అధికార పార్టీ కౌన్సిలర్‌ వేధిస్తున్నాడని ఫిర్యాదు

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రెండో వార్డు అధికార పార్టీ కౌన్సిలర్‌ శేషాద్రి తనను వేధిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన వివాహిత ఆరోపించారు. బుధవారం ఆమె

Published : 19 May 2022 05:23 IST

పెనుకొండ, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రెండో వార్డు అధికార పార్టీ కౌన్సిలర్‌ శేషాద్రి తనను వేధిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన వివాహిత ఆరోపించారు. బుధవారం ఆమె పెనుకొండ ఎస్‌ఐ రమేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా కౌన్సిలర్‌ శేషాద్రి తన ఇంటి వద్దకు వచ్చి కూర్చునేవాడని, రావద్దని పలుమార్లు చెప్పినా వినలేదని బాధితురాలు చెప్పారు. ఈ విషయాన్ని గతంలో కౌన్సిలర్‌ భార్యకు కూడా చెప్పానన్నారు. పదిరోజుల క్రితం స్థానిక బస్టాండు వద్ద గొడవకు దిగి తనను చెప్పుతో కొట్టాడని ఆమె ఆరోపించారు. కౌన్సిలర్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. రక్షణ కల్పించకపోతే బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ రమేష్‌బాబును వివరణ కోరగా వివాహిత ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని