Kakinada: మద్యం మత్తులో తల్లిపై విచక్షణారహితంగా దాడి
కన్నకొడుకు విచక్షణారహితంగా కాళ్లతో తన్నడంతో ఆ మాతృమూర్తి తీవ్రంగా గాయపడింది. కాకినాడ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ..
కాజులూరు, యానాం, న్యూస్టుడే: కన్నకొడుకు విచక్షణారహితంగా కాళ్లతో తన్నడంతో ఆ మాతృమూర్తి తీవ్రంగా గాయపడింది. కాకినాడ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న మద్యానికి బానిసయ్యాడు. పింఛను డబ్బులు ఇవ్వాలంటూ తరచూ తల్లి లక్ష్మి(75)ని హింసిస్తున్నాడు. మాతృమూర్తి పీక మీద కాలు వేసి తొక్కుతూ వేధిస్తున్నాడు. ఆదివారం ఉదయం వెంకన్న తన తల్లిపై దాడిచేస్తుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది.
దీంతో కాకినాడ డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బాధితురాలిని యానాం ఆసుపత్రి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకన్న క్రూర చర్యలపై గతంలో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు, కుటుంబసభ్యులూ ఫిర్యాదు చేయలేదు. పోలీసులు భరోసా ఇవ్వడంతో బాధితురాలి పెద్దకుమారుడు సుబ్బారావు ఫిర్యాదు చేశారని, నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు