పోషకాలకు నెలవు మైక్రోగ్రీన్స్
రోజురోజుకు ఆహారం కలుషితం అవుతున్న వేళా ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి పచ్చని, తాజా కూరగాయలు, ఆకుకూరలు తినడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార పద్ధతుల్లో వచ్చిన మార్పుల వల్ల ఇంట్లో పండించిన, పురుగుమందులు వాడని
రోజురోజుకు ఆహారం కలుషితం అవుతున్న వేళా ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి పచ్చని, తాజా కూరగాయలు, ఆకుకూరలు తినడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార పద్ధతుల్లో వచ్చిన మార్పుల వల్ల ఇంట్లో పండించిన, పురుగుమందులు వాడని పంటలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మైక్రోగ్రీన్స్ వాడకం వెలుగులోకి వచ్చింది. మైక్రోగ్రీన్స్ అనేవి 10-15 రోజుల వయస్సు కలిగిన వివిధ రకాలైన ఆకుకూరలు. వీటిని బేబీ ప్లాంట్లుగా పరిగణిస్తారు. మైక్రోగ్రీన్స్ అనేవి పోషకా హారాన్ని మెరుగుపరచడానికే కాకుండా తినే పదార్థాల ఆకృతిని మెరుగుపరచడంలోనూ, రుచిని పెంచడంలోనూ సహాయపడతాయి. ఇవి చిన్న పరిమాణాల్లో ఉన్నప్పటికీ... చాలా పరిణతి చెందిన ఆకుకూరల కంటే ఎక్కువ పోషక విలులను కలిగి ఉంటాయి. అత్యధిక పోషకాల లభ్యత వల్ల ప్రపంచ ఆరోగ్యసంస్థ వీటిని సూపర్ ఫుడ్గా ప్రకటించింది. ప్రజలు వీటిని ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రజాదరణ పొందుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మైక్రోగ్రీన్స్ను తక్కువ స్థలంలో ఎలా పెంచుకోవాలి? ఈ పద్ధతిలో ఏయే రకాల ఆకుకూరలు పండించుకోవచ్చు? వీటికి అవసరమైన విత్తనాలు ఎక్కడ లభిస్తాయి? పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఒక్కో పంట ఎన్నిరోజుల్లో చేతికొస్తుంది? తదితర వివరాలు జనవరి ‘అన్నదాత’లో మీకోసం.
మరెన్నో ఆసక్తికర కథనాలు అన్నదాత జనవరి-2022 సంచికలో...
‘అన్నదాత’ చందాదారులుగా చేరడానికి సంప్రదించాల్సిన ఫోన్ నెం: 9121157979, 8008522248
(ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM