విలేకరిపై శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలి సభ్యుడి దాడి
శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి సభ్యుడు బుల్లెట్ జయ శ్యామ్ స్థానిక రాజ్ న్యూస్ విలేకరి ఈశ్వర్పై దాడికి పాల్పడిన ఘటన తిరుపతి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్నగర్ కాలనీ వద్ద తన
తిరుపతి, న్యూస్టుడే: శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి సభ్యుడు బుల్లెట్ జయ శ్యామ్ స్థానిక రాజ్ న్యూస్ విలేకరి ఈశ్వర్పై దాడికి పాల్పడిన ఘటన తిరుపతి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్నగర్ కాలనీ వద్ద తన ఇంటి స్థలాన్ని జయశ్యామ్ కబ్జా చేసి, పునాదులు వేశారని ఈశ్వర్ ఆరోపించారు. ఇదేం న్యాయమని ప్రశ్నించడంతో జయశ్యామ్ దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టింది. ఇటీవల తెదేపా రాష్ట్ర కార్యదర్శి చలపతినాయుడుపై దాడికి పాల్పడిన జయశ్యామ్.. తాజాగా విలేకరిపైనా దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్