ఇసుక తోడేళ్లు..
కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం.
అయిదేళ్లలో అందినకాడికి దోచిన అధికార పార్టీ నేతలు
ఈనాడు, రాజమహేంద్రవరం
కట్టడాలకు వినియోగించే ఇసుక కోసం గుంతలు తీసి పచ్చటి బతుకులు కూల్చేశారు. యంత్రాలతో తవ్వకాలు వద్దన్నా వినరు. ప్రశాంత గోదారమ్మ గుండెల్లో పొక్లెయినర్లతో తవ్వి ఇసుక తోడేస్తారు. ఎన్జీటీ హెచ్చరించినా పట్టదు.. కోర్టులు మొట్టికాయలు వేసినా లెక్కలేనితనం. అధికార పార్టీ నాయకులే అంతా నడిపిస్తున్నా.. తవ్వకాలు అందరికీ కనిపిస్తున్నా అధికార యంత్రాంగం కళ్లకు కనబడదు. సామాన్యుడు పొరపాటున ప్రశ్నిస్తే.. ప్రైవేటు సైన్యం రెచ్చిపోతుంది. ఇదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ అయిదేళ్లలో నడుస్తున్న దందా.
‘గోదావరి తీరం ఉన్న ఉమ్మడి జిల్లాలో ఇసుకకు కొదవలేదు. ఇదే వైకాపాకు వరమైంది. ఎక్కడికక్కడ పాగా వేసి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిపోతున్నాయి. ఓపెన్ రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లేకున్నా అధికారం ఉందని అయిదేళ్లు రెచ్చిపోయారు. రాయలసీమకు చెందిన ఓ మంత్రి కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. ప్రశ్నించిన న్యాయస్థానాలకు సైతం ఎక్కడా తవ్వకాలు జరగడం లేదని అధికారులు గంతలు కడుతున్నారు.
గామన్ వంతెన సమీపంలో యథేచ్ఛగా తవ్వకాలు
రోజుకు సుమారు రూ.17 కోట్ల వ్యాపారం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ఇసుక ఓపెన్ రీచ్ల నుంచి రోజుకు సుమారు వెయ్యి లారీల్లో ఇసుక తరలుతుండగా.. రూ.17 కోట్ల మేర నగదు చేతులు మారుతున్నట్లు అంచనా. ప్రతి రీచ్ వద్ద ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రయితే వారంతా చేతుల్లో కర్రలు పట్టుకుని కాపలా ఉంటారు. పగటిపూట రీచ్ల్లోకి వెళ్లి ఎవరైనా ఫొటోలు తీస్తే ఆ వ్యక్తుల వాహనాల నంబర్లు నమోదు చేసి ఆరా తీయిస్తారు.
ప్రాణాలు పోతున్నా పట్టదే
గోదావరిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతల్లో పడి ఈ అయిదేళ్లలో పది మంది మృత్యువాత పడ్డారు. అమలాపురం మండలం భట్నవిల్లికి చెందిన ముగ్గురు యువకులు ముమ్మిడివరం మండలం గేదల్లంకలోకి ఉత్తరవాహిని పుష్కరాల రేవు వద్ద స్నానానికి దిగి ఇసుక గుంతల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు.
- కోనసీమ జిల్లా జొన్నాడ ఇసుక ర్యాంపు ప్రాంతంలో గత ఏడాది మే 21న కొందరు స్నేహితులు సరదాగా స్నానానికి వెళ్లారు. అక్కడ సుమారు 40 అడుగుల మేర ఉన్న భారీ గుంతలను అంచనా వేయలేక ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు.
- కోరుకొండ మండలం దోసకాలయపల్లికి చెందిన ముగ్గురు విద్యార్థులు సెలవులు రావడంతో సరదాగా పట్టిసీమ వెళ్లారు. బేకరీ నిర్వాహకుడు ఓలేటి ఆనంద్, ఇంజినీరింగ్ విద్యార్థి లుక్మాన్, ఐటీఐ విద్యార్థి పెద్దిరెడ్డి రామ్ప్రసాద్ గోదాట్లో స్నానానికి దిగి లోతు అంచనా వేయలేక ప్రాణాలు విడిచారు.
- ఇవిగాక పగ్గాలు లేని పరుగులతో అయిదేళ్లలో ఇసుక లారీలు మరికొందరి ప్రాణాలు తీశాయి.
రావులపాలెం వద్ద తవ్వకాలు
- సీతానగరం మండలం మునికూడలిలో మూడు నెలలుగా తవ్వకాలు జరుగుతుండగా, ముగ్గళ్లలో బాటలు వేసి మరీ తవ్వేశారు. మునికూడలి నుంచి రోజుకు సగటున 300 లారీల ఇసుక తరలుతోంది.
- తాళ్లపూడి మండలంలోని బల్లిపాడులో రేయింబవళ్లు ఇసుక అక్రమ తవ్వకాలు జరగుతున్నాయి. నదిలో బాటలు వేసి వందల లారీల్లో తరలిస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళన , అధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు మినహా నిరంతరం తవ్వకాలు జరుగుతున్నాయి.
- కొవ్వూరు మండలం కుమారదేవంలో రెండు నెలలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. గోదావరిలో బాటలు నిర్మించి నిత్యం సగటున 100 లారీల్లో ఇసుక తరలిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు.
- కడియం మండలం బుర్రిలంకలో ఏడు నెలలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అడ్డగోలు తవ్వకాల వల్ల సమీపంలోని లంకల్లో సాగు చేస్తున్న భూములు కోతకు గురవుతున్నాయని దళితులు ఆవేదన చెందుతున్నారు.
- నిడదవోలు, పెరవలి మండలాల పరిధిలోని పందలపర్రు, పెండ్యాల ఇసుక రీచ్ల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. రెండుచోట్ల నుంచీ రోజుకు సుమారు 80 లారీల్లో తరలిస్తున్నారు.
- బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో కొద్ది నెలలుగా రోజుకు సుమారు 200 లారీల్లో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఊబలంకలో గత ఏడాది నవంబరు నుంచి తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 150 లారీల్లో ఇసుక తరలుతోంది.
- ఆలమూరు మండలం జొన్నాడలో ఆరు నెలలుగా తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు 300 లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు
- నది ఉపరితలానికి మీటరకు మించి తవ్వకూడదన్న నిబంధన.ఉంది. భారీ యంత్రాలతో దాదాపు 8 మీటర్ల మేర తవ్వకాలు చేస్తున్నారు.
- ఏటిగట్లపై భారీ వాహనాలు తిప్పకూడదన్నది స్పష్టం. గట్లను ధ్వంసం చేసి 35 నుంచి 45 టన్నుల వాహనాలు నడుపుతున్నారు.
గట్లు తొలిచేస్తే వరదల సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికుల ఆందోళన.
ఉమ్మడి జిల్లాలో
యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్న రీచ్లు 14
నిత్యం ఇసుక తవ్వకాలు(సుమారుగా) 25 వేల టన్నులు
నిత్యం ఇసుక తరలిస్తున్న లారీలు(సుమారు) 1000
ఈ అయిదేళ్లలో పోయిన ప్రాణాలు10
తెదేపా హయాంలో రీచ్ నుంచి రాజమండ్రికి రవాణా ఛార్జీ(3 యూనిట్లకు) రూ.1,500 ప్రస్తుతం రూ.6,300
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!
[ 17-05-2024]
అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు. -
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
[ 17-05-2024]
‘పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు ప్రజలకు మద్యం ఇవ్వలేదు. డబ్బు పంచలేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూ.45లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. -
కదిలారు కడదాక నిలిచారు
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు నగరాల్లో ఓటు చైతన్యంలో కాకినాడ ముందుంది. రాజమహేంద్రవరం నగరంలో 67.57 శాతం పోలైతే.. కాకినాడలో అత్యధికంగా 72.16 పోలయ్యింది. -
నడుం బిగిస్తారా.. నిద్ర నటిస్తారా!
[ 17-05-2024]
నదీ పరిరక్షణ, వాల్టా ప్రకారం నదుల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. ఉపరితలానికి మీటరు లోతుకు మించి వెళ్లకూడదు. -
ఈనెల రేషన్ సరుకులు ఇంకా అందలే
[ 17-05-2024]
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరకుల పంపిణీ జరుగుతుంది. -
క్రీడా శిబిరాలు ఇంకెప్పుడు?
[ 17-05-2024]
వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కాకపోవటంతో నగరంలోని క్రీడాకారుల్లో నిస్తేజం అలముకుంది. -
ఈదురుగాలులకు అరటి రైతు దిగాలు
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు అరటి రైతులు కుదేలయ్యారు. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో అరటి ఎక్కువగా సాగు చేస్తారు. -
అయిదు దీవులు.. పర్యాటక సొబగులు
[ 17-05-2024]
యానాం తీర ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా ఉన్న మడ అడవుల్ని సంప్రదాయ పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చాలని పుదుచ్చేరి ప్రభుత్వం యోచిస్తోంది. -
అవినీతికి నాయకుల అండ
[ 17-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయమన్నారు... వారికి రుణాల అందించే క్రమంలో ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకును(డీసీసీబీ) సంరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామంటూ ప్రకటనలు గుప్పించారు. -
ఎమ్మెల్సీ తోట, అనుచరులపై అట్రాసిటీ కేసు
[ 17-05-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఎమ్మెల్సీ, వైకాపా మండపేట నియోజకవర్గ అభ్యర్థి తోట త్రిమూర్తులు -
సచివాలయం ఎదుట స్తంభాలు పాతి నిరసన
[ 17-05-2024]
గ్రామ సచివాలయం ఎదుట సిమెంటు స్తంభాలతో ఫెన్సింగ్ వేసి స్థానికులు ఆందోళనకు దిగిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. -
ఖరీఫ్ ఎరువుల ప్రణాళిక ఖరారు..!
[ 17-05-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీ సీజన్లో 1,69,397 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సుమారు 1,68,780 ఎకరాల్లో వరి సాగు చేపట్టే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ తెలిపారు. -
రక్తపోటు.. ఆరోగ్యంపై వేటు
[ 17-05-2024]
ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి చిత్తవుతున్నారు. దీని కారణంగా ఆరోగ్యం గతి తప్పుతోంది. రక్తపోటు(బీపీ), మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి