నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది.
సంప్రదాయానికి భిన్నంగా
పెరిగిన ఓటర్లు 38,836 మంది..
అదనంగా ఓట్లేసింది 74,914 మంది
ఈనాడు, అనకాపల్లి, పాడేరు, రంపచోడవరం: సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కలిపితే పోలింగ్ శాతం మరింత పెరగనుంది. గత అయిదేళ్లలో అనకాపల్లి జిల్లాలోని ఆరు నియోజవర్గాల్లో కొత్తగా నమోదైన ఓటర్లు 38,836 మంది. ఈ ఎన్నికల్లో అంతకు రెండింతల మంది ఓటేయడం విశేషం. యువత మొదలుకొని అన్ని వర్గాలు సమరోత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించినా, వాతావరణం విసిగించినా గంటల తరబడి బారులు తీరి మరీ ఓటు వేశారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎక్కువగా ఉందని కూటమి నేతలు చెబుతున్నారు.. సంక్షేమానికి ఓటేశారని అధికార పక్ష నేతలంటున్నారు. ఎవరి వాదనలో నిజముందో జూన్ 4 వరకు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.
పోలింగ్ పెరగడానికి వారే కారణం.. ఈ ఎన్నికల్లో యువత ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఈ వర్గం ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు. జనసేనాని పవన్ కల్యాణ్ కొంతకాలంగా రాష్ట్రం నలుదిక్కులా తిరిగి యువతను ఓటు బాట పట్టించేలా ఉత్సాహపరిచారు. ప్రభుత్వం గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపకపోవడంతో సర్కారు తీరుపై రగిలిపోయారు. వీరంతా ఓటుతో బుద్ధి చెప్పాలని బారులు తీరి ఓటేశారు.. ఓట్లేయలేని స్థితిలో ఉన్నవారిని కూడా వారే పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి బాధ్యత చాటుకున్నారు.
- వలస ఓటర్లు గతంలో కంటే ఎక్కువ మంది ఈసారి వచ్చారు. కొంతమందికి అభ్యర్థులే రానుపోను రవాణా సదుపాయం కల్పించి మరీ తీసుకొచ్చారు. పోలింగ్లో వలస ఓటర్ల శాతం ఎక్కువ కనిపిస్తోంది.
- ఉద్యోగులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు గతంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయడానికి ఇష్టపడేవారు కాదు. ఈసారి ఆ పరిస్థితి మారింది. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్తో సరిపెట్టలేదు. కుటుంబ సభ్యులందరినీ ఓట్లు వేసేలా ప్రోత్సహించారు. అపార్ట్మెంటువాసులు సైతం ఓట్ల కోసం కదిలివెళ్లారు.
- ఓటర్లకు ఇరు పార్టీల నేతలూ భారీగానే డబ్బులు పంచిపెట్టారు. పోలింగ్ శాతం పెరగడంపై ఆ ప్రభావం కూడా ఉంది.
- కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో అందరినీ ఆకట్టుకునేవి ఎక్కువగా ఉన్నాయి.. 50 ఏళ్లకే పింఛన్ల మంజూరు, రూ.4 వేలకు పింఛను పెంపు వంటి హామీలకు వచ్చిన స్పందనగా ఓటింగ్ శాతం పెరిగినట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్థానిక సమరానికి దీటుగా..
[ 01-06-2024]
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సార్వత్రిక సమరంలో ఓటర్లు పోటెత్తారు. అన్ని నియోజకవర్గాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. -
సజావుగా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
[ 01-06-2024]
ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. -
లోయలోకి దూసుకెళ్లిన బైకు.. తండ్రీకుమారుల దుర్మరణం
[ 01-06-2024]
బంధువుల ఇంటి నుంచి తిరిగొస్తూ బైకు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి చెందారు. కొయ్యూరు పంచాయతీ చింతవానిపాలెం ఘాట్రోడ్డులో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
వాణిజ్య పంటలపై వాత్సల్యమేదీ?
[ 01-06-2024]
ఒకప్పుడు వాణిజ్య పంటల సాగుకు చిరునామాగా ఉన్న మన్యం ప్రాంతంలో ఇప్పుడు ఆయా పంటలకు ఆదరణ తగ్గుతోంది. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
[ 01-06-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈదురుగాలులు, పిడుగులతో శుక్రవారం భారీ వర్షం కురిసింది. -
రాయితీల్లో కోత.. ధరల వాత
[ 01-06-2024]
ఓవైపు తమది రైతు పక్షపాత ప్రభుత్వమని బాకాలు ఊదుతున్నారు.. మరోవైపు విత్తు నుంచి ఎరువుల వరకు ధరలు పెంచి రైతులపై భారాన్ని మోపుతున్నారు. -
విరిగిన బెంచీలు..మొక్కల్లేని కుండీలు!
[ 01-06-2024]
నర్సీపట్నం ఆర్టీసీ బస్స్టేషన్ నుంచి వివిధ మండలాల నుంచి రోజూ 10 వేల మంది వరకు వచ్చి వెళ్తుంటారు. -
కేజీ అల్లం రూ.140
[ 01-06-2024]
మన్యంలో అల్లం పంట అధిక ధర పలుకుతోంది. వాణిజ్యపరంగా సాగు చేసిన ఈ పంటకు మంచి ధర లభించడంతో గిరిరైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఈ నెల పింఛనైనా చేతికిస్తారా?
[ 01-06-2024]
వృద్ధాప్య పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండటంతో చాలామందికి అవస్థలు తప్పడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నాగ్పుర్లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత
-
పవన్కల్యాణ్ విజయం కోరుతూ.. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి
-
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
-
కాకరేపుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
-
ప్రియుడిని బంధించి ప్రియురాలిపై హోంగార్డు అత్యాచారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM