logo

కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా

ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు.

Published : 20 Apr 2024 05:21 IST

కాకుమాను, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. వారు రాజీనామా పత్రాలు ఇచ్చే సమయంలో బయట వైకాపాకు చెందిన నాయకుడు కూర్చుని వారితో మాట్లాడటం చర్చనీయంశమైంది. వారితో బలవంతంగా రాజీనామాలు ఏమైనా చేయించారేమో అని గ్రామంలో విమర్శలు వచ్చాయి.

 పెదనందిపాడు, న్యూస్‌టుడే :  పెదనందిపాడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 23 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. మండలంలో మొత్తం 232 మంది వాలంటీర్లు ఉండగా ఇప్పటికీ 72 మంది రాజీనామా పత్రాలు ఇచ్చారు.వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొందరు వైకాపా నాయకులు ఒత్తిడి వల్లనే రాజీనామా చేస్తునట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని