అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తనిఖీల హంగామాపై సీఎం రమేశ్ ఆగ్రహం
అధికారులను హెచ్చరిస్తున్న సీఎం రమేశ్
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉదయం 11.05 గంటలకు తన నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నామినేషన్ సమయంలో మూడు వాహనాలు లోనికి వెళ్లడానికి అనుమతి ఉంటే ఒక వాహనం మాత్రమే పంపారన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తన బంధువులు, కుటుంబ సభ్యులు హోటళ్లలో బసచేస్తే, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేసి దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిపై డీజీపీకి చెబితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. అర్ధరాత్రి సమయంలో భాజపా సానుభూతిపరుడంటూ ఓ వ్యాపారి ఇంట్లో రెండుసార్లు సోదాలు చేశారని చెప్పారు. జూన్ 4 అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అక్రమాలకు పాల్పడిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఏ కొత్త పథకం అమల్లోకి వచ్చినా అది తొలుత అనకాపల్లిలో చేపట్టేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట సజ్జలపైనే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. భగవంతుడు, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నామినేషన్ వేశానని, తనతో పాటు ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, దాడి వీరభద్రరావు, పాయకరావుపేట అసెంబ్లీ అభ్యర్థి వంగలపూడి అనిత మాట్లాడుతూ దేశంలో ప్రధానిగా నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అభివృద్ధి కోసం తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా ఏకకాలంలో పూజలు: నామినేషన్ వేయడానికి ముందుగా సీఎం రమేశ్, సతీమణి శ్రీదేవి కుటుంబ సమేతంగా అనకాపల్లి నూకాలమ్మ, కన్యకాపరమేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఉన్నారు. ఈసందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాలతోపాటుగా అయోధ్య రామాలయంలో సీఎం రమేశ్ పేరుతో ఏకకాలంలో పూజలు చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్