సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది.
నేటితో ముగియనున్న విద్యా సంవత్సరం
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. రాబోయే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. చివరి పనిదినం మొదలు పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తిచేయాల్సిన పనులపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. వారు చేయాల్సిన పనుల గురించి వివరించింది.
డ్రాపౌట్ లేకుండా..
ప్రాథమిక పాఠశాలల్లో ఐదోతరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నూరు శాతం పైతరగతుల్లో చేరేలా ఆయా పాఠశాలల హెచ్ఎంలు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు పైతరగతుల్లో చేరకుండా డ్రాపౌట్గా మారుతున్నారు. ఈనేపథ్యంలో అందరు విద్యార్థులు బడిలో తిరిగి చేరేలా కృషి చేయాలని సంబంధిత హెచ్ఎంలకు ప్రభుత్వం సూచించింది.
బియ్యం పాడవకుండా..
పాఠశాల చివరి పనిదినం తర్వాత మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం నిల్వలు ఉంటాయి. క్వింటాళ్ల కొద్దీ బియ్యం పాడవకుండా, ఎలుకలు తినకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.
పనుల పరిశీలనకు...
ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో ఈ పనులు చూసుకునేందుకు ప్రధానోపాధ్యాయులు లేదా ఎవరైనా ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి.
మధిర మండలం వంగవీడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మార్కుల పత్రాలతో విద్యార్థులు
సమ దుస్తుల కొలతలు...
జూన్లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు సమ దుస్తులు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వేసవి సెలవుల దృష్ట్యా విద్యార్థులు అందుబాటులో ఉండరు. కాబటి ఇప్పుడే వారి దుస్తులకు సంబంధించిన కొలతలను తీసుకుంటారు.
సకాలంలో పాఠ్య పుస్తకాలు
పాఠ్య పుస్తకాల సరఫరాలో ఏటా కొంత జాప్యం జరుగుతోంది. ఈసారి దీన్ని నివారించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్స్, నోట్ పుస్తకాలను జిల్లాలోని పాఠ్యపుస్తకాల గోదాముకు తెప్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ముద్రణ పూర్తయ్యింది.
నేడు ఫలితాల ప్రకటన
తల్లిదండ్రులు, విద్యార్థులతో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేస్తారు. ఏడాది పాటు విద్యార్థి ప్రగతిపై చర్చిస్తారు. తరగతుల వారీగా ఉత్తీర్ణులైన వివరాల జాబితాను విడుదల చేస్తారు
ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగింత
పాఠశాలల చివరి పని దినం రోజు, వేసవి సెలవుల్లోనూ చేయాల్సిన పనుల గురించి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరు ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన విషయంలోనూ శ్రద్ధ కనబరచాలి.
జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య (సుమారుగా)
భద్రాద్రి: 60,000
ఖమ్మం: 68,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జన జాతరకు సర్వం సిద్ధం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధృతం చేస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానంలో పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
ఓట్ల పండుగ.. బాధ్యతలు మెండుగా!
[ 04-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ అత్యంత కీలకమైన అంశం. పౌరులు తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే ప్రక్రియలో ఓటరు నమోదు నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం కీలకంగా వ్యవహరిస్తుంది. -
ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదు: తుమ్మల
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో తుమ్మల మాట్లాడారు. -
‘ప్రజాదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలి’
[ 04-05-2024]
భారాసపై ప్రజల్లో ఉన్న ఆదరణను ఓటుబ్యాంకుగా మల్చుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని భారాస జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసలో కుదుపు
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మంలో వలసలు భారాసను కుదిపేస్తున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వరుస కట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. -
భాజపా గెలిస్తేనే ఖమ్మం అభివృద్ధి: తాండ్ర
[ 04-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపా గెలిస్తేనే నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఖమ్మం టూటౌన్లో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
టేబుల్ టెన్నిస్లో పేట విద్యార్థుల సత్తా
[ 04-05-2024]
‘క్రీడలు ఏవైనా పతకాలు మనకే’ అన్నట్లు కొంతకాలంగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు. తాజాగా రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్లో ‘పేట’ విద్యార్థులు ఛాంపియన్లుగా నిలిచారు. -
నీటిసంపులో పడి బాలుడు మృతి
[ 04-05-2024]
ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం: తుమ్మల
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా మార్చి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
దేశ సుభిక్షానికి మోదీ పాలన అవసరం
[ 04-05-2024]
దేశ సుభిక్షానికి మోదీ పాలన మళ్లీ అవసరమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి సీతారాంనాయక్ తెలిపారు. మణుగూరు, అశ్వాపురంలో శుక్రవారం ప్రచారం చేశారు. -
రెప్పపాటు నిర్లక్ష్యంతో ప్రాణాలు గాలిలో!
[ 04-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యంతో క్షణాల్లో సంభవించే విద్యుత్తు ప్రమాదాలు ఏకంగా ప్రాణనష్టాన్ని తెచ్చిపెడతాయి. విద్యుదాఘాతాలు నిండు నూరేళ్ల జీవితాన్ని ఎలా బలితీసుకుంటాయి? దానివల్ల బాధిత కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో గుర్తించేందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్: నామా
[ 04-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!