Kishan Reddy: వైకాపా అరాచక పాలన ఎన్నాళ్లో సాగదు
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడుతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎద్దేవా చేశారు. సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయడం లేదన్నారు.
అప్పుల కోసం వైకాపా సర్కారు ఆరాటం
‘రాయలసీమ రణభేరి’ సభలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని నేతల ఉద్ఘాటన
ఈనాడు డిజిటల్, కడప: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అప్పుల కోసం పాకులాడుతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎద్దేవా చేశారు. సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయడం లేదన్నారు. అప్పులు చేసి ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించారు.కడపలో శనివారం జరిగిన రాయలసీమ రణభేరి సభలో ఆయన మాట్లాడారు. ‘వ్యతిరేకంగా మాట్లాడేవారిని అణచివేసే ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నాం. పార్టీ మారితే కేసులు పెడతారు. భూములు కబ్జా చేస్తారు. వ్యాపారాలు దెబ్బతీస్తారు. ఇలాంటి అరాచక పాలన ఎన్ని రోజులో సాగదు. రతనాల సీమ లాంటి రాయలసీమ నేడు వెనుకబడిపోయింది. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు. ఎవరు వచ్చినా సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడమే సీమ వెనుకబాటుకు కారణం. నికర జలాలు కేటాయింపు లేక రాయలసీమ నష్టపోయింది’ అని ధ్వజమెత్తారు. ‘నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ ఏం చేశారు? రాయలసీమ సమస్యలపై భాజపా మొదటి నుంచి పోరాడుతోంది. జాతీయ రహదారుల అభివృద్ధి బాధ్యత కేంద్రం తీసుకుంది. గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. శ్రీశైలం, అన్నవరం, అమరావతి క్షేత్రాల అభివృద్ధికి నిధులిస్తోంది’ అని తెలిపారు. ‘రానున్న రోజుల్లో రాయలసీమను మరింత అభివృద్ధి చేస్తాం. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో కుటుంబపాలనకు ప్రజలు స్వస్తి పలికారు. ఇక్కడ కూడా రౌడీ రాజ్యం పోవాలి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి’ అని ఆకాంక్షించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ‘పులివెందులలో మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఆమె భూములు కబ్జా చేశారు. బద్వేలులో పార్టీకి మద్దతు పలికిన వారి భూములను నీటముంచారు. ఇసుక, మట్టి అమ్ముకునే దొంగల పార్టీ వైకాపా. చైనా, పాకిస్థాన్కే భాజపా భయపడలేదు. జగన్కు భయపడుతుందా?’ అని పేర్కొన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందన్నారు. జగన్ మద్యం అమ్ముకుంటుంటే.. ఆ పార్టీ నేతలు కల్తీసారా దందా చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో న్యాయ రాజధాని పెడతానన్న జగన్.. ఏనాడైనా అమరావతి నుంచి హైకోర్టును మార్చాలని కేంద్రానికి లేఖ రాశారా? అని నిలదీశారు.
భాజపాతోనే మంచి భవిష్యత్తు
మా కుటుంబానికి రాయలసీమతో అవినాభావ సంబంధం ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ‘రాయలసీమ దత్తపుత్రుడిగా ప్రకటించుకున్న ఎన్టీఆర్.. తిరుపతి నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఎన్టీఆర్ కుమార్తెగా నేను సీమ ఆడబిడ్డగా భావిస్తున్నా. రాయలసీమ క్షామ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇక్కడ భిక్షాటన చేపట్టారు. సిద్దేశ్వరం అలుగు రాయలసీమ జీవనాడి. దీనిపై ఏ ప్రభుత్వమూ దృష్టి పెట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. 200 టీఎంసీల నీరు రాయలసీమకు రావాల్సి ఉండగా.. ఎంతమేరకు అందిస్తున్నారో తరచిచూసుకోవాలి’ అని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర సహ బాధ్యులు సునీల్ దేవధర్ మాట్లాడుతూ.. తిరుమలేశుని తొలి గడప కడపలో టిప్పుసుల్తాన్ విగ్రహం పెడతామంటే ఊరుకోమన్నారు. హిందువులను ఊచకోత కోసిన వ్యక్తి విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెడతామంటే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు.
శవాలకు కుట్లు వేసే పార్టీ
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి విమర్శించారు. వైఎస్ వివేకాను వాళ్లే చంపించి నాపై కేసులు పెట్టారని మండిపడ్డారు. కేసులో బయటకు వస్తున్న పేర్లన్నీ వారివే అన్నారు. శవాలకు కుట్లు వేయడం, రక్తపు మరకలు తుడవడం లాంటి పనులకు పాల్పడే పార్టీ వైకాపా అని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, నాయకులు కామినేని శ్రీనివాస్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.