వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు.
నాలుగు నెలలుగా మందుల్లేక విలవిల
దయనీయంగా హీమోఫీలియా రోగుల దుస్థితి
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం : వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. శరీరంలో(ఇంటర్నల్ బ్లీడింగ్) రక్తస్రావమై వాపులు, దెబ్బతగిలితే రక్తస్రావం ఆగకపోవడం వంటి అరుదైన అధిక రక్తస్రావ వ్యాధి(హీమోఫీలియా)తో బాధపడుతున్న రోగులకు గత నాలుగు నెలలుగా మందులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ జీజీహెచ్లలో ఇవి అందుబాటులో ఉండేవి. నాలుగు నెలల నుంచి మందులు రాకపోవడంతో నొప్పులు తట్టుకోలేక.. వ్యాధి తీవ్రత పెరిగిపోయి రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలో హీమోఫీలియాతో బాధపడు తున్న వారు సుమారు 200 మంది వరకు ఉన్నారు. వీరికి గతం నుంచి కాకినాడ జీజీహెచ్లో మందులు అందిస్తున్నారు. రాజమహేంద్రవరం వైద్యశాల జీజీహెచ్గా మారినప్పటి నుంచి ఇక్కడ సైతం ఆ ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోగుల్లో రక్తం గడ్డకట్టే స్వభావం ఉండదు. సాధారణ రోగులకు చిన్న రక్తస్రావమైతే కొద్దిసేపటికి ఆగిపోతుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో మాత్రం గంటల తరబడి రక్తం కారుతూనే ఉంటుంది. శరీరానికి ఏదైనా గాయమైనా లోపల ఇంటర్నల్గా రక్తస్రావమై ఒళ్లంతా వాపులు వస్తుంటాయి. అలాంటప్పుడు వారి పరిస్థితి దయనీయం. చస్తూ బతుకుతూ నెట్టుకొస్తుంటారు. అప్పుడు వారికి ఫ్యాక్టర్-7, ఫ్యాక్టర్-8, ఫ్యాక్టర్-9 అనే మందును ఇంజక్షన్ల రూపంలో అందజేస్తే వారికి స్వల్ప ఉపశమనం కలుగుతుంది.
డిసెంబరు నుంచి నిలిపివేత
ఈ ఇంజక్షన్లు గతేడాది డిసెంబర్ నుంచి కాకినాడ, రాజమహేంద్రవరం జీజీహెచ్లకు సరఫరా నిలిచిపోయింది. జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిధులతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల సమన్వయ లోపం, త్వరగా సరఫరా చేసేలా పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. ఈ మందు ప్రైవేటులో కొనుగోలు చేసి వేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కొక్కరూ వారి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు అయిదారు సార్లు.. అంతకంటే ఎక్కువ సార్లు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోడోసు బయట మార్కెట్లో కొనుగోలు చేస్తే రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు సమస్యపై దృష్టిసారించి త్వరగా మందులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ మందులు అందుబాటులో లేక రెండు నెలల కిందట కోనసీమకు చెందిన ఓ రోగి మృతిచెందడం దుస్థితికి అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
[ 02-05-2024]
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
ఇసుక తోడేళ్లు..
[ 02-05-2024]
కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం. -
వైకాపా కోటలు బద్దలు కొడదాం
[ 02-05-2024]
మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ వైకాపా అరాచక పాలనపై ధ్వజమెత్తారు. కూటమి అభ్యర్థుల విజయం ద్వారా దీనికి చరమగీతం పాడవచ్చన్నారు. -
బాబ్బాబు.. పార్టీ మారొద్దు..
[ 02-05-2024]
నిడదవోలు వైకాపా నేతలు వరుసగా రాజీనామాలు చేసి జనసేన, తెదేపాల బాట పడుతుండటంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉన్నవారు చేజారిపోకుండా నియోజకవర్గ నాయకుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
‘రౌడీ రాజ్యాన్ని ఓటుతో తరిమికొట్టండి’
[ 02-05-2024]
ఓటుతో రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎన్డీయే కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరి, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్చచౌదరి పిలుపునిచ్చారు. -
టీకాలకూ ఠికానా లేదు..!
[ 02-05-2024]
వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యమిస్తున్నామని.. అందరికీ మెరుగైన సేవలందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. -
నువ్వూ వద్దు.. నీ పనులూ వద్దు..
[ 02-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని జగన్మోహన్రెడ్డి వాగ్ధానాలు చేశారు. ప్రజలు నిజమేనని నమ్మి ఓటేశారు.. తీరా పీఠమెక్కిన తర్వాత బటన్ నొక్కడం తప్ప రోడ్లు బాగుచేయడం వంటి కీలక అంశాలు మరిచారు. -
భిక్షనుకున్నారా?.. కక్షగట్టారా..?
[ 02-05-2024]
నిరుపేద ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బ్యాంకు లింకేజీ, పూర్తి రాయితీ రుణాలను అందించేవారు. కిరణా దుకాణాలు, టెంటు హౌస్లు, ఆటోలు, కార్లు, వంటి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఎస్సీలు స్వయం ఉపాధి బాటపట్టేవారు. -
రాజకీయాల్లో నేర చరితులను అడ్డుకోవాలి
[ 02-05-2024]
నేరచరిత్ర ఉన్నవారిని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో జిల్లా అభ్యదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘ఎన్నికల భారతం’ -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా..?
[ 02-05-2024]
హోం మంత్రిగా మహిళ ఉన్న రాష్ట్రంలో శాంతి, భద్రతలు లేవని, మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ఎక్కువయ్యాయని గోపాలపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. -
భాజపాకు 200 సీట్లు కూడా కష్టమే
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 200 స్థానాల్లో కూడా గెలవడం కష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. -
ఎంపీ గుట్టు బయటపెడతాం: ఆదిరెడ్డి
[ 02-05-2024]
యువతను జగన్ మోసం చేశారని కూటమి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
చర్చిలో వైకాపా నేతల ప్రచారం
[ 02-05-2024]
కాకినాడ గ్రామీణం రాయుడుపాలెం సీటీసీ చర్చిలో బుధవారం వైకాపా నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.