పద్దు పొడుపుపైౖ గంపెడాశలు
సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చే కేంద్ర బడ్జెట్ కావడంతో.. ఉద్యోగులు, రైతులు, యువతకు మేలు చేసేలా ఉంటుందనే అంచనాలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రైల్వే సహా అనేక కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు.
కేంద్రం ఆదుకుంటుందని వివిధ వర్గాల ఎదురుచూపు
ఈనాడు, అమరావతి : సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చే కేంద్ర బడ్జెట్ కావడంతో.. ఉద్యోగులు, రైతులు, యువతకు మేలు చేసేలా ఉంటుందనే అంచనాలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రైల్వే సహా అనేక కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. రెండు జిల్లాల్లో కలిపి నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు కలిపి ఏటా 12.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతుకు మేలు చేసేలా ఈసారి బడ్జెట్ ఉంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యువతకు అవకాశాలు పెంచేలా..
రాష్ట్రంలోనే అత్యధికంగా రెండు జిల్లాల్లోనూ యువత, విద్యాసంస్థలు ఉన్నాయి. యువతకు ఉపాధి అవకాశాలను పెంచడంపై మరింత దృష్టిపెడితే బాగుంటుంది. ఏటా రెండు జిల్లాల్లో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులను పూర్తిచేస్తున్నారు. వీరికి ఉపాధి చూపడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. గత బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టినట్లు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) వంటివి ఈసారి కూడా పెడితే బాగుంటుంది.
పర్యాటకానికి ఊతమివ్వాలి..
రెండు జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రధానంగా భవానీద్వీపం సహా అనేక ప్రకృతి సహజ పర్యాటక ప్రాంతాలున్నాయి. గత కేంద్ర బడ్జెట్లో మాదిరి పర్యాటక రంగం అభివృద్ధి కోసం.. ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పన వంటివి ఈసారి మరిన్ని పెంచాలి.
వేతన జీవుల నిరీక్షణ...
ఆదాయపన్ను పరిమితి ఈసారి పెంచుతారనే ఆశాభావంలో అందరూ ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగులు సహా ఇతర పన్ను చెల్లింపుదారులంతా ఈసారి పరిమితి మరింత పెంచే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. రెండు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఎంఎస్ఎంఈలకు ఆసరా ఇస్తే..
దేశ జీడీపీలో 35 శాతంపైగా వాటాతో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈసారి కేంద్ర బడ్జెట్లో ఊతమివ్వాలని పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న పరిశ్రమలు నేటికీ కోలుకోలేకపోతున్నాయి. ఈసారి బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు సహకారం అందించాలని కోరుకుంటున్నారు.
రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు చాలానే...
విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, రద్దీకి తగ్గట్టుగా ప్లాట్ఫాంల సంఖ్యను మరో రెండు మూడు పెంచాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. విజయవాడ సహా రెండు జిల్లాల్లో పలు ఆర్వోబీలు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్కు అనుసంధానంగా శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల ఏర్పాటు కొలిక్కి రాలేదు. స్టేషన్ నుంచి నిత్యం 250 రైళ్లు, లక్షన్నర మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్ల రద్దీకి పరిష్కారంగా విశాఖ వైపు నుంచి వచ్చే రైళ్లను కొన్ని రామవరప్పాడు, గుణదలలో ఆపేసి.. అక్కడి నుంచి రాయనపాడు మీదుగా హైదరాబాద్ వైపు మళ్లించాలనేది ప్రణాళిక. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే రైళ్లను కొన్నింటిని రాయనపాడులో ఆపేసి.. అటునుంచి విజయవాడ స్టేషన్కు రాకుండా బయట నుంచే విశాఖ వైపు పంపించేస్తారు. కృష్ణా కెనాల్ స్టేషన్ను కూడా శాటిలైట్ స్టేషన్గా అభివృద్ధి చేయాలి. మౌలిక సౌకర్యాల ఏర్పాటు, రైళ్లను మళ్లించేందుకు అవసరమైన అభివృద్ధి చేపట్టాలి. ఇప్పటికే రాయనపాడు నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని రైళ్లను ఆపుతున్నా.. పూర్తిగా లేదు. 2016లో కృష్ణా పుష్కరాలప్పుడు రూ.50 కోట్లతో ఈ శాటిలైట్ స్టేషన్లను ఆధునికీకరించాలని ప్రతిపాదించినా.. కొంతవరకే పనులు చేపట్టారు. వీటిని అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారు.
వి విజయవాడ నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ అధికం. విజయవాడ-నాగపట్నం మధ్య వేళంగిని ఎక్స్ప్రెస్ను నడపాలనే ప్రతిపాదన ఉంది. ఈ ప్రాంత క్రిస్టియన్ మైనార్టీలకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరం. ముంబయి, జైపూర్, బెంగళూరుకు కొత్త రైళ్లు కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!
[ 02-05-2024]
ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు తెదేపాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైకాపా ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. -
జనం గొంతులో.. జగన్ గరళం..!
[ 02-05-2024]
ప్రజారోగ్యం ప్రమాదంలో పడ్డప్పుడు పాలకులు ఏం చేయాలి? తాగునీరే గరళమై.. జనం ప్రాణాలనే బలి తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకోవాలి? -
నాడు జోరుమీదొచ్చారు.. నేడు జారుకున్నారు
[ 02-05-2024]
ఎన్నిక ప్రకటన ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు జోగి రమేష్ పోరంకి ద్వారకా రెసిడెన్సీలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఆన్లైన్లో నమోదు చేసి రశీదులు ఇచ్చినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. -
పేరు రక్షితం.. నీరు కలుషితం
[ 02-05-2024]
ప్రజలకు రోజూ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కావడం లేదు. చాలాచోట్ల డ్రెయిన్ల వెంబడి పైపులైన్లు ఉండడం.. లీకైన వాటిని మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. -
ప్రతి పథకమూ దోపిడీ కోసమే
[ 02-05-2024]
రాష్ట్రంలో ఐదేళ్లలో అమలు చేసిన ప్రతి పథకాన్నీ తన దోపిడీకి అనుగుణంగా మార్చుకున్న జగన్, అతని టీంకు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కోరారు. -
ఈ ప్రశ్నకు జవాబు చెప్పు?
[ 02-05-2024]
‘నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి చేస్తున్నాం.. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధనతో పాటు, టోఫెల్, స్లాష్, క్లాస్రూం ఎస్సెస్మెంట్ పరీక్షలు చేపడుతూ వారి సామర్థ్యాన్ని ఏ ప్రభుత్వం చేయలేని పద్ధతిలో పెంపొందిస్తున్నాం’ -
‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్’
[ 02-05-2024]
మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 02-05-2024]
వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాలని కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శింగరాయపాలెం, బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, అచ్చయ్యవారిపాలెం, పుల్లపాడు తదితర గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. -
చీకటి పాలన నుంచి విముక్తులవుదాం: కొల్లు
[ 02-05-2024]
ఐదేళ్ల చీకటి పాలన నుంచి విముక్తులయ్యేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర కోరారు. -
దళిత వ్యతిరేకి జగన్: జవహర్
[ 02-05-2024]
దళిత వ్యతిరేకి జగన్మోహన్రెడ్డికి తగు రీతిన బుద్ధి చెప్పేందుకు అందరూ సంఘటితం కావాలని మాజీ మంత్రి, తెదేపా నాయకులు కేఎస్ జవహర్ కోరారు. -
సంక్షేమ పాలన తెదేపాతోనే సాధ్యం
[ 02-05-2024]
కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. పెడన మండలం నందమూరు, జింజేరు, జింజేరు గౌడపాలెం గ్రామాల్లో బుధవారం -
తెదేపా అభ్యర్థులకు ఘన స్వాగతం
[ 02-05-2024]
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్, బందరు జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రాత్రి వరకు ఉయ్యూరులో బైక్ ర్యాలీ జరిగింది. -
వైకాపా కుక్కర్ కూపన్ల కేసు కంచికే..!
[ 02-05-2024]
అజిత్సింగ్నగర్ తోటవారివీధిలోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న వైకాపా కుక్కర్ కూపన్ల కేసు.. కంచికి చేరింది. -
వైద్యుడి కుటుంబం మృతి కేసులో విచారణ వేగవంతం
[ 02-05-2024]
పటమట పరిధిలో వైద్యుడు శ్రీనివాస్ కుటుంబం మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసును సీపీ స్వయంగా పర్యవేక్షిస్తుండంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. -
వెలంపల్లికి చేదు అనుభవం
[ 02-05-2024]
సెంట్రల్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. -
కొడాలి నానిని నిలదీసిన గ్రామస్థులు
[ 02-05-2024]
వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) బుధవారం ఎన్నికల ప్రచారం చేస్తుండగా..పలువురు మహిళలు ఆయన్ను తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదంటూ నిలదీశారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?