జగనన్న ‘ఘోర’ముద్ద
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు.
ముద్దగడుతున్న అన్నం.. తినని విద్యార్థులు
పత్తాలేని చిక్కీలు, కోడిగుడ్ల పంపిణీ
జిల్లాలో ఇదీ పరిస్థితి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. అయితే మెనూ అమలు మాట దేవుడెరుగు ప్రభుత్వం అందిస్తున్న నాసిరకం బియ్యం ముద్ద కడుతోంది. దీంతో పలువురు విద్యార్థులు ఆ భోజనం తినడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇళ్ల నుంచి తెచ్చుకుని తినాల్సిన పరిస్థితి.
న్యూస్టుడే, చిత్తూరు(విద్య), పుత్తూరు, బంగారుపాళ్యం
పుత్తూరు: జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ముద్ద కట్టిన ఇస్కాన్ భోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు బలవర్ధకమైన ఆహారం లేకపోవడంతో అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, దీంతో చదువుల్లో వెనకబడి పోతున్నారని తలచి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి రోజు వారికి బలవర్ధక ఆహారం అందించాలన్నది లక్ష్యం. అయితే అమల్లో లోపాల కారణంగా పూర్తిస్థాయిలో అది అమలు కావడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 10 నుంచి 20శాతం మంది విద్యార్థులు పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం తినడం లేదు. ఇళ్ల నుంచి తెచ్చుకుని తింటున్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట, పుత్తూరు మండలం, పుత్తూరు మున్సిపాలిటీలోని కొన్ని పాఠశాలలకు ఇస్కాన్ భోజనం అందిస్తున్నారు. అది ఉదయం తిరుపతిలో తయారుచేసి అందిస్తున్నారు. మధ్యాహ్నానికి చల్లబడిపోతోంది. దీనికితోడు ముద్ద కడుతోంది. దీన్ని పిల్లలు తినడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ మండలాల్లోని 50శాతం మంది పిల్లలు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. కుప్పం ప్రాంతంలో అక్షయ పాత్ర సంస్థ పలు పాఠశాలలకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందిస్తుండటం గమనార్హం.
డ్రమ్మునీరే దిక్కు
రెండు నెలల క్రితం విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించిన సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజన విషయమై చెప్పారు. నాసిరకం బియ్యం అందిస్తే వాటిని తిరిగి ఇచ్చేయాలని, మంచి బియ్యం తీసుకోవాలని సెలవిచ్చారు. అయితే కొందరు పాఠశాలల హెచ్ఎంలు.. ఉన్న బియ్యంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నారు. దీనికితోడు గుత్తేదారులకు బిల్లులు రూ.8.76కోట్లు చెల్లించాల్సి ఉంది.
- బంగారుపాళ్యెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 680 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు-నేడు కింద కింద రూ.7.8 లక్షలతో తాగునీటి శుద్ధి యంత్రం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన మూణ్నాళ్లకే అది మూలన పడింది. అప్పటి నుంచి స్థానికంగా ఉన్న బోరు నీటిని డ్రములు ఏర్పాటు చేసి నింపుతున్నారు. ఆ నీరే విద్యార్థులకు గతి.
- పుత్తూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 400 పైచిలుకు విద్యార్థినులు చదువుతున్నారు. వారికి ఇస్కాన్ సంస్థ మధ్యాహ్న భోజనం కొన్నేళ్లుగా అందిస్తోంది. అయితే ఆ సంస్థ భారీ సంఖ్యలో విద్యార్థులకు భోజనం తయారు చేస్తుంటారు. అది ఎప్పుడో ఉదయం చేసి పాఠశాలలకు వచ్చేటప్పటికీ భోజనం చల్లబడిపోతోంది. దీనికితోడు అన్నం ముద్ద కడుతోంది. దీంతో విద్యార్థులు అది తినలేక ఇంటి నుంచి తెచ్చుకుని తింటున్నారు.
- పూతలపట్టు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటే ఆరోగ్యం సహకరించడం లేదని విద్యార్థులు ఇంటి నుంచి భోజనాలు తెచ్చుకుని తింటుండటం గమనార్హం.
పూతలపట్టు ఉన్నత పాఠశాలలో క్యూలైన్లో విద్యార్థులు
అందని బిల్లులు..: జిల్లాలో చిక్కీలకు సంబంధించి గుత్తేదారులకు రూ.2.23 కోట్లు, కోడిగుడ్లకు రూ.6.53కోట్లు బిల్లు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు.
అన్నం ముద్ద కట్టడంతో తినలేక..
మధ్యాహ్న భోజనానికి నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. నాలుగుసార్లు కడిగి వండినా ముద్ద కడుతోంది. ముద్దకట్టిన అన్నంలో సాంబారు కలిపి తింటే నోటికి ఎక్కడం లేదు. దీంతో పిల్లలు చాలా మంది ఇళ్ల నుంచే భోజనం తీసుకెళ్తున్నారు.
షాజిదా, పుత్తూరు
నాణ్యత కొరవడింది..
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద కార్యక్రమం అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత కొరవడుతోంది. 10 నుంచి 20 శాతం పిల్లలు ఇళ్ల నుంచి భోజనాలు తెచ్చుకుని తింటున్నారు. పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి యంత్రాలు అప్పుడే పనిచేయడంలేదు. దీంతో ఇళ్ల నుంచి నీరు తీసుకెళ్తున్నారు.
పార్వతి, పూతలపట్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాల పెద్దిరెడ్డి, తాయిలాల చెవిరెడ్డి పని పట్టండి
[ 03-05-2024]
రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సైకోలా పట్టిపీడిస్తుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలను పాపాల పెద్దిరెడ్డి హింసిస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
ఎండల్లో ఏడి‘పింఛెను’
[ 03-05-2024]
చిత్తూరు నగరంలోని 8వ డివిజన్ వెంగళరావుకాలనీకి చెందిన వృద్ధుడు రాజారెడ్డి రెండ్రోజులుగా పింఛను కోసం స్థానిక సచివాలయం చుట్టూ తిరుగుతున్నాడు. -
ఎంత పని చేశావు జగన్..!
[ 03-05-2024]
ప్రస్తుతం.. సీఎం జగన్.. నియోజకవర్గానికి ఒక స్కిల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆపై జిల్లాకు ఒక స్కిల్ కళాశాల మంజూరు చేసి మమ అనిపించారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి నగరాల్లో గతంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లనే స్కిల్ కళాశాలలుగా మార్పు చేసి నిర్వహిస్తున్నారు. -
అరాచకాలను కనిపెట్టేందుకు నిఘా
[ 03-05-2024]
పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా గురువారం పేర్కొన్నారు. -
తెదేపాపై కసి.. శీతల గిడ్డంగిని ఆపేసి
[ 03-05-2024]
పశ్చిమ ప్రాంతంలోని పలమనేరు మార్కెట్ కమిటీ రైతులకు వరం. ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు, పూలు, వరి వేరుసెనగ, బంగాళాదుంప తదితర పంటలు పండిస్తారు. -
ఇదేనా జగన్ చి(చె)త్త శుద్ధి..!
[ 03-05-2024]
జగన్ సర్కారు నిర్లక్ష్యం పుణ్యమా.. అని జిల్లాలో స్వచ్ఛ సంకల్పం ఆచరణలో నీరుగారిపోయింది. స్వచ్ఛభారత్ నినాదంతో గ్రామాల్లో పారిశుద్ధ్యమే లక్ష్యంగా ప్రభుత్వం వెచ్చించిన రూ. కోట్ల నిధులకు ప్రయోజనం లేకుండా పోయింది. -
నయవంచక నాయకా...!
[ 03-05-2024]
నగరి మండలం తడుకుపేటలో 200 ఇళ్లను ఆప్షన్-3 కింద నిర్మిస్తున్నారు. కొన్ని ఇళ్ల పనులు పైకప్పు వరకు వచ్చాయి. ఆపై అవి అక్కడితో నిలిచిపోయాయి. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా నేతలు
[ 03-05-2024]
చంద్రగిరి పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, మాజీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి గురజాల సందీప్ ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు గురువారం తెదేపా కండువా కప్పుకొన్నారు. -
వాలంటీరు ప్రచారాన్ని అడ్డుకున్న తెదేపా
[ 03-05-2024]
ఓ మహిళా వాలంటీరు వైకాపా తరఫున చేస్తున్న ప్రచారాన్ని స్థానిక తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. -
వైకాపా నేతలకు స్లిప్పులు
[ 03-05-2024]
తిరుపతి 22వ డివిజన్ 266 పోలింగ్ కేంద్రం పరిధిలో బీఎల్వో గోపీకృష్ణ ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేస్తూ.. ఓటరు సంతకంతోపాటు ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. -
ఇళ్లు కాదు.. అబద్ధాలు కళ్లకు కట్టారు
[ 03-05-2024]
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహాలు మంజూరు చేసి.. ఒక్కో గృహానికి రూ.1.80 లక్షలు కేటాయించారు. ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని గొప్పగా ప్రకటించారు సీఎం జగన్. -
‘జగన్ 30 స్థానాలకు పడిపోవడం ఖాయం’
[ 03-05-2024]
జగన్ పరిపాలనపై ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, శాసనసభ ఎన్నికల్లో వైకాపా 30 స్థానాలకు పడిపోవడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ స్పష్టం చేశారు
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?