్ద విద్యుత్తు సరఫరాదారుగా ఉన్న ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ను రాష్ట్రానికి ఆహ్వానించారు. - 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

హాయ్ల్యాండ్కు తరలించాలన్న నిర్ణయం ఎవరిది?
‘ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను మంగళగిరి సమీపంలోని హాయ్ల్యాండ్ రిసార్ట్కు తరలించాలనే నిర్ణయం ఎవరిది? ఏపీపీఎస్సీ సమష్టిగా నిర్ణయం తీసుకుందా? లేదా అప్పటి ఛైర్మన్, లేదా కార్యదర్శి నిర్ణయం మేరకు వాటిని తరలించారా? ఇందుకు సంబంధించిన ఏమైనా ఉత్తర్వులున్నాయా? - 
                                    
                                        

రాజధాని నిర్మాణానికి మరో ₹ 32,500 కోట్ల రుణం
రాజధాని అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) మరో రూ.32,500 కోట్లు రుణం తీసుకోనుంది. - 
                                    
                                        

పింఛనుదారులకు డిజిటల్ సాధికారత
పింఛనుదారులకు డిజిటల్ సాధికారత కల్పించడం, పింఛను పొందే ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ జీవన ప్రమాణ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వ పింఛను, పింఛనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవేశ్ కుమార్ పేర్కొన్నారు. - 
                                    
                                        

భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలి
‘కార్తిక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగినందున భక్తుల భద్రత, సౌకర్యాలపై యంత్రాంగం దృష్టి సారించాలి. క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతలపై తగిన చర్యలు చేపట్టాలి’ అని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు. - 
                                    
                                        

ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్
తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా.. ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పేర్కొన్నారు. - 
                                    
                                        

దొనకొండలో ప్రపంచస్థాయి క్యాన్సర్ సెంటర్ రూ.4,260 కోట్లతో నిర్మాణం
ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.4,260 కోట్ల (480 మిలియన్ డాలర్ల) వ్యయంతో ‘చున్ జియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్’ను నిర్మించనున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం ఛైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. - 
                                    
                                        

రాష్ట్రంలో ‘హిందుజా’ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
హిందుజా గ్రూపు రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు (13 )
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


