ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం, న్యూస్టుడే: వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
- సంబల్పూర్-ఎస్ఎంవీ బెంగళూరు ప్రత్యేక రైలు ఈనెల 30 నుంచి జూన్ 27 వరకు నడపనున్నట్లు తెలిపారు. సంబల్పూర్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.55 గంటలకు దువ్వాడ చేరుతుందని, 5 గంటలకు తిరిగి బయల్దేరి రాత్రి 11.30 గంటలకు బెంగళూరు చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో రైలు జూన్ 1 నుంచి 29 వరకు నడుస్తుందని, బెంగళూరులో శనివారం రాత్రి 1.15 గంటలకు బయల్దేరి దువ్వాడకు రాత్రి 8.30 గంటలకు చేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు సంబల్పూర్ చేరుతుందని తెలిపారు. బర్గార్రోడ్డు, బలంగీర్, టిట్లాగర్, కెసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట, కాటపడి, జోలార్పెట్టాయ్, కృష్ణరాజపురం స్టేషన్లలో రైలు ఆగుతుందని తెలిపారు.
- సంబల్పూర్-కాచిగూడ రైలు 27 నుంచి జూన్ 24 వరకు నడుస్తుందని, సంబల్పూర్లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3.30 గంటలకు రాయగడ చేరుతుందని, విజయనగరం ఉదయం 5.30, దువ్వాడ ఉదయం 7.20 గంటలకు చేరి, రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 28 నుంచి జూన్ 25 వరకు నడిచే రైలు కాచిగూడలో రాత్రి 11.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు దువ్వాడ చేరుతుంది. విజయనగరం మధ్యాహ్నం 1.50, రాయగడ సాయంత్రం 4.05 గంటలకు చేరుతుంది. సంబల్పూర్ రాత్రి 11.45 గంటలకు చేరుతుంది.
- విశాఖ-అమృత్సర్ రైలు మళ్లింపు: రైతుల ఆందోళనతో విశాఖపట్నం-అమృత్సర్ హిరాకుండ్ ఎక్స్ప్రెస్ రైలు మార్గాన్ని మళ్లించినట్లు తెలిపారు. జఖాల్, ధురి, లూధియాన మీదుగా రైలు మళ్లించనున్నారు. పానిపట, అంబాల కాంట స్టేషన్లకు రైలు వెళ్లదని తెలియజేశారు. 21న విశాఖ నుంచి వెళ్లే రైలు, 22న అమృత్సర్ నుంచి వచ్చే రైలు మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం జరగనుంది. జిల్లాలోని మూడు శాసనసభ, అరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల లెక్కింపునకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలెక్టర్ విజయ సునీత, -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
భీమిలి తీరంలో విధ్వంసం విజయవంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
తపాలా బీమాతో ధీమా!
[ 02-06-2024]
అనుకోని ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే వారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయం. భార్య/భర్త మరణిస్తే వారి పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. -
ఆఖరి మజిలీకి అవస్థలు
[ 02-06-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సర్వం త్యాగం చేసి.. పునరావాస కాలనీలకు వచ్చిన ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఎవరైనా మృతిచెందితే వారి ఆఖరి మజిలీకి తీవ్ర అవస్థలు తప్పడం లేదు. -
పిడుగుపాటుకు క్రీడాకారుడి మృతి
[ 02-06-2024]
పద్మాపురం సమీపంలో శనివారం పిడుగుపడటంతో గిరి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. -
ఎండల తీవ్రతకు పైపులైన్ పేలుడు!
[ 02-06-2024]
ఛత్తీస్గడ్, ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు వెళుతున్న ఐరన్ఓర్ పైపులైన్ శుక్రవారం అర్ధరాత్రి పేలిపోయింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని దిగజనబ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు!
[ 02-06-2024]
కూటమికే ప్రజలు పట్టం కట్టనున్నారని, సర్వేలన్నీ అవే చెబుతున్నాయని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు