Gautam Adani: అదానీ వార్షిక వేతనం రూ.10.41 కోట్లు.. సొంత ఎగ్జిక్యూటివ్ల కంటే తక్కువ!
.webp)
Gautam Adani | ఇంటర్నెట్డెస్క్: దేశంలోని అత్యంత సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10.41 కోట్ల వేతనం అందుకున్నారు. అయితే, దేశంలోని తోటి పారిశ్రామికవేత్తలు, తన గ్రూప్ కంపెనీల్లో పని చేస్తున్న కొంత మంది ఎగ్జిక్యూటివ్ల కంటే తక్కువ కావడం గమనార్హం. ఓడరేవులు, ఇంధన రంగాల్లో విస్తరించిన తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో కేవలం రెండింటి నుంచి మాత్రమే ఆయన వేతనం తీసుకున్నారు. 2023-24లో రూ.9.26 కోట్లుగా ఉన్న ఈ మొత్తం 2024-25లో 12 శాతం పెరిగింది.
గ్రూప్లో ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.26 కోట్లు అందుకున్నారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో రూ.28 లక్షలు ఆయనకు లభించాయి. దీంతో ఆయన మొత్తం రూ.2.54 కోట్లు తీసుకున్నాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రూ.2.46 కోట్ల కంటే కొంచెం ఎక్కువ. మరో కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషనల్ ఎకనమిక్ జోన్ (APSEZ) నుంచి రూ.1.8 కోట్ల వేతనం, రూ.6.07 కోట్ల కమిషన్ (లాభాల్లో వాటా) తో కలిపి రూ.7.87 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది ఈ మొత్తం రూ.6.8 కోట్లుగా ఉంది.
దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వార్షిక వేతనం రూ.15కోట్లుగా ఉండేది. అయితే, కొవిడ్ తర్వాత ఆయన వేతనాన్ని తీసుకోవడం లేదు. ఇక భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీత్ మిత్తల్ (2023-24లో రూ.32.27 కోట్లు), రాజీవ్ బజాజ్ (రూ.53.75 కోట్లు), పవన్ ముంజాల్ (రూ.109 కోట్లు), ఎల్అండ్టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రమణ్యం (76.25 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ (రూ.80.62కోట్లు) వేతనాలు అదానీ కంటే అధికంగా ఉన్నాయి.
అదానీ గ్రూప్లోని కొందరు ఎగ్జిక్యూటివ్ల జీతాలు కూడా గౌతమ్ కంటే ఎక్కువ. ఏఈఎల్ సీఈఓ వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈఓ వినీత్ ఎస్.జైన్ రూ. 11.23 కోట్లు అందుకున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ సంపద విలువ 82.5 బిలియన్ డాలర్లు. హిండెన్బర్గ్ నివేదిక వల్ల ఆయన ఆస్తుల విలువ సుమారు 150 బిలియన్ డాలర్ల మేరకు తగ్గింది. అయినప్పటికీ గతేడాదిలో రెండు సార్లు ఆసియా అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇక.. ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 104 బిలియన్ డాలర్ల సంపదతో 17వ స్థానంలో, అదానీ 20వ స్థానంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
Airtel Q2 Results: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. - 
                                    
                                        

ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. - 
                                    
                                        

ఏఐకి సొంత తెలివి తెప్పించేందుకు ప్రయత్నించొద్దు.. మైక్రోసాఫ్ట్ AI చీఫ్ కీలక వ్యాఖ్యలు
Microsoft AI chief on AI consciousness: ఏఐకి సొంత తెలివితేటలు అబ్బేలా పరిశోధకులు, డెవలపర్లు చేస్తున్న ప్రయత్నాలను సులేమాన్ తప్పుబట్టారు. మనిషికి మాత్రమే నిజమైన ఎమోషన్లు ఉంటాయని పేర్కొన్నారు. - 
                                    
                                        

హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ లుక్తో టీజర్
Hero Vida Electric bike: విడా బ్రాండ్పై విద్యుత్ వాహన రంగంలోకి ప్రవేశించిన హీరో మోటోకార్ప్.. త్వరలో విద్యుత్ మోటార్ సైకిల్ను విడుదల చేయనుంది. - 
                                    
                                        

టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగింపు.. సవాల్ చేసిన మెహ్లీ మిస్త్రీ..!
Tata Trusts: టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగిన మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముంబయి ఛారిటీ కమిషనర్ ఎదుట కేవియెట్ దాఖలు చేశారు. - 
                                    
                                        

మనీలాండరింగ్ కేసు.. అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్
Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీకి చెందిన రూ.3వేల కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. - 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్వైఐ గణాంకాలు చెబుతున్నాయి. - 
                                    
                                        

టైమ్ బ్యాంక్.. వృద్ధులకు అండగా వినూత్న ప్రాజెక్ట్
వృద్ధుల కోసం సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటుచేసే దిశగా కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ (K-DISC) వినూత్న ఆలోచన చేసింది. తలస్సేరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ‘టైమ్ బ్యాంక్’ ప్రాజెక్ట్ను రూపొందించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


