ఆరోగ్య కేంద్రం... వైద్యానికి దూరం!
‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ)ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు
అరకొరగానే శస్త్రచికిత్సలు, ప్రసవాలు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పీహెచ్సీల్లో ఇదే పరిస్థితి
ఈనాడు, అమరావతి
జగ్గయ్యపేట సీహెచ్సీకి కాన్పు కోసం వచ్చిన గర్భిణులు
‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ)ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు పీహెచ్సీల్లోనే అత్యధికంగా జరుగుతుండేవి. కానీ.. గత రెండు మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పీహెచ్సీల్లో సరైన పరికరాలు, సౌకర్యాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా ఉంటుండడంతో శస్త్రచికిత్సలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. పీహెచ్సీలకు వచ్చే కేసుల్లో చాలావాటిని విజయవాడ, మచిలీపట్నం ఆసుపత్రులకు వెళ్లాలని పంపించేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 90 పీహెచ్సీలుండగా.. వాటిలో ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 80వరకు ఉన్నాయి. నూజివీడు ప్రాంతంలో ఉన్నవి ఏలూరులో కలిసిపోయాయి. చాలా పీహెచ్సీల్లో సరైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వచ్చిన వారిని వచ్చినట్టే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిపోమంటూ సూచిస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు కూడా గుడివాడ ఏరియా ఆసుపత్రి లేదంటే దగ్గరిలో ఉన్న సీహెచ్సీలకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు. అందుకే.. సీహెచ్సీల్లో మాత్రమే ప్రస్తుతం ప్రసవాలు, కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 11 సీహెచ్సీలున్నాయి. వీటిలో మాత్రం శస్త్రచికిత్సలు ప్రస్తుతం చేస్తున్నారు. తాజాగా జగ్గయ్యపేట సీహెచ్సీలో అన్నీ కలిపి.. మార్చిలో 58, ఏప్రిల్లో 46 శస్త్రచికిత్సలు చేశారు. పీహెచ్సీల్లోనూ ఇదే విధంగా ఏర్పాట్లు చేస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు మేలు జరుగుతుంది.
క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉన్నా..
చాలాచోట్ల ఒక్కో పీహెచ్సీకి ఇద్దరేసి వైద్యులు ఉన్నారు. ఉదయం ఓపీ చూడాలి. మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలి. స్థానికంగా ఉండే గర్భిణులు, రోగులకు క్షేత్రస్థాయిలోనికి వెళ్లి సేవలు అందించాలి. ప్రస్తుతం చాలావరకూ వైద్యులు ఎవరూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం లేదు.
ఆసక్తి ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వాలి..
రెండు జిల్లాల్లో 15 నుంచి 20మంది వరకూ సీనియర్ వైద్యులున్నారు. వీరున్నచోట కూడా ప్రస్తుతం శస్త్రచికిత్సలు అరకొరగానే చేస్తున్నారు. వైద్య పరికరాలు సరిగా లేవని చెబుతున్నారు. మిగతా అన్నిచోట్లా జూనియర్ వైద్యులున్నారు. వీరిలో ఆసక్తి ఉన్న కనీసం ఓ 30 నుంచి 40మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తే.. శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుంటుంది. మండలానికి కనీసం ఓ కేంద్రంలోనైనా ఆపరేషన్ థియేటర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోనికి తేవాలి.
పదేళ్ల కిందట ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పీహెచ్సీల్లో ఆపరేషన్ థియేటర్లను రూ.లక్షలు ఖర్చుపెట్టి సిద్ధం చేయించారు. ఒక్కో పీహెచ్సీకి రూ.3 లక్షల వరకూ ఖర్చుపెట్టి బాగు చేయించారు. దాతలు, ప్రభుత్వ నిధులతో ప్రతి మండలానికి ఒకటి రెండుచోట్ల ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేయించారు. వైద్యులు, అధికారులు బదిలీలపై వెళ్లిపోవడంతో క్రమంగా అవి పాడైపోయాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించి ఇక్కడ శస్త్రచికిత్సలు తప్పనిసరిగా చేసేలా అధికారులు ఏర్పాటు చేస్తే గ్రామీణులకు ప్రయోజనకరం.
24 గంటలూ పనిచేయాల్సి ఉండగా..
పీహెచ్సీలన్నీ ప్రస్తుతం 24గంటలూ పనిచేయాల్సి ఉంది. ఏ సమయంలో రోగులు వచ్చినా వైద్య సేవలు అందించాలి. కానీ.. 90శాతం పీహెచ్సీల్లో రాత్రి 9గంటల తర్వాత వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళ రోగులు వచ్చినా చూసేందుకు ఎవరూ ఉండడం లేదు. కొన్నిచోట్ల సిబ్బంది ఉంటున్నా.. రాత్రి వేళ వచ్చే వారిని విజయవాడ, మచిలీపట్నం తీసుకెళ్లాలంటూ సూచించడానికే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో గత రెండేళ్లలో ఇలా..
(2022 ఫిబ్రవరి వరకు)
90 పీహెచ్సీల్లో ప్రసవాలు : 1067
12 సీహెచ్సీల్లో ప్రసవాలు : 4348
ఏరియా ఆసుపత్రుల్లో : 4999
విజయవాడ, మచిలీపట్నం ఆసుపత్రుల్లో : 26,592
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.