ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
న్యూస్టుడే, వికారాబాద్, తాండూరు: జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈఏడాది ఏప్రిల్లో ఏకంగా 19 రోజులు 40 నుంచి 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో పార్లమెంటు ఎన్నికలు రావడంతో నేతలు ఓవైపు వేడిని భరించలేక, మరోవైపు ఓటర్లను సకాలంలో కలవలేక ఏంచేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికితోడు ప్రచార సమయం కూడా తక్కువగా ఉండటంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల యత్నాలు చేస్తున్నారు.
మధ్యాహ్నం కల్యాణ మండపాల్లో సమావేశాలు: జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుండగా, కొడంగల్ మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తోంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు, అనుయాయులు మైకులు అందుకుందామనుకున్నా, ఎండ దెబ్బతో ప్రజలను సమీకరించడం కష్టమవుతోంది. దీంతో ఉదయం 11 గంటల లోపు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు గ్రామాలు, తండాలు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. ఎక్కువగా ఉదయం 11 గంటలలోపే ప్రచార కార్యక్రమాలు ముగించేసుకొని, మధ్యాహ్నం కల్యాణ మండపాల్లో ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి తమ వాణి వినిపించేందుకు తాపత్రయపడుతున్నారు.
ఏ అవకాశాన్నీ వదలడం లేదు
పార్లమెంటు ఎన్నికల్లో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి జిల్లాలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భారాస, భాజపాలు పట్టణాలు, పల్లెలు, తండాలు, వీధులు అనే వ్యత్యాసం లేకుండా ప్రచారం పర్వం కొనసాగిస్తున్నాయి. ప్రత్యర్థుల బలహీనతలు, తమ బలాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారానికి కేవలం 9 రోజులు, ఓటింగ్కు పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో తమ విజయావకాశాలను మెరుగుపర్చుకోవడానికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడంలేదు. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని విధాలా యత్నిస్తున్నారు.
పని ప్రదేశాలకు వెళ్తూ.. ఫోన్లు చేస్తూ..
చాలా మంది నాయకులు ఎండ వేడెక్కక ముందే ఉపాధిహామీ కూలీలు పనిచేసే ప్రదేశానికి వెళ్లి ప్రచారం చేస్తుండగా, మరికొంత మంది ఉదయం నడకకు వచ్చిన ఓటర్లతో తమ పార్టీకే ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కొందరు మధ్యాహ్నం వేళ పేరున్న నాయకులకు ఫోన్లు చేసి ఓట్లు అడుగుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే అధికంగా ప్రచారం చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండటంతోపాటు ప్రతి గ్రామానికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు వెళ్లేందుకు కుదరడంలేదు. దీంతో గ్రామస్థాయి నాయకులకే ప్రచార బాధ్యతలు అప్పగించి, మండల స్థాయి నాయకులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగే విధంగా చూస్తున్నారు. మధ్యాహ్నం వేళ ప్రచార రథాలు గ్రామాల్లోని చెట్ల నీడన దర్శన మిస్తున్నాయి. వాటిని నడిపే వారు కాస్త చల్లటి నీడలో సేద దీరుతున్నారు.సాయంత్రం స్పీకర్ల పాటలతో హోరెత్తిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
[ 17-05-2024]
యాసిడ్ కలిపిన బకెట్ను స్నానం నీటికి ఉపయోగించడంతో ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. -
కుండపోత.. జనం ఎదురీత
[ 17-05-2024]
రాజధానిలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భారీ వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో నగరం అతలా కుతలమైంది. -
నిధులు మింగేసి.. నాలాలను వదిలేసి
[ 17-05-2024]
రూ.వెయ్యి కోట్లతో నాలాల ఆధునికీకరిస్తామంటూ మూడేళ్ల క్రితం చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ)పై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. -
వందేభారత్ 5 గంటలు ఆలస్యం
[ 17-05-2024]
టైమంటే వందేభారత్.. వందేభారత్ అంటే టైం..అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ద.మ.రైల్వే వాటి సమాయాలపై సంశయం వచ్చేలా చేస్తోంది. -
హద్దులు చెరిపేసి.. చుట్టూ కంచె వేసి
[ 17-05-2024]
జంట జలాశయాలకు సమీపంలో ప్రభుత్వ, నిషేధిత భూముల వివరాలను సేకరించి కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుంటున్నారు. -
కట్టుకున్నోడిని చంపేసి.. గుండెపోటని నమ్మించి
[ 17-05-2024]
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. భర్తను దారుణంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది. -
వరుణుడి ఆట.. అభిమానుల ఇంటి బాట
[ 17-05-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య గురువారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. -
చినుకు పడితే.. కానరాని సిటీ బస్సులు
[ 17-05-2024]
నగరంలో ఏమాత్రం వర్షం పడినా ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారిపోతోంది. -
350 ఫీడర్లలో ట్రిప్పింగ్
[ 17-05-2024]
బంజారాహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడం, చెట్ల కొమ్మలు కరెంట్ తీగలపై పడటంతో బ్రేక్డౌన్లు ఏర్పడ్డాయి. -
పోకల్వాడ భూముల కబ్జాపై దర్యాప్తు
[ 17-05-2024]
మణికొండ ఐటీ కారిడార్ సమీపంలోని పోకల్వాడలో ఐదెకరాల భూమి కబ్జా వ్యవహారం కీలకమలుపు తిరిగింది. -
మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు
[ 17-05-2024]
మల్కాజిగిరి భాజపా కార్పొరేటర్ శ్రవణ్కుమార్ సహా మరో ముగ్గుర్ని హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఐసీఎస్ఎస్ఆర్ జాతీయ సదస్సు 29న
[ 17-05-2024]
ఆర్జీ కేడియా వాణిజ్య కళాశాలలో ఈ నెల 29న ‘వ్యాపార పద్ధతులు- కొత్త పరిశోధనలు’ అనే అంశమై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. -
పెండింగ్ డీఏలు ఇప్పించాలి
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించడంతో పాటు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చర్యలు చేపట్టాలని -
అకాల చినుకు..అన్నదాతకు వణుకు
[ 17-05-2024]
రైతన్న అనుకున్నంతా అయింది. అకాల వర్షం పడితే తాము పడిన కష్టం అంతా నీటి పాలవుతుందని నిత్యం ఆకాశంలో మబ్బులు పడితే ఆందోళన చెందుతున్నారు. -
బాహ్య వలయం.. అసంపూర్ణం
[ 17-05-2024]
తాండూరు నియోజకవర్గానికి తొలిసారిగా ‘బాహ్య వలయ రహదారి’ మంజూరైంది. -
సౌకర్యాలు కరవాయె.. రైతన్నకు దిగులాయె
[ 17-05-2024]
ధాన్యం సేకరణ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నటు అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో అరకొరగానే ఉన్నాయి. -
కులగణన ప్రక్రియ సత్వరం చేపట్టండి
[ 17-05-2024]
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టి బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. -
పురపాలికగా మహేశ్వరం!
[ 17-05-2024]
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం పురపాలికగా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు 19
[ 17-05-2024]
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. -
సోమాలియా బాలిక కడుపులో 3.75 కిలోల కణితి తొలగింపు
[ 17-05-2024]
సోమాలియా దేశానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక కడుపులో ఉన్న భారీ కణితిని సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించి ఆమెకు ఊరట కల్పించారు. -
సుంకిశాల పనుల్లో జాప్యంపై ఆరా
[ 17-05-2024]
నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై జలమండలి దృష్టి సారించింది. -
‘ఉచిత బియ్యం పంపిణీపై అవగాహన కరవు’
[ 17-05-2024]
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
పోలింగ్పై ఎడతెగని సమీక్ష
[ 17-05-2024]
చేవెళ్ల లోక్ సభకు సంబంధించి ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు పూర్తయ్యాయి. -
పోగొట్టుకున్న 300కళ్లద్దాల ఫ్రేమ్ల అప్పగింత
[ 17-05-2024]
రైల్లో పోగొట్టుకున్న 300 కళ్లద్దాల ఫ్రేమ్ల సెట్లను ఆర్పీఎఫ్ పోలీసులు బాధితునికి అప్పగించిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్లో గురువారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
యాసిడ్ కలిపిన నీటితో స్నానం.. విద్యార్థినికి గాయాలు
-
వందనమమ్మా.. డాక్టర్ రవళి
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్