Gautam Adani: నా మనవరాళ్లు విశాల ప్రపంచాన్ని చూడాలి
లింగ సమానత్వం అవకాశం కాదు..అవసరం
గౌతమ్ అదానీ భావోద్వేగ పోస్టు

దిల్లీ: ‘లింగ సమానత్వం అనేది కేవలం మహిళలకు అవకాశం కల్పించడం కాదు. ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం’ అని అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన సామాజిక వేదిక లింక్డ్ఇన్లో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తన ముగ్గురు మనవరాళ్ల భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతూ.. వారు గాజు గదుల్లోనుంచి కాకుండా తెరిచిన తలుపుల నుంచి విశాల ప్రపంచాన్ని చూడాలని ఆంకాక్షించారు. ‘నా మనవరాళ్లు బోర్డు రూములకు వెళ్లినప్పుడు అక్కడ వారొక్కరే మహిళగా ఉండకూడదు. వారు తమ స్థానం కోసం పోరాడాల్సిన అవసరం రాకూడదు’ అని పేర్కొన్నారు.
బనస్కాంత(గుజరాత్)లోని తన బాల్యం నుంచి నేటి బోర్డు రూముల వరకూ తన జీవితాన్ని మలిచిన మహిళల గురించి అదానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తల్లి, భార్య ప్రీతి అదానీ జీవితంలో మహిళల ప్రాధాన్యం తెలియజేశారని పేర్కొన్నారు. తన తల్లి కష్టాలను అవకాశాలుగా మార్చారని, అదానీ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది జీవితాల్లో ప్రీతి వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. అదానీ గ్రూపు సంస్థల్లో మహిళలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, సాంకేతిక బృందాల నుంచి పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల వరకూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని ఆయన తెలిపారు.
‘కొన్నేళ్ల క్రితం ఒక పోర్టును సందర్శించాను. అక్కడ మహిళలు లేకపోవడం గమనించాను. సరైన అవకాశాలు లేకపోవడం వల్లే వారు దూరంగా ఉన్నారని అర్థమైంది. అప్పటి నుంచి మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాను’ అని వివరించారు. ‘లక్షాధికారి దీదీలు’ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవని, వారికి సమాన అవకాశాలు కల్పిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
Airtel Q2 Results: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. - 
                                    
                                        

ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. - 
                                    
                                        

ఏఐకి సొంత తెలివి తెప్పించేందుకు ప్రయత్నించొద్దు.. మైక్రోసాఫ్ట్ AI చీఫ్ కీలక వ్యాఖ్యలు
Microsoft AI chief on AI consciousness: ఏఐకి సొంత తెలివితేటలు అబ్బేలా పరిశోధకులు, డెవలపర్లు చేస్తున్న ప్రయత్నాలను సులేమాన్ తప్పుబట్టారు. మనిషికి మాత్రమే నిజమైన ఎమోషన్లు ఉంటాయని పేర్కొన్నారు. - 
                                    
                                        

హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ లుక్తో టీజర్
Hero Vida Electric bike: విడా బ్రాండ్పై విద్యుత్ వాహన రంగంలోకి ప్రవేశించిన హీరో మోటోకార్ప్.. త్వరలో విద్యుత్ మోటార్ సైకిల్ను విడుదల చేయనుంది. - 
                                    
                                        

టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగింపు.. సవాల్ చేసిన మెహ్లీ మిస్త్రీ..!
Tata Trusts: టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగిన మెహ్లీ మిస్త్రీ న్యాయపోరాటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముంబయి ఛారిటీ కమిషనర్ ఎదుట కేవియెట్ దాఖలు చేశారు. - 
                                    
                                        

మనీలాండరింగ్ కేసు.. అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్
Anil Ambani: మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీకి చెందిన రూ.3వేల కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. - 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్వైఐ గణాంకాలు చెబుతున్నాయి. - 
                                    
                                        

టైమ్ బ్యాంక్.. వృద్ధులకు అండగా వినూత్న ప్రాజెక్ట్
వృద్ధుల కోసం సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటుచేసే దిశగా కేరళ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ (K-DISC) వినూత్న ఆలోచన చేసింది. తలస్సేరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ‘టైమ్ బ్యాంక్’ ప్రాజెక్ట్ను రూపొందించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 


