కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన
విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్ లైన్మెన్ నడిగొట్టు పవన్ కళ్యాణ్ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.
విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కుటుంబీకులు, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు
ఆదిలాబాద్ అర్బన్, న్యూస్టుడే : విద్యుత్తు స్తంభంపై నుంచి పడి మృతి చెందిన జూనియర్ లైన్మెన్ నడిగొట్టు పవన్ కళ్యాణ్ మృతదేహంతో వారి కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. శనివారం రిమ్స్ శవాగారం నుంచి మృతదేహాన్ని విద్యుత్తు ఎస్ఈ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి నినాదాలు చేశారు. తమను పోషించాల్సిన ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు బుచ్చయ్య, లక్ష్మి దంపతులు, సోదరి కోమల రోధించారు. వారికి మద్దతుగా నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు చేరుకున్నారు. రూ.50లక్షల నష్టపరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టూటౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని అటు కుటుంబీకులతో, అధికారులు, లైన్మెన్ల సంఘం నాయకులతో మాట్లాడారు. చివరకు లైన్మెన్ సంటెన్న రూ.3 లక్షలు, ఆదిలాబాద్ డివిజన్ కార్మికులు రూ.2 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. శాఖాపరంగా రావాల్సిన నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా ప్రతిపాదనలు పంపుతామని అధికారులు ఒప్పుకోవడంతో కుటుంబీకులు ఆందోళన విరమించారు. నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు అంజయ్ కుమార్, వెంకటేష్, రామ్కుమార్, వేణుగోపాల్, శ్రీనివాస్, మురళీ, అఖిల్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశాబ్ది సంబరం.. ప్రజాపాలనకు అంకురం
[ 03-06-2024]
‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు నిండాయి. దశాబ్ది వేడుకల వేళ జిల్లా ప్రజలకు శుభాభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరులకు నివాళులు. -
హరిత లక్ష్యం ఖరారు
[ 03-06-2024]
జిల్లాలో హరితహారం లక్ష్యం ఖరారైంది. 2024లో జిల్లా వ్యాప్తంగా 25.03 లక్షల మొక్కలు నాటనున్నారు. -
సైకిల్ సవారీ.. ఆరోగ్యం దరిచేరి!
[ 03-06-2024]
తెల్లవారుజామున పాల ప్యాకెట్ నుంచి కిరాణా సామగ్రి కొనుగోలు వరకు ద్విచక్ర వాహనాన్నే వినియోగిస్తున్నాం. పక్క వీధిలో పని ఉన్నా బైకు తీయాల్సిందే. -
విద్యార్థులూ.. ఇలా సన్నద్ధమవ్వండి
[ 03-06-2024]
పది, ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఇంటర్, డిగ్రీ, బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. -
బావి నీరే దిక్కు!
[ 03-06-2024]
తలమడుగు మండలం కొండపై ఉన్న పల్సి(బి) గ్రామస్థులు మూడు నెలలుగా తాగునీటికి అవస్థలు పడుతున్నారు. -
గాలివాన.. భయాందోళన
[ 03-06-2024]
సూర్యుడి భగభగలకు తోడు తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరికి గురైన జిల్లావాసులను.. వరణుడు కాస్త చల్లబర్చాడు. -
ఏడాదిగా ఎదురుచూపులే!
[ 03-06-2024]
ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదివే ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో వసతుల మాటమోగానీ.. పిల్లలకు వడ్డించే భోజన బిల్లుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. -
10,83,453 ఓట్లు.. 136 రౌండ్లు
[ 03-06-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
‘ఇంజినీరింగ్’ కళాశాల వచ్చేనా..?
[ 03-06-2024]
ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇంజినీరింగ్ కళాశాల అందుబాటులో లేదు. -
భారాస యువజన నాయకుడిపై దాడి
[ 03-06-2024]
మంచిర్యాల భారాస మాజీ పట్టణ అధ్యక్షుడు గడప రాకేష్పై కొందరు ఆకస్మిక దాడి చేసిన ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. -
విశ్రాంత అధికారికి వేతనం చెల్లింపు!
[ 03-06-2024]
విధుల్లో లేని ఓ విశ్రాంత జిల్లా అధికారికి పూర్తి నెల వేతనం ఆ సంస్థ అధికారులు చెల్లించారు. -
నీ ఒక్క ఓటుతో గెలిచానా?
[ 03-06-2024]
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారమైన ఓ ఆడియో సంభాషణ చర్చకు దారితీసింది.
తాజా వార్తలు (Latest News)
-
కాసేపట్లో తెలంగాణ పాలిసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో
-
తాగి ఉన్నా.. మర్చిపోయా!: పుణె కారు ప్రమాద నిందితుడి సమాధానం
-
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మిస్సింగ్
-
కత్తితో దాడి చేసినా.. హైదరాబాద్లో దొంగలను ప్రతిఘటించిన యువకుడు
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్లివే!
-
ఎగ్జిట్ పోల్స్ జోష్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు