వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు.
జిల్లాలో 2,77,723 ఎకరాల్లో పంటల అంచనా
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా వరి పంటకు పెద్దపీట వేశారు. గతేడాది కంటే సాగు విస్తీర్ణం స్వల్పంగా పెంచుతూ ప్రతిపాదించారు. రైతులకు అవసరమైన విత్తనాలు సమకూరుస్తూనే ఉద్యాన పంటలైన ఆయిల్పామ్, మామిడి, కూరగాయల సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా పర్యవేక్షిస్తున్నారు.
ఇసుక మేటలతో తగ్గనున్న విస్తీర్ణం
గోదావరి, మానేరు, హుస్సేన్మియా, మానేరు పరీవాహక ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో వరి సాగవుతోంది. గడిచిన మూడేళ్ల సాగు గణాంకాలు పరిశీలిస్తే విస్తీర్ణం స్వల్పంగా పెరుగుతోంది. 2022-23లో 1,93,200 ఎకరాలు, 2023-24లో 2,77,003 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 2,77,723 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఆయకట్టు ప్రాంతం కావడంతో పప్పుదినుసుల సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవలి కాలంలో కొందరు ఆయిల్సామ్ సాగుకు ముందుకొస్తున్నారు. జిల్లాలో 2,500 ఎకరాల్లో మొక్కలు నాటుతారని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలకు గోదావరి, మానేరు పరీవాహక ప్రాంతంలోని పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో ఈసారి సాగు విస్తీర్ణం కొద్దిగా తగ్గనుందని భావిస్తున్నారు.
కృత్రిమ కొరత లేకుండా..
జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరి, పత్తి, ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. రాయితీ విత్తనాలను కూడా సమకూరుస్తున్నారు. ఇప్పటికే 24,384 మెట్రిక్ టన్నుల డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ పొటాష్, ఇతర ఎరువులు నిల్వ ఉన్నాయి. వీటితో పాటు 32,082 మెట్రిక్ టన్నుల యూరియా, 8,280 మెట్రిక్ టన్నుల డీఏపీ, 24,579 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 6,889 మెట్రిక్ టన్నుల పొటాష్ అవసరమవుతాయి. సీజన్లో కీలక సమయంలో కొందరు డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నకిలీ ఉత్పాదకాలపై నిఘా
జిల్లాలో వాతావరణ పరిస్థితులకనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించాం. చీడపీడలు, తెగుళ్లు నివారణకు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. నకిలీ ఎరువులు, విత్తనాల విక్రయంపై నిఘా పెంచి టాస్క్ఫోర్స్ కమిటీలతో తనిఖీ చేయనున్నాం. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు.
-ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరపాలక కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. -
ఉద్యమస్ఫూర్తి.. చైతన్యకీర్తి
[ 02-06-2024]
పల్లె గొంతెత్తింది.. పట్నం కదిలింది.. రోడ్లు స్తంభించాయి.. వంటావార్పులకు దారులే అడ్డాగా మారాయి. -
జై బోలో హనుమాన్కీ
[ 02-06-2024]
‘ఓం శ్రీరామ జయరామ జయజయ రామా.. రామలక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్కీ..’ నినాదాలతో అంజన్న క్షేత్రం మారుమోగింది. -
బడిబాటకు వేళాయె!
[ 02-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రతీ సంవత్సరం లాగానే ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని రూపొందించింది. -
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ
[ 02-06-2024]
సింగరేణిలో మరో పంచ్ ఎంట్రీ గని ఏర్పాటు చేయనున్నారు. -
మూత ‘బడి’కి మోక్షం!
[ 02-06-2024]
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి పంచాయతీలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనవరిలోనే విద్యాశాఖను ఆదేశించారు. -
సాంకేతిక కోర్సులు.. ఉపాధికి బాటలు
[ 02-06-2024]
వారంతా పాఠశాల స్థాయిలో నేర్చుకున్న పాఠాలను ఉపాధి, ఉద్యోగాలుగా మలుచుకోవడానికి వచ్చిన అభ్యర్థులు. -
పుస్తక పఠనం.. బాలల వికాసం
[ 02-06-2024]
నేటికాలం పిల్లలు పాఠ్యపుస్తకాలు తప్పితే కథలు, గేయాలు, జీవిత చరిత్రలు వంటి ఆలోచింపజేసే పుస్తకాలకు దూరంగా ఉంటున్నారు. -
5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
[ 02-06-2024]
నకిలీ విత్తనాలు అక్రమంగా రవాణా చేసిన నిందితులను శనివారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్