విహారంలో విషాదం
కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో బీఫార్మసీ విద్యార్థినులు ఇరువురు దుర్మరణం పాలైన సంఘటన రెండు కుటుంబాలకు అంతులేని శోకాన్ని
బీచ్లో ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో బీఫార్మసీ విద్యార్థినులు ఇరువురు దుర్మరణం పాలైన సంఘటన రెండు కుటుంబాలకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు పరాసుపేటకు చెందిన కె.పూజిత(22) భీమవరంలోని విష్ణు కళాశాలలో ఇటీవలే బీఫార్మసీ పూర్తి చేసింది. ఆమెతో పాటు బీఫార్మసీ పూర్తి చేసిన భీమవరానికి సమీపంలోని పిప్పర గ్రామానికి చెందిన ప్రమీలారాణి జాస్మిన్(22), గరగపల్లి గ్రామానికి చెందిన డి.ఆశాజ్యోతి రెండు రోజుల క్రితం సరదాగా మచిలీపట్నంలోని పూజిత ఇంటికి వచ్చారు. ముగ్గురూ సోమవారం ఉదయం 10గంటల సమయంలో మంగినపూడి బీచ్లో స్నానాలు చేసేందుకు వెళ్లారు. స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురూ లోపలికి కొట్టుకుపోతుండడంతో స్థానికులు గమనించి వారిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కొనఊపిరితో ఉన్న పూజిత, ప్రమీలారాణి జాస్మిన్లకు ప్రాథమిక చికిత్స అందించేలోపే మృతిచెందారు. ఆశాజ్యోతి కోలుకుంది. అప్పటివరకూ తనతో సరదాగా గడిపిన స్నేహితురాళ్లు ఇరువురూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి కన్నీరు మున్నీరుగా ఆమె విలపించింది. సమాచారం తెలుసుకున్న ప్రమీలారాణి జాస్మిన్ తల్లిదండ్రులు మచిలీపట్నం చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించిన తమ కుమార్తెలను విగతజీవులుగా చూడలేక రెండు కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. వారి వేదన చూపరుల హృదయాలను కలిచివేసింది. కళ్లెదుటే చోటుచేసుకున్న హృదయవిదారక ఘటనతో చలించిపోయిన సందర్శకులు ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే తక్షణ వైద్య సాయం అందించే ఏర్పాట్లు బీచ్వద్ద చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తాలూకా ఎస్సై వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఉద్యోగంలో చేరకుండానే..
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: చేతికందివచ్చిన ముగ్గురు బిడ్డల్లో ఒకరు పదిరోజుల్లో ఉద్యోగంలో చేరతారని సంతోషిస్తున్న సమయంలో ఆ కుటుంబాన్ని విషాదం కమ్ముకుంది. బందరు మండల పరిధిలోని ఆర్గొల్లపాలెంకు చెందిన మాజీ సర్పంచి కుమారుడు శ్రీకృష్ణవరప్రసాద్ వ్యవసాయం చేసుకుంటూ మచిలీపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తెకు వివాహం చేయగా రెండో కుమార్తె భీమవరం విష్ణు కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసింది. కుమారుడు విశాఖలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ప్రాంగణ ఎంపికలో చెన్నైలోని ఓ బహుళజాతి మందుల కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్న పూజిత మరో పదిరోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ లోపే విధి వక్రించింది. మరో పది రోజుల్లో ఉద్యోగానికి వెళ్లిపోతోందన్న ఆనందంలో ఉన్న వారు విగతజీవిగా మారిన పూజితను చూసి తట్టుకోలేకపోయారు. పూజిత అంత్యక్రియలు మంగళవారం వారి స్వగ్రామంలో నిర్వహిస్తారని మృతురాలి బంధువులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులకు ఎన్నారైలు ప్రచారం
[ 01-05-2024]
తెదేపా, జనసేన, భాజపా బలపరిచిన ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్నైరైలు ప్రచారం నిర్వహించారు. -
కూటమి మ్యానిఫెస్టోపై సందేహాలుంటే నివృత్తి చేస్తాం: యనమల
[ 01-05-2024]
పూర్తిగా అమలు చేయదగ్గ మ్యానిఫెస్టోనే తాము రూపొందించామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. -
నాన్న రాసిన మరణశాసనం.. ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
[ 01-05-2024]
‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశానని’’ డాక్టర్ శ్రీనివాస్ తన ఫోన్లో వాయిస్ రికార్డు చేశారు. -
శ్రమజీవికీ ద్రోహ ‘మే’..!
[ 01-05-2024]
తెల్లవారుజామునే నిద్ర లేచి.. ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని... చద్దిబువ్వ మూటకట్టుకుని.. పొట్టకూటి కోసం అడ్డాలకు చేరుకుంటారు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు. ఎవరైనా కాస్త పని ఇప్పించకపోతారా? అని వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటారు -
బాబోయ్ అన్నా... బే‘ఖాతా’ర్..!
[ 01-05-2024]
మే.. సామాజిక పింఛన్లను బ్యాంకుల్లో వేయడమంటే.. వృద్ధులు, దివ్యాంగులను ఎండల్లో ముప్పుతిప్పలు పెట్టడమే. కావాలనే... ఎన్నికలకు ముందు వారిని వేధించి.. ప్రాణాలమీదకొచ్చేలా చేయడమే. -
ఉప కారాగారం వార్డర్ ఆత్మహత్య
[ 01-05-2024]
స్థానిక ఉప కారాగారంలో వార్డర్గా పని చేస్తున్న దాసరి నాగ శివకుమార్ (37) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్థానిక ఐదో వార్డులో ఒక భవనం పై అంతస్తులో ఉన్న సింగిల్ పోర్షన్లో అద్దెకు ఉంటున్నారు. -
‘వైకాపా అరాచకాలకు ఓటుతో స్వస్తి పలకాలి’
[ 01-05-2024]
రాష్ట్రంలోనూ, గన్నవరంలోనూ వైకాపా అరాచకాలకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కునే ఆయుధంగా మలుచుకోవాలని బాపులపాడు మండలం రంగన్నగూడెం మాజీ సర్పంచి, వైకాపా నాయకురాలు ఆళ్ల నాగమణి పేర్కొన్నారు. -
జ్యోతిర్లింగ యాత్రకు ప్రత్యేక రైలు
[ 01-05-2024]
యాత్రికుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ సంస్థ జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం : సజ్జల
[ 01-05-2024]
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెదేపా, జనసేన పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
జ్యోతిసురేఖకు ఘన స్వాగతం
[ 01-05-2024]
ప్రపంచ అర్చరీ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన వన్నెం జ్యోతిసురేఖ మంగళవారం ఉదయం దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. -
కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ: బాలశౌరి
[ 01-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ తన సొంత రాజ్యాంగం అమలు చేశారని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. -
పేదలకు పాట్లు.. వైకాపా నాయకులకు రూ.కోట్లు
[ 01-05-2024]
గుడివాడలో ఐదేళ్ల జగన్ ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కానీ.. ఎమ్మెల్యే నాని అండతో అతని అనుచరులు మాత్రం భారీగానే ఆర్జించారు. -
గుడివాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్
[ 01-05-2024]
ఐపీఎల్లో జరిగే బెట్టింగ్ తీరుతెన్నులు ఇది. ఓవర్లో రెండు సిక్స్లు కొడితే పందెం కాసిన బెట్టింగ్రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి. -
ఎన్నికల నిర్వహణకు సహకరించండి: కలెక్టర్
[ 01-05-2024]
జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్