సిద్ధు మనుగడకే సవాల్
తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో విస్తరించిన చామరాజనగర (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గం అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది.
చామరాజనగరలో హోరాహోరీ
సునీల్బోస్ (కాంగ్రెస్) , బాలరాజ్ (భాజపా)
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో విస్తరించిన చామరాజనగర (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గం అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ విధానసభ సెగ్మెంట్ దీని పరిధిలోకే వస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఆయనకు ఓ సవాల్గా పరిణమించింది. తొలి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వరుణ సెగ్మెంట్లో గత ఎన్నికలకన్నా ఎక్కువ మెజార్టీ ఓట్లు వస్తే తన సీటు భద్రమనే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు రాజకీయరంగంలో దూమరాన్ని సృష్టించాయి. మంత్రి డాక్టర్ మహదేవప్ప కుమారుడు సునీల్బోస్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి. భాజపా అభ్యర్థిగా బాలరాజ్ పోటీలో ఉన్నారు. సునీల్బోస్ కోసం మంత్రి డాక్టర్ మహదేవప్ప పావులు కదుపుతున్నారు. మొన్నటి వరకు బద్ధశత్రువులుగా ఉన్న భాజపా సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ప్రసాద్ ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా వెళ్లి ఆరోగ్య యోగక్షేమాలను విచారించి కాంగ్రెస్ అభ్యర్థ్థి సునీల్బోస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఒకప్పుడు నరహంతకుడు వీరప్పన్ తిరగాడిన ప్రదేశమే చామరాజనగర జిల్లా. ఇక్కడ దళిత, లింగాయత, కురుబ వర్గాలకు చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. 1952లో ఎన్.రాచయ్య, 1957 నుంచి 1977 వరకు ఎస్ఎం సిద్ధయ్య, 1977లో బి.రాచయ్య,. 1980, 1984, 1989, 1991, 1999, 2019లో శ్రీనివాస్ప్రసాద్ విజయాలు నమోదు చేశారు. మధ్యలో.. 2009, 2014లో ధ్రువనారాయణ (కాంగ్రెస్) లోక్సభ సభ్యులుగా కొనసాగారు. 2014 లోక్సభ ఎన్నికల్లో కేవలం 179 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్- భాజపా మధ్య పోటీ పతాక స్థాయిలో కొనసాగుతోంది.
చాముండేశ్వరి దేవి దేవస్థానం
విధానసభ నియోజకవర్గాలు : హెచ్.డి.కోట, నంజునగూడు, వరుణ, టి.నరసిపుర, హానూరు, కొళ్లేగాల, చామరాజనగర, గుండ్లుపేట.
ఓటర్లు : 16,67,044 మంది, పురుషులు - 8,32,382 మంది, మహిళలు- 8,32,541 మంది, ఇతరులు 111 మంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసనలో మానహననం?.. ప్రజ్వల్ విచారణ దారెటు?
[ 02-05-2024]
ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల చూపంతా హాసనవైపు మళ్లింది. ప్రచార సంబంధంలేని వ్యవహారం.. అందరి సామాజిక మాధ్యమాలనూ ముంచెత్తుతోంది. కొందరు మహిళలతో స్థానిక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహరించిన తీరే చర్చకు కారణం. -
నేతల దూకుడు.. మాటల చెడుగుడు
[ 02-05-2024]
మరో నాలుగు రోజుల్లో బహిరంగ ప్రచారం ముగుస్తుండటంతో జాతీయ నేతలు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొద్ది సమయంలోనే ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
ఆ పాస్పోర్ట్ రద్దు చేయండి
[ 02-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ పాస్పోర్ట్ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఓ లేఖ రాశారు. -
ఉమేశ్ జాదవ్కు అస్వస్థత
[ 02-05-2024]
కలబురగి-బెంగళూరు రహదారిపై బుధవారం ధర్నా చేస్తున్న సమయంలో లోక్సభ సభ్యుడు ఉమేశ్ జాదవ్ కళ్లుతిరిగి పడిపోయారు. చికిత్స కోసం ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. -
తల్లీ, కుమారుడి సన్యాసదీక్ష
[ 02-05-2024]
రాజధాని నగరంలో ప్రముఖ వ్యాపారి మనీశ్ భార్య, కుమారుడు ఇద్దరూ జైన సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయన భార్య స్వీటీ (30), కుమారుడు హృధన్ జైన్ (11)లకు జైన గురువులు దీక్ష ఇచ్చారు. -
పూర్వ గోవింద ‘కీర్తన’
[ 02-05-2024]
శ్రీరామ కోటి తరహాలో బెంగళూరుకు చెందిన కీర్తన (17) అనే బాలిక ‘గోవింద కోటి’ని రాసి తిరునగరి తిరుమలలో ఓ మెరుపు మెరిసిన వేళ.. కన్నడిగుల అభినందనలు వెల్లువెత్తాయి. -
‘సిద్ధు నాకు మద్దతిచ్చారు’
[ 02-05-2024]
శాసనసభ ఎన్నికల్లో సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ గంగావతి, బళ్లారిలో తనతో చేతులు కలిపి మద్దతు ఇచ్చారని శాసనసభ్యుడు గాలి జనార్దన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి రాలేదన్నారు. -
ఆ వ్యాఖ్యలు సలసలా ‘కాగె’
[ 02-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘లేకుంటే’ మరో వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయలేడన్నట్లు భాజపా ప్రచారం చేసుకుంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
పాకిస్థానీ యువత.. మోదీలాంటి నేతనే కోరుతోంది
[ 02-05-2024]
పాకిస్థానీ యువత సైతం ప్రధాని నరేంద్రమోదీ లాంటి నేతను కోరుకుంటోందని భాజపా నేత సి.టి.రవి పేర్కొన్నారు. ఆయన బుధవారం గంగావతిలో భాజపా అభ్యర్థి ప్రచారసభలో పాల్గొని మాట్లాడారు. -
విజయం.. ఓ వెన్నదోసె!
[ 02-05-2024]
దావణగెరె.. కన్నడిగుల మాంచెస్టర్ నగరిగా ఒకనాడు ప్రసిద్ధి! లెక్కకు మించిన వస్త్ర పరిశ్రమలతో.. వేలాది కార్మికులతో.. నిత్యం ఎర్రజెండాల రెపరెపలతో కళకళలాడిన నగరి నేడు ఆధునికీకరణ దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు దావణగెరె పేరుచెబితే.. కన్నడిగులు లొట్టలేసుకుంటారు.