అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీఎఫ్ఓ, ఎఫ్డీఓలను సరెండర్ చేయాలని జడ్పీ తీర్మానం
మాట్లాడుతున్న జడ్పీ ఇన్ఛార్జి ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, చిత్రంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
ఈనాడు, ఆసిఫాబాద్: అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ ఇన్ఛార్జి ఛైర్మన్ కోనేరు కృష్ణారావు అధ్యక్షతన శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాలనాధికారి వెంకటేష్ దోత్రే, అదనపు పాలనాధికారి దీపక్ తివారీ, సీఈఓతోపాటు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఆర్అండ్బీ ఈఈ పెద్దన్న ప్రగతి పనులు వివరిస్తుండగానే.. దశాబ్దాల నుంచి అసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనల పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని సభ్యులు నిలదీశారు. కాగజ్నగర్ డివిజన్లో ఒక గుత్తేదారుకే ఎనిమిది రోడ్లు అప్పజెప్పారని, ఏ రోడ్డూ పూర్తి కావడం లేదని, కొత్మీర్-దహెగాం రెండు వరుసల రహదారి పనులు ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయని, ఆసిఫాబాద్-ఉట్నూరు రహదారి మరమ్మతుల టెండర్ పూర్తయినా ఎందుకు చేయడం లేదని.. సభలో ప్రశ్నించారు. ‘కార్యాలయంలో ముగ్గురం మాత్రమే ఉద్యోగులం ఉన్నామని, ఇంతకంటే ఎక్కువ పనిచేయలేమని’.. ఈఈ బదులిచ్చారు.
గుండాలకు అత్యవసర సమయంలో అంబులెన్స్లు సైతం వెళ్లని విధంగా రోడ్డు ఉందని జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. అనార్పల్లి, లక్మాపూర్ వంతెనలు దశాబ్దాల నుంచి అసంపూర్తిగా ఉన్నాయని ఎంపీపీ మోతీరాం చెప్పారు. మంత్రి సీతక్క వచ్చి పరిశీలించిన గుండి వంతెన పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వంతులవారీగా వస్తున్నారని.. జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు అన్నారు. ‘ఫోన్ చేసినా డీఎఫ్ఓ నీరజ్కుమార్, ఎఫ్డీఓ అప్పలకొండ స్పందించరు. ఇటువంటి అధికారులు పనిచేయరు. వీరిని సరెండర్ చేయడానికి తీర్మానం చేయాలని..’ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొనగా.. సభ్యులందరూ మద్దతు పలికారు.
హాజరైన అధికారులు, నేతలు
‘‘స్మగ్లర్లతో కుమ్మక్కై కలపను అటవీ అధికారులే తరలిస్తున్నారు. వాస్తవంగా మీరే పెద్ద స్మగ్లర్లు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెల గడిచింది. 45 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా, ఇప్పటికీ పదిశాతం మేర 2వేల మెట్రిక్ టన్నులే తీసుకున్నారు. వర్షాలు కురుస్తున్నాయి. కొనుగోళ్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. టెండర్ పూర్తయినా జిల్లాలో చాలా చోట్ల రహదారుల పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాంతాలకు వెళ్తే ప్రజలు మమ్మల్ని దూషిస్తున్నారు. మీకు చాతకాకుంటే చెప్పండి మేమే పనులు చేస్తాం. అధికారులు, కొందరు నేతలు మిలాఖతై ఇసుక దందా నడిపిస్తున్నారు. ఇందులో అందరికీ వాటాలు ఉన్నాయి. ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆమోదంతోనే పనులు జరుగుతాయని అంటున్నారు. ఒక బోర్వెల్ సైతం మంజూరు చేయలేక జిల్లాలో మేముండి ఏం ప్రయోజనమని..’’ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్బాబు, కోవ లక్ష్మి, పలువురు జడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు.
రెవెన్యూ పట్టాలున్నా ఇళ్లు కట్టుకోకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని, సాగు చేయకుండా గొడవలు చేస్తున్నారని.. జడ్పీ ఇన్ఛార్జి ఛైర్మన్ కృష్ణారావు అన్నారు. రహదారుల పనులు వేగంగా పూర్తి చేయడంతోపాటు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని పాలనాధికారి వెంకటేష్ దోత్రె పేర్కొన్నారు.
భూ కబ్జాలను అరికట్టాలి
- కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
జన్కాపూర్లో, రాజంపేట వసతిగృహం ముందు, అటవీశాఖ చెక్పోస్టు ఎదురుగా కొందరు నేతలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. పెద్దవాగు వంతెన సమీపంలో సైతం కబ్జాల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ భూములను చదును చేసి ప్రహరీ నిర్మిస్తున్నారు. వీటిని వెంటనే అడ్డుకోవాలి. డీఎఫ్ఓ నీరజ్కుమార్, ఎఫ్డీఓ అప్పలకొండ స్పందించరు. గ్రామాల్లో బోర్లు వేయనీయడం లేదు. అటవీ అధికారులు చాలా మంది స్మగ్లర్లతో కుమ్మక్కై దుంగలు అమ్ముకుంటున్నారు. కూలీలు ఉపాధిహామీ డబ్బుల కోసం 10-20 కిలోమీటర్లు సంకేతాలు లేక నడవాల్సి వస్తోంది. జియో టవర్ల నిర్మాణాలు వేయనీయడం లేదు. అడవుల్లో చెక్డ్యాంలను ఎవరిని అడిగి కడుతున్నారు. కేసులకు భయపడం. మేము తిరగబడతాం. రెబ్బెన నుంచి నిత్యం 50-60 లారీల్లో ఇసుక వెళ్తోంది. చెన్నూర్ బిల్లులు చూపించి తీసుకెళ్తున్నారు. ఇందులో అందరికీ వాటాలు ఉన్నాయి.
ధాన్యం కొనుగోళ్లలో కోతలుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం
- పాల్వాయి హరీశ్బాబు, సిర్పూర్ ఎమ్మెల్యే
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్లు, గన్నీ సంచుల కొరత ఉంది. రైతుల పొట్టకొట్టడానికి అధికారులు దళారులకు మద్దతు తెలిపేలా వ్యవహరిస్తున్నారు. కేంద్రాల్లో రెండు, మూడు కిలోలు, మిల్లుల్లో 5-6 కిలోల ధాన్యం ఒక క్వింటాలులో కోత పేరుతో అదనంగా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉంటే రైతుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడిస్తాం. మరో వారంలో వర్షాలు వస్తాయి కొనుగోలు వేగవంతం చేసేలా ఇతర జిల్లాల మిల్లులకు లారీలను పంపండి. తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి విత్తనాల గోదాంలను తనిఖీ చేసిన కలెక్టర్
[ 01-06-2024]
జిల్లా కలెక్టర్ రాజర్షి షా పత్తి విత్తన గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వరదతో పొంచి ఉన్న ముప్పు
[ 01-06-2024]
వర్షాకాలంలో లోతట్టు కాలనీవాసుల కష్టాలు వర్ణనాతీతం. వరద నీరు ఇళ్లను ముంచితే బంధువుల ఇంటికో లేక బల్దియా యంత్రాంగం ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రానికో వెళ్లాల్సిన పరిస్థితి. -
రోడ్డు కాదు పెనం.. జంకుతున్న జనం
[ 01-06-2024]
ఉమ్మడి జిల్లాపై భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయన్న సామెతను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. -
జన చేతనం.. జయ కేతనం
[ 01-06-2024]
చిన్నా పెద్దా తేడాలేదు. మహిళలు, పురుషులంటూ లింగభేదం లేదు. ఆటలాడే చిన్నారి నుంచి పండు ముసలి వరకు ఒకటే నినాదం.. జై తెలంగాణ. స్వరాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరుముందుకు కదిలి పిడికిలి బిగించి ముందుకు సాగిన ఆ రోజులు ఎటుచూసినా ఆందోళనలతో అట్టుడికింది. -
సంపూర్ణ పోషణ.. పాలతో సాధ్యం
[ 01-06-2024]
పంటలతో పాటు పాడి పెంపకంపై రైతులు దృష్టి సారిస్తే.. అదనపు ఆదాయం సమకూరడంతో పాటు పిల్లలకు పోషకాలు అందించేందుకు అవకాశం ఉంది. పాడి పోషణ రైతులకు భారం అవుతుండటంతో చాలా మంది రైతులు వాటికి దూరమవుతున్నారు. -
బాసర అమ్మవారి సన్నిధిలో అందెశ్రీ
[ 01-06-2024]
బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు, అర్చకులు స్వాగతం పలికారు. -
ప్రారంభించకుండానే శిథిలం
[ 01-06-2024]
పేదల కోసం రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో ప్రారంభించకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు ఎవరికీ అక్కరకు రాకుండా నిరుపయోగంగా మారుతున్నాయి. -
నిర్వహణ భారం.. నీరుగారుతున్న లక్ష్యం
[ 01-06-2024]
వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో అన్నదాతలు సమావేశమై పంటల సాగు, సమస్యలపై వ్యవసాయ అధికారులతో చర్చించేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటి నిర్వహణ, పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. -
ఇంటర్ ఇక్కట్లు
[ 01-06-2024]
పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు కెరీర్పై దృష్టి సారించి ముందుకు సాగుతుంటారు. జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉంటే ఆయా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. -
కనిపించని ‘పొనికి’ ఉనికి
[ 01-06-2024]
పొనికి కర్ర అరుదైనది. అలంకరణ వస్తువులతోపాటు అందమైన బొమ్మలు, ఇతర కళాకృతుల తయారీకి దీన్ని విరివిగా వినియోగిస్తారు. నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ దీనిపైనే ఆధారపడి కొనసాగుతోంది. స్థానికంగా కర్ర లభించక పరిశ్రమ నిర్వాహకులు ఇతరప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నారు. -
పారదర్శకత కోసం పొదుపు పద్దు పరిశీలన
[ 01-06-2024]
స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో పారదర్శకత పాటించేందుకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మహిళా సాధికారతకు వినియోగించే ప్రతి పైసాకు లెక్క చూపేలా కార్యాచరణ చేపట్టింది. -
పట్టణ చెరువుల పరిరక్షణకు అడుగులు
[ 01-06-2024]
పట్ణణాల్లో జల వనరులు ఆక్రమణకు గురవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటితోపాటు ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు కబ్జా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురపాలికల్లో చెరువులు, కుంటల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
[ 01-06-2024]
జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. స్థానిక చున్నంబట్టివాడకు చెందిన ఓ భూవివాదం కేసులో దాసరి నరేష్ అనే వ్యక్తి ఈనెల 19న తాడూరి పోశం, తూము మోహన్లపై ఫిర్యాదు చేశారు. -
శునకం.. చూపిస్తుంది నరకం
[ 01-06-2024]
శునకాల దాడులు జిల్లాలో తీవ్రమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట వీటి దాడులతో గాయపడుతున్న వారు పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. నిత్యం సర్కారు ఆసుపత్రి బాట పడుతున్నారు. -
అమ్మమ్మ ఇంటికొచ్చి.. అరగంటలో దోచేసి
[ 01-06-2024]
వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికొచ్చింది.. వారింట్లో ఉన్న బంగారం, నగదుపై ఆమె కన్నేసింది. ఎలాగైనా కాజేయాలని పథకం పన్ని తన ప్రియుడిని రప్పించింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అరగంటలో బంగారం, వెండి, నగదు కాజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM