రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి..
ఈనాడు, అమరావతి: గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ జనం నిలదీస్తుంటే.. సమాధానం చెప్పలేక.. వారిపై దాడులకు తెగబడుతున్నారు. మొన్న నీటి కోసం గుడివాడ పట్టణ ప్రజలు నిలదీస్తే.. నేడు రహదారులు ఎందుకు వేయలేదంటూ గ్రామీణ ప్రాంతాల యువత నిలదీస్తున్నారు. దీన్ని తట్టుకోలేక నాని వర్గం దాడులకు దిగుతుంది. తాజాగా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం కూరాడలో ఇలాంటి ఘటనే జరగ్గా.. దానిని బయటకు రాకుండా కొడాలి వర్గం వారిని బెదిరించారని తెలుస్తోంది. మంగళవారం రాత్రి 10 గంటలు దాటాక.. కొడాలి నాని తన అనుచరులతో కలిసి కూరాడ గ్రామానికి ప్రచారానికి వెళ్లారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. అదే సమయంలో కొందరు యువకులు కలిసి.. గత ఎన్నికల ముందు ఇలాగే వచ్చి.. గుడ్లవల్లేరు నుంచి ముదినేపల్లి వెళ్లే ప్రధాన రహదారిని బాగు చేస్తానంటూ నాని హామీ ఇచ్చారని, కానీ.. తర్వాత పట్టించుకోలేదంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేనే నిలదీస్తారా.. అంటూ ఆ యువకులను బూతులు తిడుతూ.. వైకాపా మూకలు నెట్టేసి కొట్టినట్లు తెలుస్తోంది. అయినా సదరు యువకులు ఏమాత్రం భయపడకుండా.. ‘ఎన్నిసార్లు ఇలా ఓట్ల కోసం వచ్చి మమ్మల్ని మోసం చేస్తారు.? గత ఐదేళ్లలో ఎమ్మెల్యే తమ గ్రామానికి చేసిందేం లేదు. అడిగితే తప్పా?’ అంటూ నిలదీసినట్టు తెలుస్తోంది.
కేసు పెట్టకుండా బెదిరింపులు
ప్రజా సమస్యలపై నిలదీస్తే తమను కొట్టడంపై సదరు యువకులు పోలీసు కేసు పెట్టడానికి సిద్ధమైనట్టు సమాచారం. కానీ.. వారిని బెదిరించి కొడాలి నాని వర్గంతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు కట్టడి చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన బయటకు రాకుండా దాచి ఉంచేందుకు ప్రయత్నించడం గమనార్హం. బుధవారం రాత్రి వరకూ ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.
ఒక్క రోడ్డూ వేయలేకపోయిన కొడాలి..
తెదేపా ప్రభుత్వ హయాంలోనే.. కేంద్ర, రాష్ట్రాలు కలిసి గ్రామాలన్నింటిలో 95 శాతానికి పైగా రహదారులను వేసేశాయి. మిగిలిన అరకొర దారులనూ వేయలేక వైకాపా సర్కారు చేతులెత్తేసింది. కొడాలి నాని ఐదేళ్ల కిందట మాట ఇచ్చి కూడా.. గుడ్లవల్లేరు నుంచి ముదినేపల్లి వెళ్లే ప్రధాన రహదారిని వేయలేదు. ఎన్నికలొస్తున్నాయని ఇటీవల గుంతలు మాత్రం పూడ్చారు. అదికూడా.. ఫ్లైయాష్, రబ్బీస్ గుంతల్లో పోసి వదిలేశారు. దీంతో అవి రాళ్లు తేలి, దుమ్ము ధూళితో మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ.. వాహనదారులు వాపోతున్నారు. ఈ రహదారి గురించే కూరాడ యువకులు కొడాలి నానిని నిలదీశారు. కానీ.. వారికి సమాధానం చెప్పలేక.. దౌర్జన్యానికి దిగడంపై.. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గత ఐదేళ్లు ఎమ్మెల్యేగా నాని ఏ అభివృద్ధీ చేయకపోయినా.. ఓట్లు అడగడానికి రాగానే హారతులిచ్చి, పూలదండలు వేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ‘పైసా’చికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. ‘దారి’ మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!