ఎన్నికల నిర్వహణకు సహకరించండి: కలెక్టర్
జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు.
మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ, వేదికపై ఎస్పీ, జిల్లా ఎన్నికల పరిశీలకులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో మంగళవారం ఎస్పీ నయీమ్ అస్మి, జిల్లాకు నియమితులైన ఎన్నికల పరిశీలకులతో కలిసి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులను అభ్యర్థులకు పరిచయం చేశారు.
పోస్టల్బ్యాలట్కు ఫెసిలిటేషన్ కేంద్రాలు
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు మే 4న, ఓపీఓలకు మే 5న, పోలీస్ పర్సనల్, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు మే 6న తమ పోస్టల్ ఓటింగ్ కోసం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. ఆయా తేదీల్లో పోస్టల్ ఓటింగ్ను వినియోగించుకోలేని వారి కోసం 7, 8 తేదీల్లోనూ కేంద్రాలు కొనసాగుతాయన్నారు. 85 సంవత్సరాలు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ కోసం ఈనెల 2 నుంచి 8వ తేదీ మధ్య, మిగిలిపోయిన వారికోసం 9, 10 తేదీల్లో ఇళ్లవద్దకే వచ్చి ఓటింగ్ నిర్వహిస్తాయన్నారు.
జిల్లాలో 15.39 లక్షల ఓటర్లు
ఏప్రిల్ 25 నాటికి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,39,460గా ఉందని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ నయీమ్ అస్మి మాట్లాడుతూ జిల్లా శాంతిభద్రతల నిర్వహణ కోసం తీసుకున్న చర్యల గురించి వివరించారు.
72 గంటల ముందు ప్రచారాలు నిలిపివేయాలి
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా పోలింగ్కు 72 గంటల ముందు అంటే ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాజకీయ పార్టీలు ప్రచారాలకు సంబంధించి ప్రచారబల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజ్లు నిలుపుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం వివిధ నెట్వర్క్ల సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో నాగాయలంక వాసి మృతి
[ 21-05-2024]
నాగాయలంక మండలం రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన మత్తి మురళి విజయవాడ రూరల్లోని రామవరప్పాడు రింగురోడ్డు వద్ద ప్రమాదంలో మృతి చెందాడు. -
సాగేదెట్టా.. వేగేదెట్టా?
[ 21-05-2024]
ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టు తక్కువగా ఉంది. ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ పరిధిలో మెట్టప్రాంతం ఎక్కువ కాగా.. సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు ఉంది. దానికి డిసెంబరులో నీరిస్తారు. -
చొరవ లేకనే చక్రబంధం!
[ 21-05-2024]
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు రోడ్డెక్కితే.. ఎప్పటికి గమ్యస్థానం చేరతామో తెలియకుంది. రద్దీ సమయాల్లో అయితే మరింత చికాకు పెడుతున్నాయి. -
ఓట్ల లెక్కింపుపై అవగాహన
[ 21-05-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.. అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ డెమో నిర్వహించారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు
[ 21-05-2024]
‘ఈవీఎంలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎన్నికల అనంతరం హింస ఎక్కడా చెలరేగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా -
ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండండి
[ 21-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను సోమవారం జిల్లా కలెక్టరు డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సీతనపల్లి చెరువులో తాగునీటి చౌర్యం
[ 21-05-2024]
కృత్తివెన్ను మండలంలో 14 గ్రామ పంచాయతీలకు తాగునీటిని అందించే సీతనపల్లి సామూహిక రక్షిత నీటి పథకం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం చర్చనీయాంశమైంది. -
ఏపీ నరెడ్కో నూతన కార్యవర్గం ఎన్నిక
[ 21-05-2024]
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సెల్ (నరెడ్కో) ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గవర్నర్పేటలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు... -
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
[ 21-05-2024]
ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ టి.పెద్దిరాజు అన్నారు. -
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదం
[ 21-05-2024]
కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికారి సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత పేర్కొన్నారు. -
పలు రైళ్ల రద్దు
[ 21-05-2024]
విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని పాక్షికంగా రద్దు, దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాయదుర్గంలో ‘ఉగ్ర’ కలకలం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
-
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి 6 కొత్త పాలసీలు: సీఎం రేవంత్రెడ్డి
-
శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్నాథ్ సింగ్
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్