కూలిన వీరబ్రహ్మేంద్రస్వామి గృహం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 30 Oct 2025 07:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కూలిన గృహాన్ని పరిశీలిస్తున్న పూర్వపు మఠాధిపతి కుమారులు

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి గృహం బుధవారం ఉదయం కూలిపోయింది. వరుస వర్షాలకు నానిపోయి.. ఓ వైపు పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరంభట్లయ్య స్వామి, దత్తాత్రేయస్వామి కూలిన భాగాన్ని పరిశీలించారు. ఈ మిద్దె 350 ఏళ్ల నాటిదని తెలిపారు. పునర్‌ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని, త్వరలోనే పనులు చేపడతామన్నారు.

Tags :
Published : 30 Oct 2025 06:58 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని