logo

ఓటర్లను చైతన్యపర్చండి

పోలింగ్‌లో అధికసంఖ్యలో ఓటర్లు పాల్గొనేలా చైతన్యపర్చాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత.. భారతదేశ అంధుల క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ వలసినైని రవణిని కోరారు.

Published : 23 Apr 2024 02:51 IST

రవణి, తల్లి చిట్టమ్మను అభినందిస్తున్న కలెక్టర్‌ విజయ సునీత

పాడేరు, న్యూస్‌టుడే: పోలింగ్‌లో అధికసంఖ్యలో ఓటర్లు పాల్గొనేలా చైతన్యపర్చాలని జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత.. భారతదేశ అంధుల క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ వలసినైని రవణిని కోరారు. ఆమె, తల్లి చిట్టమ్మ, సోమవారం కలెక్టర్‌ను కలిశారు. రవణి యూత్‌ ఐకాన్‌ అని కొనియడారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్వీప్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. హుకుంపేట మండలం రంగసింగిపాడు గ్రామానికి చెందిన రవణి భీమిలిలోని నేత్ర విద్యాలయంలో పదో తరగతి పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన అంతర్జాతీయ అంధుల క్రికెట్‌ పోటీలో ఆల్‌రౌండర్‌గా రాణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని