గుడివాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్
ఐపీఎల్లో జరిగే బెట్టింగ్ తీరుతెన్నులు ఇది. ఓవర్లో రెండు సిక్స్లు కొడితే పందెం కాసిన బెట్టింగ్రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి.
వైకాపా నేతలే మధ్యవర్తులు
రూ.లక్షల్లో మోసపోతున్న అమాయకులు
‘ఈ ఓవర్లో 2 సిక్స్లు పడతాయి’
‘వచ్చే బాల్ సిక్స్ కొడతారు...
రూ.50 వేలు బెట్టింగ్..’
‘ఈ ఓవర్లో వికెట్ పడుతుంది...’
న్యూస్టుడే, విజయవాడ నేరవార్తలు: ఐపీఎల్లో జరిగే బెట్టింగ్ తీరుతెన్నులు ఇది. ఓవర్లో రెండు సిక్స్లు కొడితే పందెం కాసిన బెట్టింగ్రాయుళ్లకు డబ్బులు చెల్లించాలి. అదే కొట్టలేకపోతే బెట్టింగ్ రాయుళ్లు కట్టిన సొమ్ము బుకీలకు పంపాలి. వీరిద్దరి మధ్యన బోర్డు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ బ్రోకర్లు కమీషన్ తీసుకుంటారు. బుకీలకు, బెట్టింగ్ రాయుళ్ల మధ్య... బ్రోకర్లుగా బోర్డు నిర్వహించే వారు అమాయకులను నిలువునా మోసం చేసి రూ.కోట్లు కొట్టేస్తున్నారు. బుకీలకు బెట్టింగ్ చెప్పకుండా ఒక్కోసారి నిలిపివేసి బెట్టింగ్ ఓడిపోయిన వారి నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. ఒక వేళ బెట్టింగ్ రాయుళ్లు గెలిస్తే.. బుకీలకు సమాచారం అందలేదని, నేను మీ డీల్ను ఇంకా అంగీకరించలేదుగా అంటూ అడ్డంగా బుకాయిస్తూ.. డబ్బులు ఎగ్గొడుతున్నారు. ప్రధానంగా బాల్ బాల్కి జరిగే బెట్టింగ్ల్లో ఇలాంటి మోసాలు జరిగిపోతున్నాయి. గుడివాడ కేంద్రంగా జరుగుతున్న ఈ తరహా దందాను గుడివాడ తెదేపా సోషల్ మీడియా మంగళవారం విడుదల చేసింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా ఉండే ఒక వ్యక్తి చేసే దందా వెలుగులోకి రావడం కలకలం రేగింది.
గుడివాడకు చెందిన ఐ ప్యాక్ బృందంలోని వినోద్ అనే సభ్యుడు దీనికి ప్రధాన సూత్రధారి అని తెదేపా విడుదల చేసిన సోషల్ మీడియాలో ఉంది. ఎమ్మెల్యే కొడాలి నాని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మధ్యన ఉన్న ఈ వ్యక్తిదే వాయిస్ అంటూ తెదేపా సోషల్ మీడియా రెండు ఫొటోలు విడుదల చేసింది. బెట్టింగ్ కట్టిన ఓ వ్యక్తికి డబ్బులు రాకపోవడంతో అతను ప్రశ్నించగా.. మీ డీల్ను నేను ఇంకా అంగీకరించలేదుగా అంటూ వినోద్ బుకాయించటం వినిపించింది. ఎమ్మెల్యే అనుచరులు ఏ విధంగా బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారో.. ఈ వాయిస్ స్పష్టం చేస్తోందని తెదేపా పేర్కొంటోంది.
కొడాలి అనుచరులే...
గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనుచరులు బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారని సర్వత్రా వినిపిస్తోంది. గుడివాడతో పాటు కైకలూరు, ఏలూరు కేంద్రాలుగా ఈ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. యువత, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని.. బ్రోకర్లు బరి తెగిస్తున్నారు. గెలిచిన వారికి డబ్బు ఇవ్వకుండా బెదిరించి బెట్టింగ్కు డీల్ కుదరలేదంటూ బెదిరిస్తున్నారు. బెట్టింగ్ కట్టి ఓడిపోతే.. వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా అమాయకుల నుంచి రూ.కోట్లు గుంజేస్తున్నారని, యువతను బెట్టింగ్కు బానిసగా మార్చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ ముఠా వివరాలు తెలిసినా ఎవరికీ చెప్పుకోలేక.. చెబితే ఏమవుతుందో అనుకుంటూ వణికిపోతున్నారు. పోలీసులకు సమాచారం తెలిసినా.. చూసీ చూడనట్లు పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బెట్టింగ్ మహమ్మారికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో అంటూ.. ఎదురు చూస్తున్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
కానూరు: లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యఅధికారిణి డాక్టర్ గీతాబాయి హెచ్చరించారు. మంగళవారం కానూరులోని టాప్స్టార్, శృతి ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో అనుమతులు లేని ఆస్పత్రులు, నర్సింగ్హోమ్లు, లాబరేటరీలు, పరీక్షాకేంద్రాలు గుర్తించినట్లయితే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైపాస్ పేరుతో... బరితెగింపు
[ 22-05-2024]
‘‘కొత్తూరు తాడేపల్లిలో అర్ధరాత్రి మట్టి టిప్పర్ల భారీ రవాణాపై సమాచారం రావడంతో అధికారులు క్షేత్రానికి వెళ్లారు. లారీలను ఆపి ప్రశ్నిస్తే.. తమకు అనుమతులు ఉన్నాయనీ, విజయవాడ బైపాస్కు.. మేఘా ఇంజినీరింగ్ తరఫున రవాణా చేస్తున్నామని పత్రాలు చూపారు. -
దయచేసి వినండి.. మీ రైలు రద్దయింది!
[ 22-05-2024]
‘‘విజయవాడ డివిజన్లో నిర్వహణ పనులు (ట్రాఫిక్ బ్లాక్) పేరుతో అధికారులు భారీగా రైళ్లను రద్దు చేస్తుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
నిధులు మళ్లాయి.. కన్నీళ్లు మిగిలాయి..!
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో బృహత్తర తాగునీటి ప్రాజెక్టు అటకెక్కనుంది. మంజూరైన నిధులను దారి మళ్లించడంతో ప్రజల తాగునీటి కష్టాలు తీరడం లేదు. -
లెక్కింపు కేంద్రానికి మూడంచెల భద్రత
[ 22-05-2024]
ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద స్ట్రాంగ్రూములకు మూడంచెల పటిష్ఠ భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. -
పకడ్బందీగా నిర్వహించేనా..?
[ 22-05-2024]
జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
కుమారుడ్ని క్రికెట్ శిక్షణకు తీసుకెళ్తూ తిరిగిరాని లోకాలకు
[ 22-05-2024]
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డల్ని ప్రయోజకులను చేయాలనే సంకల్పంతో నాగాయలంక మండలం నుంచి విజయవాడకు వచ్చారు. -
చిరంజీవికి బుద్ధప్రసాద్ సత్కారం
[ 22-05-2024]
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవిని మాజీ ఉప సభాపతి, కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సత్కరించారు. -
మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాల సరఫరా
[ 22-05-2024]
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా అన్నారు. -
నగర పరిసరాల్లో తేలికపాటి వర్షాలు
[ 22-05-2024]
విజయవాడ పరిసరాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. -
సీపీఆర్పై అవగాహన అవసరం
[ 22-05-2024]
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించడానికి సామాన్య ప్రజలకు కూడా సీపీఆర్పై అవగాహన తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ నర్సెస్, మిడ్వైవ్స్ కౌన్సిల్ (ఏపీఎన్ఎమ్సీ) రిజిస్ట్రార్ కె.సుశీల పేర్కొన్నారు. -
గౌరవ భృతి ఏదీ?
[ 22-05-2024]
జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణలో నిరంతరం సేవలు అందించిన బీఎల్వో(బూత్స్థాయి అధికారి)లు గౌరవ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. -
పాడి రైతు అభ్యున్నతే లక్ష్యం
[ 22-05-2024]
ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్థాపించిన విజయ డెయిరీ.. పాల సేకరణలో అగ్రగామిగా నిలుస్తూ, పాడి రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. -
కూటమిదే విజయం
[ 22-05-2024]
ఏపీలో భాజపాతో కలవడం వల్ల తెదేపా కూటమికి కొన్ని ఓట్లు తగ్గాయని.. అయితే రాష్ట్రంలో తెదేపా-జనసేన-భాజపా కూటమి విజయం సాధించి, అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు పేర్కొన్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పక్కా ఏర్పాట్ల్లు
[ 22-05-2024]
పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డీఆర్వో వి.శ్రీనివాసరావు సంబంధిత అధికారులకు సూచించారు. -
పటిష్ఠత ప్రశ్నార్థకం..!
[ 22-05-2024]
నగరంలోని పూర్ణానందపేట.. ఏలూరు లాకుల వద్ద వంతెనపై పిచ్చిమొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరుతోంది. దీనికి రక్షణగా ఉన్న గోడ కూలిపోయింది. -
నరసింహస్వామి కల్యాణోత్సవం నేడు
[ 22-05-2024]
పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవస్థానం దత్తత దేవాలయం శ్రీధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో కె.రమేష్ నాయుడు మంగళవారం తెలిపారు. -
దివ్యాంగురాలిపై అఘాయిత్యం
[ 22-05-2024]
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో ఘోరం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే రీతిలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. దివ్యాంగురాలిపై రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ గర్భవతిని చేసిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. -
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు
[ 22-05-2024]
నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్ గౌరవ్’ రైలును నడపనున్నారు. జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం అవుతుంది. -
మద్యం మత్తులో కత్తితో వీరంగం
[ 22-05-2024]
కత్తితో పోలీస్స్టేషన్కు వెళ్లి ఒక వ్యక్తి గలాటా చేసిన ఘటన చల్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చల్లపల్లి కోమలానగర్లో చిత్తు కాగితాలు ఏరుకొని జీవించే ఈస్తళ్ల శివ రక్తం గాయాలతో మద్యం మత్తులో ఒంటిపై దుస్తులు లేకుండా కత్తి పట్టుకుని చల్లపల్లి రహదారుల వెంట వీరంగం సృష్టించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. -
12వ సారి సహకార బ్యాంకు పదవి పొడిగింపునకు యత్నం
[ 22-05-2024]
గుడివాడలోని ఓ సహకార బ్యాంకుకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా 11 సార్లు పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.