వీఆర్‌కు నగరంపాలెం సీఐ!

గుంటూరులోని నగరంపాలెం సీఐ లోక్‌నాథాన్ని వీఆర్‌కు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.

Published : 29 Apr 2024 05:13 IST

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గుంటూరులోని నగరంపాలెం సీఐ లోక్‌నాథాన్ని వీఆర్‌కు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. నగరంపాలెం ఏసుభక్తనగర్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థినిగా విడదల రజని నామినేషన్‌ వేయడానికి వెళుతున్న క్రమంలో ఆమెను కిడ్నాప్‌ చేశారనే ఉదంతంపై ఉన్నతాధికారులకు సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదనే కారణంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని